ఏపీలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.. పథకాలకు అర్హులై ఉండి కూడా.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పథకాలు అందని వారు.. ఇప్పటికీ కొన్ని పథకాల గురించి తెలియనివారికి వాటిని తెలియజేసి.. వాటి దిశగా లబ్ధిపొందని వారికి అవగాహన కల్పించి.. తిరిగి వారికి పథకాలు అందించాలనేది ప్రధాన ఉద్దేశం.
దీనికి సంబంధించి సీఎం జగన్ అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. అంతా బాగానే ఉంది.. ఇక, ఈ కార్యక్రమానికి సంబంధించి.. వలంటీర్లు… గృహసారథులు.. వంటి వారిని లైన్లో పెడుతున్నారు. వారంతా కూడా లబ్ధి పొందని వారిని గుర్తించి.. వారికి ఆయా పథకాలు వివరించి.. వాటిని అందిస్తారు. ఇక, ఇతర విలువైన పత్రాలు.. వంటివాటినికూడా ఇంటికే చేర్చేలా ఈ జగనన్న సురక్షను తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం చెబుతోంది.
అయితే.. దీనిని కొంతలోతుగా చూస్తే.. మరో కీలక విషయం బయటపడుతోందని అంటున్నారు టీడీపీ నాయకులు. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ఎత్తున జల్లెడ పట్టి మరీ… అందని వారికి లబ్ధి చేకూర్చడం వెనుక ఏదో జరుగుతోందని వారు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే పరిశీలన చేసిన కొందరు నాయకులు.. సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. వైసీపీకి వ్యతిరేకంగా.. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును గుర్తించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అంటున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ సానుకూల ఓటు బ్యాంకును గుర్తించి.. దానిని వైసీపీకి అనుకూలంగా మార్చాల నేది.. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో అంతర్లీనంగా ఉన్న ప్రధాన విషయమని టీడీపీ నాయకులు అంటున్నారు. అందుకే గృహసారథులు, వలంటీర్లను వినియోగించి.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును గుర్తించి.. తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఇదే నిజమైతే.. ప్రతిపక్షాలు ఏం చేస్తాయో చూడాలి.
This post was last modified on June 24, 2023 6:49 pm
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…