జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ముఖ్యమంత్రి కావాలన్నది తన ఆకాంక్ష కూడా అని ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం శాసన సభ్యుడు పినిపే విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన వ్యంగ్యాస్త్రం సంధించారో.. లేక నిజంగానే అన్నారో.. ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉన్నా.. ఆయన మాత్రం సీరియస్గానే వ్యాఖ్యానించారు.
తాజాగా తిరుమల శ్రీవారం దర్శనం చేసుకున్న మంత్రి పినిపే… కొండ మీద మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానంటూ మంత్రి వ్యాఖ్యానించా రు. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు మాత్రమే కాకుండా తానూ కోరుకుంటున్నా నన్నారు. రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చన్నారు. దీనికి ఎవరూ అడ్డు చెప్పబోరని అన్నారు. అయితే.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకూడదని వ్యాఖ్యానించారు.
పిఠాపురంలో వారాహి యాత్ర నిర్వహిస్తే.. ఎక్కడో ఉన్న విశాఖ వరకు కూడా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయని.. ఈ విషయాన్ని పవన్తెలుసుకోవాలని.. అందుకే ప్రభుత్వం కొన్ని జీవోలు తీసుకువచ్చిందని.. అయితే.. వాటిని కోర్టులు కొట్టివేశాయని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పవన్ యాత్రలు చేస్తే బాగుంటుందన్నారు. ఇక, ముఖ్యమంత్రి పీఠం అనేది.. ఎవరో ఇస్తే.. వచ్చేది కాదని.. ప్రజలు కూడా ముఖ్యమంత్రి పీఠం ఇవ్వరని చెప్పారు.
సీఎం కావాలంటే 175 స్థానాల్లో పోటీ చేసి 88స్థానాల్లో గెలిస్తే.. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ పక్ష నాయకుడిని ఎంచుకుంటే.. అప్పుడు పవన్ సీఎం అవ్వొచ్చని మంత్రి పినిపే తెలిపారు. పొత్తుతో 100 స్థానాల్లోనైనా పోటీ చేసి 50 స్థానాల్లోనైనా గెలవాలన్నారు. అప్పుడు పవన్కు ముఖ్యమంత్రి యోగం పడుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రెండు విధాలుగా సీఎం అవుతారని మంత్రి విశ్వరూప్ అన్నారు. అంతే తప్ప.. ప్రజలను అడిగి సీఎం అయిన వారు ఎవరూ లేరని.. అయితే.. ఎమ్మెల్యే కావొచ్చని మంత్రి చెప్పారు.
This post was last modified on June 24, 2023 6:26 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…