Political News

‘తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బాగుప‌డింది’

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. తెలంగాణ స‌ర్కారు తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నాగ‌ర్ క‌ర్నూలులో బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన స‌భ‌లో తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర వ్యాఖ్య‌లు రువ్వారు. తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బాగు ప‌డింద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఎంతో మంది ప్రాణాలకు తెగించి.. మ‌రీ పోరాడార‌ని.. అలా సాధించుకున్న తెలంగాణ‌ను కేసీఆర్ స‌ర్కారు నాశ‌నం చేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ ప్ర‌భుత్వం .. కేంద్రంపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని తెలిపారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని.. చెప్పారు.

వాస్త‌వానికి కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం తెలంగాణ‌కు ఎంతో చేసింద‌ని న‌డ్డా చెప్పారు. భారీగా నిధులు ఇచ్చింద‌ని,గ‌త తొమ్మిదే ళ్ల‌లో వేల కోట్ల రూపాయ‌ల సొమ్మును తెలంగాణ‌కు ఇచ్చింద‌ని.. అయితే.. ఈ నిధుల‌ను స‌క్ర‌మంగా ఖ‌ర్చు చేయ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని న‌డ్డా దుయ్య‌బట్టారు. కిసాన్ స‌మ్మాన్ నిధితో కేంద్ర ప్ర‌భుత్వంతెలంగాణ‌లోని రైతుల‌ను ఆదుకున్న మాట నిజం కాదా? అని న‌డ్డా ప్ర‌శ్నించారు. కేంద్రంలో పాల‌న ప్రారంభించిన న‌రేంద్ర మోడీ.. దేశంలో పేద‌రికంపై యుద్ధం చేసి.. దానిని పార‌దోలే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసం ప్ర‌ధాని మోడీ కృషి చేస్తున్నార‌ని న‌డ్డా చెప్పారు. అంతేకాకుండా.. తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ను కూడా రెడీ చేస్తున్నార‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం మోడీవైపే ఉంద‌ని.. భార‌తీయులు అంద‌రూ మోడీ వెంటే న‌డుస్తున్నార‌ని తెలిపారు. నిధులు, నీళ్లు, నియామ‌కాలు పేరుతో ఏర్ప‌డిన‌ తెలంగాణ‌లో ఇప్పుడు వీటిని ప‌ట్టించుకునే వారే లేకుండా పోయార‌ని.. కేసీఆర్ త‌న ఇంటికి నీళ్లు.. త‌న ఫామ్ హౌస్‌కు నిధులు.. త‌న కుటుంబానికి నియామ‌కాలు ఇస్తూ.. తెలంగాణ‌ను స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని.. న‌డ్డా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. తెలంగాణలో బీజేపీ ప్ర‌భుత్వం వ‌స్తే.. అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామ‌ని.. న‌డ్డా చెప్పారు. ఇక్క‌డి పేద‌రికాన్ని రూపుమాపేందుకు, రైతుల‌కు మేలు చేసేందుకు బీజేపీ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. కుటుంబ పాల‌న‌కు బీజేపీ వ్య‌తిరేక‌మ‌ని.. కేసీఆర్ కుటుంబ పాల‌న‌తో రాష్ట్రం అభివృద్దికి ఆమ‌డ దూరంలో ఉంద‌ని చెప్పారు. అందుకే కుటుంబ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడి బీజేపీకి ప‌ట్టం క‌ట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

This post was last modified on June 26, 2023 8:53 am

Share

Recent Posts

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

1 hour ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

2 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

5 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

5 hours ago

చివరి సినిమా టోటల్ కలెక్షన్లు… ఒక్క రోజులోనే ఔట్

మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…

5 hours ago

సందీప్ వెర్సస్ దీపిక… మళ్లీ రాజుకుంది

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…

5 hours ago