రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జాతీయ రాజకీయాల్లో వెలిగిపోవాలని కలలుకంటున్న కేసీఆర్ తన వైఖరి వల్లే ఇపుడు ఒంటరైపోతున్నట్లున్నారు. నిలకడలేనితనం, మాట స్ధిరత్వం లేకపోవటం హోలు మొత్తంమీద క్రెడిబులిటి పోగుట్టుకున్నారు. దాంతో కేసీయార్ ను ఇపుడు ఎవరూ నమ్మడం లేదు. ఒకసారి ఎన్డీయే మీద యుద్ధమంటారు. మరోసారి బీజేపీని అడ్డుకుంటానని ప్రకటిస్తారు. తర్వాత నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అందరూ జట్టుకట్టాలంటారు. ఇపుడేమో కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్రమోడీ గురించి పల్లెత్తు మాట కూడా అనటం లేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో తన కూతురు కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకుండా ఉండటం కోసమే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో రాజా పడిపోయినట్లు బాగా ప్రచారం జరిగింది. మామూలు జనాలు కూడా ప్రచారంతో ఏకీభవిస్తున్నారు. మోడీ-కేసీయార్ మధ్య రాజీ కుదరకపోతే దర్యాప్తు సంస్థలు కవితను ఎందుకు అరెస్టు చేయలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లిక్కక్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున కవితదే కీలకపాత్రగా ఈడీనే ఎన్నోసార్లు చెప్పింది. చివరకు కోర్టులో చార్జిషీట్లు కూడా దాఖలుచేసింది. పాత్రదారులందరినీ అరెస్టుచేసిన ఈడీ కవితను మాత్రం ఎందుకు అరెస్టుచేయలేదు ?
ఇక్కడే మోడీ-కేసీయార్ మధ్య ఏదో రాజీకుదిరిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కారణాలతోనే కేసీయార్ ఇటు జనాల్లో అటు జాతీయస్ధాయిలో క్రెడిబులిటి పోగుట్టుకున్నారు. చివరకు ఏమైందంటే ఎన్డీయే పార్టీలు, యూపీఏ పార్టీలే కాకుండా నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలు కూడా ఏ విషయంలో కూడా కేసీయార్ తో మాట్లాడటం మానుకున్నాయి.
తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన 15 ప్రతిపక్షాల కీలకమైన సమావేశానికి కేసీయార్ కు ఆహ్వానమే లేదు. తాము కేసీయార్ ను ఆహ్వానించలేదని జేడీయూ త్యాగి స్పష్టంగా ప్రకటించారు. కారణం ఏమిటంటే కేసీయార్ ను నమ్మలేకపోవటమే. ఏరోజు ఎప్పుడు ఏ పార్టీకి లేదా కూటమికి మద్దతుగా మాట్లాడుతారో ఎవరికీ తెలీదు. ఏమాత్రం నిలకడలేని నేతను కలుపుకుంటే ఇబ్బందులు వస్తాయన్న కారణంతోనే కేసీయార్ ను పాట్నా భేటీకి అన్నీపార్టీలు దూరంగా పెట్టేశాయి. ఎవరికి కాకుండా పోతున్న కేసీయార్ జాతీయరాజకీయాల్లో ఎలా వెలిగిపోవాలని అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు.
This post was last modified on June 24, 2023 5:42 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…