Political News

పవన్‌ను జోగయ్య ముంచుతారా? విజయంలో ముంచెత్తుతారా

ఏపీ పాలిటిక్స్ పవన్ కల్యాణ్ వేడి పెంచుతున్నారు. తన వారాహి రథంపై కాపు కోటల్లో దూసుకెళ్తున్నారు. నేనే సీఎం అంటూ జబ్బులు చరుస్తున్నారు. పాలక వైసీపీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ చెప్పుకొచ్చిన పవన్ ఎందుకో సొంతంగా ఎన్నికలు వెళ్లాలనుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాపుల ఓట్లు లక్ష్యంగా చురుగ్గా రాజకీయం చేస్తున్నారు.

పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు కాపుల్లో ఊపు తేవడానికి ట్రై చేస్తున్నారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, సీనియర్ లీడర్ చేగొండ హరిరామజోగయ్య సలహాల ప్రకారమే పవన్ సొంత ప్రయాణం దిశగా ఆలోచిస్తున్నారని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా హరిరామ జోగయ్య సర్వేల పేరిటి కొద్దిరోజులుగా పవన్‌కు హైప్ తీసుకొస్తున్నారు.. వారాహి యాత్ర పూర్తయితే పవన్‌ను కొట్టేవాడే ఉండడని ఆయన చెప్తున్నారు.

ఈ ఫీడింగ్ పవన్ వద్ద కూడా బాగానే పనిచేసిందని.. పవన్ జోగయ్య మాటలను నమ్మి సొంతంగా ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనకు వస్తున్నారని అంటున్నారు. అయితే… జోగయ్య సర్వేలు ఎంతవరకు ప్రామాణికం.. వయసు మళ్లిన జోగయ్య జనం నాడిని సరిగానే పట్టుకోగలగుతున్నారా అనే ప్రశ్నలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. జోగయ్య మాటలను పూర్తిగా నమ్మి ఒంటరి పోరుకు దిగితే మరోసారి దెబ్బవడం ఖాయమని జనసేనలోని చాలామంది అంటున్నారు.

బలమైన క్యాడర్.. ఎన్నికల అనుభవం ఉన్న టీడీపీతో కలిసి నడిస్తే పొత్తులు కుదుర్చున్న మేరకు సీట్లు గెలవగలమని.. గట్టిగా పట్టుపడితే నాలుగైదు మంత్రి పదవులు కూడా తెచ్చుకోగలమని జనసేనలో చాలామంది నేతలు ఆశ పడుతున్నారు.

వాస్తవాల ప్రాతిపదికగా ఆలోచిస్తున్న ఇలాంటివారంతా జోగయ్య జోక్యంపై మండిపడుతున్నారు. కాగా జోగయ్య సర్వేలు కూడా పూర్తిగా రెండు గోదావరి జిల్లాలకే పరిమితమవుతున్నాయి. అందులోనూ.. ఒక్కో నియోజకవర్గంలో 500 శాంపిళ్లే తీసుకున్నట్లు జోగయ్య చెప్తున్నారు. రాజకీయంగా పోలరైజేషన్ తీవ్రంగా ఉన్న సందర్భంలో లక్షన్నర నుంచి 3 లక్షల ఓట్లుండే నియోజకవర్గాలలో 500 శాంపిళ్లు అంటే చాలా తక్కువ. ఇంత చిన్న శాంపిల్‌తో జనం నాడి పట్టుకోవడం కష్టం.

కాపులు, బీసీలు, ఎస్సీలు అందరూ ఈ 500 శాంపిళ్లలోనే ఉన్నట్లు జోగయ్య చెప్తున్నారు. దీంతో.. జోగయ్య మాటలు నమ్మి పవన్ ఏం చేస్తారో అని పార్టీలో కొందరు ఆందోళన చెందుతున్నారు. ఆయన చెప్పినట్లు పవన్ సొంతంగా పోటీ చేసి ప్రభంజనం సృష్టిస్తే అందరం సంతోషిస్తామని.. ఒకవేళ తేడా కొడితే తీవ్రంగా నష్టపోతామని అంటున్నారు. ఈ ఎన్నికలకు టీడీపీతో కలిసి వెళ్లడం ఉత్తమం అనే మాట జనసేనలో బలంగా వినిపిస్తోంది.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

4 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

6 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

8 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

8 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

9 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

9 hours ago