Political News

ఎవరీ లాస్య నందిత?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ సిటింగులతో పాటు ఇతర నేతలు కూడా టికెట్ల దృష్టితోనే రాజకీయాలు చేస్తున్నారు.. అధిష్టానం దృష్టిలో పడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఈసారి కొత్త ముఖాలు పార్టీ ఆఫీసుల్లో కనిపిస్తున్నాయి.

కార్పొరేటర్లలోనూ చాలామంది ఎమ్మెల్యే టికెట్లపై ఆశ పెట్టుకున్నప్పటికీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం కార్పొరేటర్లను అసెంబ్లీ వైపు చూడొద్దని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. సిటింగులకు టికెట్లు ఇస్తామని పార్టీ పెద్దలు ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలు ఏమాత్రం ఆపడం లేదు. గ్రేటర్ పరిధిలో ఈసారి వారసుల ఎంట్రీ కూడా బాగానే ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు రోహిత్‌ను పోటీ చేయించాలని ట్రై చేస్తున్నారు. ఆయన ఇంకా టికెట్ హామీ దొరకనప్పటికీ మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో రోహిత్ నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ హడావుడి చేస్తున్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా తన కుమారు జయసింహకు టికెట్ కోరుతున్నారు.
ఇకపోతే మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి రాజేంద్ర నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట.

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కూడా తాను కాకుండా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌ను ఇప్పటికే కోరారని.. దానికి కేసీఆర్ అంగీకరించలేదని చెప్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శాయన్న కుమార్తె లాస్య నందిత వచ్చే ఎన్నికల బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్రహింపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

కంటోన్మెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడి ఎమ్మెల్యే శాయన్న ఇటీవల మరణించడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. రానున్న ఎన్నికలలో శాయన్న కుమార్తె లాస్య నందితను అక్కడి నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. అయితే.. ఇక్కడ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. నందిత సాయన్న చిన్న కుమార్తె.

ఈమె 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే.. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మాత్రం ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి వెంటే ఉంటూ నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. కానీ, సాయన్న మరణం తరువాత ఆయన అనుచరులు, బీఆర్ఎస్ నేతలు కొందరు నందితకు సహకరించడం లేదని.. వారు నందితకు కాకుండా తమకే టికెట్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పెద్దలను కోరుతున్నారని తెలుస్తోంది.

This post was last modified on June 25, 2023 4:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

2 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

3 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

3 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

3 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

3 hours ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

4 hours ago