Political News

‘జ‌గ‌న‌న్న సుర‌క్ష‌’: టీడీపీ ఎందుకు కంగారు పడుతుంది

ఏపీలో జ‌గ‌న‌న్న సుర‌క్ష‌ కార్య‌క్ర‌మాన్ని సీఎం జ‌గ‌న్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ఉద్దేశం.. ప‌థ‌కాల‌కు అర్హులై ఉండి కూడా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి ప‌థ‌కాలు అంద‌ని వారు.. ఇప్ప‌టికీ కొన్ని ప‌థ‌కాల గురించి తెలియ‌నివారికి వాటిని తెలియ‌జేసి.. వాటి దిశ‌గా ల‌బ్ధిపొంద‌ని వారికి అవ‌గాహ‌న క‌ల్పించి.. తిరిగి వారికి ప‌థ‌కాలు అందించాల‌నేది ప్ర‌ధాన ఉద్దేశం.

దీనికి సంబంధించి సీఎం జ‌గ‌న్ అధికారుల‌కు కూడా దిశానిర్దేశం చేశారు. అంతా బాగానే ఉంది.. ఇక‌, ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి.. వ‌లంటీర్లు… గృహ‌సార‌థులు.. వంటి వారిని లైన్‌లో పెడుతున్నారు. వారంతా కూడా ల‌బ్ధి పొంద‌ని వారిని గుర్తించి.. వారికి ఆయా ప‌థ‌కాలు వివ‌రించి.. వాటిని అందిస్తారు. ఇక‌, ఇత‌ర విలువైన ప‌త్రాలు.. వంటివాటినికూడా ఇంటికే చేర్చేలా ఈ జ‌గ‌న‌న్న సుర‌క్ష‌ను తీర్చిదిద్దిన‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది.

అయితే.. దీనిని కొంత‌లోతుగా చూస్తే.. మ‌రో కీల‌క విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంద‌ని అంటున్నారు టీడీపీ నాయకులు. ఎందుకంటే.. ఎన్నిక‌ల‌కు ముందు ఇంత పెద్ద ఎత్తున జ‌ల్లెడ ప‌ట్టి మరీ… అంద‌ని వారికి ల‌బ్ధి చేకూర్చ‌డం వెనుక ఏదో జ‌రుగుతోంద‌ని వారు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే ప‌రిశీల‌న చేసిన కొంద‌రు నాయ‌కులు.. సంచ‌ల‌న విష‌యాన్ని వెలుగులోకి తెచ్చారు. వైసీపీకి వ్య‌తిరేకంగా.. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును గుర్తించ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే టీడీపీ సానుకూల ఓటు బ్యాంకును గుర్తించి.. దానిని వైసీపీకి అనుకూలంగా మార్చాల నేది.. ఈ జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మంలో అంత‌ర్లీనంగా ఉన్న ప్ర‌ధాన విష‌య‌మ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. అందుకే గృహ‌సార‌థులు, వ‌లంటీర్ల‌ను వినియోగించి.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును గుర్తించి.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఈ విష‌యంలో ఇదే నిజ‌మైతే.. ప్ర‌తిప‌క్షాలు ఏం చేస్తాయో చూడాలి.

This post was last modified on June 24, 2023 6:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

3 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

6 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

8 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

9 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

9 hours ago