ఏపీలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.. పథకాలకు అర్హులై ఉండి కూడా.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పథకాలు అందని వారు.. ఇప్పటికీ కొన్ని పథకాల గురించి తెలియనివారికి వాటిని తెలియజేసి.. వాటి దిశగా లబ్ధిపొందని వారికి అవగాహన కల్పించి.. తిరిగి వారికి పథకాలు అందించాలనేది ప్రధాన ఉద్దేశం.
దీనికి సంబంధించి సీఎం జగన్ అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. అంతా బాగానే ఉంది.. ఇక, ఈ కార్యక్రమానికి సంబంధించి.. వలంటీర్లు… గృహసారథులు.. వంటి వారిని లైన్లో పెడుతున్నారు. వారంతా కూడా లబ్ధి పొందని వారిని గుర్తించి.. వారికి ఆయా పథకాలు వివరించి.. వాటిని అందిస్తారు. ఇక, ఇతర విలువైన పత్రాలు.. వంటివాటినికూడా ఇంటికే చేర్చేలా ఈ జగనన్న సురక్షను తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం చెబుతోంది.
అయితే.. దీనిని కొంతలోతుగా చూస్తే.. మరో కీలక విషయం బయటపడుతోందని అంటున్నారు టీడీపీ నాయకులు. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ఎత్తున జల్లెడ పట్టి మరీ… అందని వారికి లబ్ధి చేకూర్చడం వెనుక ఏదో జరుగుతోందని వారు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే పరిశీలన చేసిన కొందరు నాయకులు.. సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. వైసీపీకి వ్యతిరేకంగా.. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును గుర్తించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అంటున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ సానుకూల ఓటు బ్యాంకును గుర్తించి.. దానిని వైసీపీకి అనుకూలంగా మార్చాల నేది.. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో అంతర్లీనంగా ఉన్న ప్రధాన విషయమని టీడీపీ నాయకులు అంటున్నారు. అందుకే గృహసారథులు, వలంటీర్లను వినియోగించి.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును గుర్తించి.. తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఇదే నిజమైతే.. ప్రతిపక్షాలు ఏం చేస్తాయో చూడాలి.
This post was last modified on June 24, 2023 6:49 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…