Political News

ష‌ర్మిల లేదు.. గిర్మిల లేదు.. పోవాయ్‌!!

“ష‌ర్మిల లేదు.. గిర్మిలా లేదు.. పోవాయ్!! గామెను ఏపీలోకి పొమ్మ‌ను. అక్క‌డ బాగుంట‌ది” అని తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు వీ. హ‌నుమంత‌రావు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా ఆయ‌న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు.. ష‌ర్మిల‌ను ఉద్దేశించి.. వ్యాఖ్యానించారు. ముందుగా ష‌ర్మిల ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని.. ఇటీవ‌ల కాలంలో పేప‌ర్ల‌లో ఎవ‌రో ఏదో రాస్తున్నార‌ని వ్యాఖ్యానించిన వీహెచ్‌.. మీడియా ప్ర‌తినిధులు వైఎస్ కుమార్తె అని గుర్తు చేయ‌డంతో.. “`ఆ.. ఆ.. ఆమెనా.. వైఎస్ కూతురా?” అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇక‌, షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తనకు తెలియదని వీ. హ‌నుమంత‌రావు చెప్పుకొచ్చారు. అయినా తెలంగాణలో కంటే ఏపీలో ఉంటేనే షర్మిలకు ఉపయోగమని సూచించారు. “గిక్క‌డ ఆమెకు బోన‌మెత్తుట తెల్సా.. తెలంగాణ యాస తెలుసా? బాస తెలుసా?.. గేం చూసి ఆమె రాజ‌కీయం చేస్త‌ది. మాకు అవ‌స‌రం లేదు. ఆమె వ‌స్తానంటే.. ఎవ‌రు మాత్రం రానిస్త‌రు” అని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఇక‌, ఎన్నిక‌ల ముంగిట‌ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లడం లేదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కి వేవ్ స్టార్ట్ అయిందన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్యంగా ముందుకు సాగుతున్నామ‌న్నారు.

ఎవరి నోట చూసినా కాంగ్రెస్ పేరే వినిపిస్తోందని వీహెచ్‌ వివరించారు. ముస్లింలు కాంగ్రెస్ వైపే ఉన్నారని.. ఎందుకంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. ఎన్నికల కోసమే బీసీ బంధు తీసుకొచ్చారని.. లక్ష రూపాయలు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని సీఎం కేసీఆర్‌పై ఆయ‌న విమర్శ‌లు గుప్పించారు. హెచ్‌సీఏ భూముల లీజు తీసేసి.. రాజీవ్ పేరు తొలగించాలని చూస్తున్నారని, దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ అడ్డుకుని తీరుతామ‌ని చెప్పారు.

‘‘సేవ్ డెమోక్రసీ పేరుతో పాట్నాలో విపక్షాల సమావేశం జరిగింది. నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేయాలనుకోవడం స్వాగతిస్తున్నా. సిమ్లాలో ఖర్గే నేతృత్వంలో మరోసారి సమావేశం జరగనుంది. మోడీ ఆగడాలు ఆపాలంటే అన్ని పార్టీలు కలవాలి. పబ్లిక్ సెక్టర్ అమ్మివేస్తుంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్స్ ఉండవు. 2024లో మోడీ పోయి రాహుల్ ప్రధాని కావాలి.’’ అని వీహెచ్ ఆకాంక్షించారు. ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉందో తన‌కు తెలియ‌ద‌ని.. అక్క‌డ‌కూడా పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పారు.

This post was last modified on June 25, 2023 10:51 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago