రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జాతీయ రాజకీయాల్లో వెలిగిపోవాలని కలలుకంటున్న కేసీఆర్ తన వైఖరి వల్లే ఇపుడు ఒంటరైపోతున్నట్లున్నారు. నిలకడలేనితనం, మాట స్ధిరత్వం లేకపోవటం హోలు మొత్తంమీద క్రెడిబులిటి పోగుట్టుకున్నారు. దాంతో కేసీయార్ ను ఇపుడు ఎవరూ నమ్మడం లేదు. ఒకసారి ఎన్డీయే మీద యుద్ధమంటారు. మరోసారి బీజేపీని అడ్డుకుంటానని ప్రకటిస్తారు. తర్వాత నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అందరూ జట్టుకట్టాలంటారు. ఇపుడేమో కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్రమోడీ గురించి పల్లెత్తు మాట కూడా అనటం లేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో తన కూతురు కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకుండా ఉండటం కోసమే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో రాజా పడిపోయినట్లు బాగా ప్రచారం జరిగింది. మామూలు జనాలు కూడా ప్రచారంతో ఏకీభవిస్తున్నారు. మోడీ-కేసీయార్ మధ్య రాజీ కుదరకపోతే దర్యాప్తు సంస్థలు కవితను ఎందుకు అరెస్టు చేయలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లిక్కక్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున కవితదే కీలకపాత్రగా ఈడీనే ఎన్నోసార్లు చెప్పింది. చివరకు కోర్టులో చార్జిషీట్లు కూడా దాఖలుచేసింది. పాత్రదారులందరినీ అరెస్టుచేసిన ఈడీ కవితను మాత్రం ఎందుకు అరెస్టుచేయలేదు ?
ఇక్కడే మోడీ-కేసీయార్ మధ్య ఏదో రాజీకుదిరిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కారణాలతోనే కేసీయార్ ఇటు జనాల్లో అటు జాతీయస్ధాయిలో క్రెడిబులిటి పోగుట్టుకున్నారు. చివరకు ఏమైందంటే ఎన్డీయే పార్టీలు, యూపీఏ పార్టీలే కాకుండా నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలు కూడా ఏ విషయంలో కూడా కేసీయార్ తో మాట్లాడటం మానుకున్నాయి.
తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన 15 ప్రతిపక్షాల కీలకమైన సమావేశానికి కేసీయార్ కు ఆహ్వానమే లేదు. తాము కేసీయార్ ను ఆహ్వానించలేదని జేడీయూ త్యాగి స్పష్టంగా ప్రకటించారు. కారణం ఏమిటంటే కేసీయార్ ను నమ్మలేకపోవటమే. ఏరోజు ఎప్పుడు ఏ పార్టీకి లేదా కూటమికి మద్దతుగా మాట్లాడుతారో ఎవరికీ తెలీదు. ఏమాత్రం నిలకడలేని నేతను కలుపుకుంటే ఇబ్బందులు వస్తాయన్న కారణంతోనే కేసీయార్ ను పాట్నా భేటీకి అన్నీపార్టీలు దూరంగా పెట్టేశాయి. ఎవరికి కాకుండా పోతున్న కేసీయార్ జాతీయరాజకీయాల్లో ఎలా వెలిగిపోవాలని అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు.
This post was last modified on June 24, 2023 5:42 pm
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…