Political News

ష‌ర్మిల లేదు.. గిర్మిల లేదు.. పోవాయ్‌!!

“ష‌ర్మిల లేదు.. గిర్మిలా లేదు.. పోవాయ్!! గామెను ఏపీలోకి పొమ్మ‌ను. అక్క‌డ బాగుంట‌ది” అని తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు వీ. హ‌నుమంత‌రావు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా ఆయ‌న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు.. ష‌ర్మిల‌ను ఉద్దేశించి.. వ్యాఖ్యానించారు. ముందుగా ష‌ర్మిల ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని.. ఇటీవ‌ల కాలంలో పేప‌ర్ల‌లో ఎవ‌రో ఏదో రాస్తున్నార‌ని వ్యాఖ్యానించిన వీహెచ్‌.. మీడియా ప్ర‌తినిధులు వైఎస్ కుమార్తె అని గుర్తు చేయ‌డంతో.. “`ఆ.. ఆ.. ఆమెనా.. వైఎస్ కూతురా?” అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇక‌, షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తనకు తెలియదని వీ. హ‌నుమంత‌రావు చెప్పుకొచ్చారు. అయినా తెలంగాణలో కంటే ఏపీలో ఉంటేనే షర్మిలకు ఉపయోగమని సూచించారు. “గిక్క‌డ ఆమెకు బోన‌మెత్తుట తెల్సా.. తెలంగాణ యాస తెలుసా? బాస తెలుసా?.. గేం చూసి ఆమె రాజ‌కీయం చేస్త‌ది. మాకు అవ‌స‌రం లేదు. ఆమె వ‌స్తానంటే.. ఎవ‌రు మాత్రం రానిస్త‌రు” అని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఇక‌, ఎన్నిక‌ల ముంగిట‌ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లడం లేదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కి వేవ్ స్టార్ట్ అయిందన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్యంగా ముందుకు సాగుతున్నామ‌న్నారు.

ఎవరి నోట చూసినా కాంగ్రెస్ పేరే వినిపిస్తోందని వీహెచ్‌ వివరించారు. ముస్లింలు కాంగ్రెస్ వైపే ఉన్నారని.. ఎందుకంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. ఎన్నికల కోసమే బీసీ బంధు తీసుకొచ్చారని.. లక్ష రూపాయలు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని సీఎం కేసీఆర్‌పై ఆయ‌న విమర్శ‌లు గుప్పించారు. హెచ్‌సీఏ భూముల లీజు తీసేసి.. రాజీవ్ పేరు తొలగించాలని చూస్తున్నారని, దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ అడ్డుకుని తీరుతామ‌ని చెప్పారు.

‘‘సేవ్ డెమోక్రసీ పేరుతో పాట్నాలో విపక్షాల సమావేశం జరిగింది. నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేయాలనుకోవడం స్వాగతిస్తున్నా. సిమ్లాలో ఖర్గే నేతృత్వంలో మరోసారి సమావేశం జరగనుంది. మోడీ ఆగడాలు ఆపాలంటే అన్ని పార్టీలు కలవాలి. పబ్లిక్ సెక్టర్ అమ్మివేస్తుంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్స్ ఉండవు. 2024లో మోడీ పోయి రాహుల్ ప్రధాని కావాలి.’’ అని వీహెచ్ ఆకాంక్షించారు. ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉందో తన‌కు తెలియ‌ద‌ని.. అక్క‌డ‌కూడా పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పారు.

This post was last modified on June 25, 2023 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

4 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

4 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

4 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

5 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

7 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

8 hours ago