Political News

‘తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బాగుప‌డింది’

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. తెలంగాణ స‌ర్కారు తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నాగ‌ర్ క‌ర్నూలులో బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన స‌భ‌లో తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర వ్యాఖ్య‌లు రువ్వారు. తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బాగు ప‌డింద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఎంతో మంది ప్రాణాలకు తెగించి.. మ‌రీ పోరాడార‌ని.. అలా సాధించుకున్న తెలంగాణ‌ను కేసీఆర్ స‌ర్కారు నాశ‌నం చేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ ప్ర‌భుత్వం .. కేంద్రంపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని తెలిపారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని.. చెప్పారు.

వాస్త‌వానికి కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం తెలంగాణ‌కు ఎంతో చేసింద‌ని న‌డ్డా చెప్పారు. భారీగా నిధులు ఇచ్చింద‌ని,గ‌త తొమ్మిదే ళ్ల‌లో వేల కోట్ల రూపాయ‌ల సొమ్మును తెలంగాణ‌కు ఇచ్చింద‌ని.. అయితే.. ఈ నిధుల‌ను స‌క్ర‌మంగా ఖ‌ర్చు చేయ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని న‌డ్డా దుయ్య‌బట్టారు. కిసాన్ స‌మ్మాన్ నిధితో కేంద్ర ప్ర‌భుత్వంతెలంగాణ‌లోని రైతుల‌ను ఆదుకున్న మాట నిజం కాదా? అని న‌డ్డా ప్ర‌శ్నించారు. కేంద్రంలో పాల‌న ప్రారంభించిన న‌రేంద్ర మోడీ.. దేశంలో పేద‌రికంపై యుద్ధం చేసి.. దానిని పార‌దోలే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసం ప్ర‌ధాని మోడీ కృషి చేస్తున్నార‌ని న‌డ్డా చెప్పారు. అంతేకాకుండా.. తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్‌ను కూడా రెడీ చేస్తున్నార‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం మోడీవైపే ఉంద‌ని.. భార‌తీయులు అంద‌రూ మోడీ వెంటే న‌డుస్తున్నార‌ని తెలిపారు. నిధులు, నీళ్లు, నియామ‌కాలు పేరుతో ఏర్ప‌డిన‌ తెలంగాణ‌లో ఇప్పుడు వీటిని ప‌ట్టించుకునే వారే లేకుండా పోయార‌ని.. కేసీఆర్ త‌న ఇంటికి నీళ్లు.. త‌న ఫామ్ హౌస్‌కు నిధులు.. త‌న కుటుంబానికి నియామ‌కాలు ఇస్తూ.. తెలంగాణ‌ను స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని.. న‌డ్డా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. తెలంగాణలో బీజేపీ ప్ర‌భుత్వం వ‌స్తే.. అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామ‌ని.. న‌డ్డా చెప్పారు. ఇక్క‌డి పేద‌రికాన్ని రూపుమాపేందుకు, రైతుల‌కు మేలు చేసేందుకు బీజేపీ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. కుటుంబ పాల‌న‌కు బీజేపీ వ్య‌తిరేక‌మ‌ని.. కేసీఆర్ కుటుంబ పాల‌న‌తో రాష్ట్రం అభివృద్దికి ఆమ‌డ దూరంలో ఉంద‌ని చెప్పారు. అందుకే కుటుంబ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడి బీజేపీకి ప‌ట్టం క‌ట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

This post was last modified on June 26, 2023 8:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

5 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

10 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

11 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

11 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

11 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

13 hours ago