ఏపీలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.. పథకాలకు అర్హులై ఉండి కూడా.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పథకాలు అందని వారు.. ఇప్పటికీ కొన్ని పథకాల గురించి తెలియనివారికి వాటిని తెలియజేసి.. వాటి దిశగా లబ్ధిపొందని వారికి అవగాహన కల్పించి.. తిరిగి వారికి పథకాలు అందించాలనేది ప్రధాన ఉద్దేశం.
దీనికి సంబంధించి సీఎం జగన్ అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. అంతా బాగానే ఉంది.. ఇక, ఈ కార్యక్రమానికి సంబంధించి.. వలంటీర్లు… గృహసారథులు.. వంటి వారిని లైన్లో పెడుతున్నారు. వారంతా కూడా లబ్ధి పొందని వారిని గుర్తించి.. వారికి ఆయా పథకాలు వివరించి.. వాటిని అందిస్తారు. ఇక, ఇతర విలువైన పత్రాలు.. వంటివాటినికూడా ఇంటికే చేర్చేలా ఈ జగనన్న సురక్షను తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం చెబుతోంది.
అయితే.. దీనిని కొంతలోతుగా చూస్తే.. మరో కీలక విషయం బయటపడుతోందని అంటున్నారు టీడీపీ నాయకులు. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ఎత్తున జల్లెడ పట్టి మరీ… అందని వారికి లబ్ధి చేకూర్చడం వెనుక ఏదో జరుగుతోందని వారు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే పరిశీలన చేసిన కొందరు నాయకులు.. సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. వైసీపీకి వ్యతిరేకంగా.. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును గుర్తించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అంటున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ సానుకూల ఓటు బ్యాంకును గుర్తించి.. దానిని వైసీపీకి అనుకూలంగా మార్చాల నేది.. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో అంతర్లీనంగా ఉన్న ప్రధాన విషయమని టీడీపీ నాయకులు అంటున్నారు. అందుకే గృహసారథులు, వలంటీర్లను వినియోగించి.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును గుర్తించి.. తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఇదే నిజమైతే.. ప్రతిపక్షాలు ఏం చేస్తాయో చూడాలి.
This post was last modified on June 24, 2023 6:49 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…