ఏపీలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.. పథకాలకు అర్హులై ఉండి కూడా.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పథకాలు అందని వారు.. ఇప్పటికీ కొన్ని పథకాల గురించి తెలియనివారికి వాటిని తెలియజేసి.. వాటి దిశగా లబ్ధిపొందని వారికి అవగాహన కల్పించి.. తిరిగి వారికి పథకాలు అందించాలనేది ప్రధాన ఉద్దేశం.
దీనికి సంబంధించి సీఎం జగన్ అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. అంతా బాగానే ఉంది.. ఇక, ఈ కార్యక్రమానికి సంబంధించి.. వలంటీర్లు… గృహసారథులు.. వంటి వారిని లైన్లో పెడుతున్నారు. వారంతా కూడా లబ్ధి పొందని వారిని గుర్తించి.. వారికి ఆయా పథకాలు వివరించి.. వాటిని అందిస్తారు. ఇక, ఇతర విలువైన పత్రాలు.. వంటివాటినికూడా ఇంటికే చేర్చేలా ఈ జగనన్న సురక్షను తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం చెబుతోంది.
అయితే.. దీనిని కొంతలోతుగా చూస్తే.. మరో కీలక విషయం బయటపడుతోందని అంటున్నారు టీడీపీ నాయకులు. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ఎత్తున జల్లెడ పట్టి మరీ… అందని వారికి లబ్ధి చేకూర్చడం వెనుక ఏదో జరుగుతోందని వారు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే పరిశీలన చేసిన కొందరు నాయకులు.. సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. వైసీపీకి వ్యతిరేకంగా.. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును గుర్తించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అంటున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ సానుకూల ఓటు బ్యాంకును గుర్తించి.. దానిని వైసీపీకి అనుకూలంగా మార్చాల నేది.. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో అంతర్లీనంగా ఉన్న ప్రధాన విషయమని టీడీపీ నాయకులు అంటున్నారు. అందుకే గృహసారథులు, వలంటీర్లను వినియోగించి.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును గుర్తించి.. తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఇదే నిజమైతే.. ప్రతిపక్షాలు ఏం చేస్తాయో చూడాలి.
This post was last modified on June 24, 2023 6:49 pm
పార్లమెంటులో డీలిమిటేషన్ సహా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు.. ఎంతసమయమైనా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంపై…
అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…
వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…
రేపు విడుదల కాబోతున్న పాపం ప్రతాప్ కు టైటిల్ కు తగ్గట్టే చివరి నిమిషం వరకు అయ్యో పాపం అనిపించే…
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను పునర్విభజించే డీలిమిటేషన్, అదేసమయంలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే 2023నాటి నారీ…
గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి…