జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ముఖ్యమంత్రి కావాలన్నది తన ఆకాంక్ష కూడా అని ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం శాసన సభ్యుడు పినిపే విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన వ్యంగ్యాస్త్రం సంధించారో.. లేక నిజంగానే అన్నారో.. ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉన్నా.. ఆయన మాత్రం సీరియస్గానే వ్యాఖ్యానించారు.
తాజాగా తిరుమల శ్రీవారం దర్శనం చేసుకున్న మంత్రి పినిపే… కొండ మీద మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానంటూ మంత్రి వ్యాఖ్యానించా రు. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు మాత్రమే కాకుండా తానూ కోరుకుంటున్నా నన్నారు. రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చన్నారు. దీనికి ఎవరూ అడ్డు చెప్పబోరని అన్నారు. అయితే.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకూడదని వ్యాఖ్యానించారు.
పిఠాపురంలో వారాహి యాత్ర నిర్వహిస్తే.. ఎక్కడో ఉన్న విశాఖ వరకు కూడా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయని.. ఈ విషయాన్ని పవన్తెలుసుకోవాలని.. అందుకే ప్రభుత్వం కొన్ని జీవోలు తీసుకువచ్చిందని.. అయితే.. వాటిని కోర్టులు కొట్టివేశాయని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పవన్ యాత్రలు చేస్తే బాగుంటుందన్నారు. ఇక, ముఖ్యమంత్రి పీఠం అనేది.. ఎవరో ఇస్తే.. వచ్చేది కాదని.. ప్రజలు కూడా ముఖ్యమంత్రి పీఠం ఇవ్వరని చెప్పారు.
సీఎం కావాలంటే 175 స్థానాల్లో పోటీ చేసి 88స్థానాల్లో గెలిస్తే.. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ పక్ష నాయకుడిని ఎంచుకుంటే.. అప్పుడు పవన్ సీఎం అవ్వొచ్చని మంత్రి పినిపే తెలిపారు. పొత్తుతో 100 స్థానాల్లోనైనా పోటీ చేసి 50 స్థానాల్లోనైనా గెలవాలన్నారు. అప్పుడు పవన్కు ముఖ్యమంత్రి యోగం పడుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రెండు విధాలుగా సీఎం అవుతారని మంత్రి విశ్వరూప్ అన్నారు. అంతే తప్ప.. ప్రజలను అడిగి సీఎం అయిన వారు ఎవరూ లేరని.. అయితే.. ఎమ్మెల్యే కావొచ్చని మంత్రి చెప్పారు.
This post was last modified on June 24, 2023 6:26 pm
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…