Political News

పవన్‌ను జోగయ్య ముంచుతారా? విజయంలో ముంచెత్తుతారా

ఏపీ పాలిటిక్స్ పవన్ కల్యాణ్ వేడి పెంచుతున్నారు. తన వారాహి రథంపై కాపు కోటల్లో దూసుకెళ్తున్నారు. నేనే సీఎం అంటూ జబ్బులు చరుస్తున్నారు. పాలక వైసీపీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ చెప్పుకొచ్చిన పవన్ ఎందుకో సొంతంగా ఎన్నికలు వెళ్లాలనుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాపుల ఓట్లు లక్ష్యంగా చురుగ్గా రాజకీయం చేస్తున్నారు.

పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు కాపుల్లో ఊపు తేవడానికి ట్రై చేస్తున్నారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, సీనియర్ లీడర్ చేగొండ హరిరామజోగయ్య సలహాల ప్రకారమే పవన్ సొంత ప్రయాణం దిశగా ఆలోచిస్తున్నారని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా హరిరామ జోగయ్య సర్వేల పేరిటి కొద్దిరోజులుగా పవన్‌కు హైప్ తీసుకొస్తున్నారు.. వారాహి యాత్ర పూర్తయితే పవన్‌ను కొట్టేవాడే ఉండడని ఆయన చెప్తున్నారు.

ఈ ఫీడింగ్ పవన్ వద్ద కూడా బాగానే పనిచేసిందని.. పవన్ జోగయ్య మాటలను నమ్మి సొంతంగా ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనకు వస్తున్నారని అంటున్నారు. అయితే… జోగయ్య సర్వేలు ఎంతవరకు ప్రామాణికం.. వయసు మళ్లిన జోగయ్య జనం నాడిని సరిగానే పట్టుకోగలగుతున్నారా అనే ప్రశ్నలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. జోగయ్య మాటలను పూర్తిగా నమ్మి ఒంటరి పోరుకు దిగితే మరోసారి దెబ్బవడం ఖాయమని జనసేనలోని చాలామంది అంటున్నారు.

బలమైన క్యాడర్.. ఎన్నికల అనుభవం ఉన్న టీడీపీతో కలిసి నడిస్తే పొత్తులు కుదుర్చున్న మేరకు సీట్లు గెలవగలమని.. గట్టిగా పట్టుపడితే నాలుగైదు మంత్రి పదవులు కూడా తెచ్చుకోగలమని జనసేనలో చాలామంది నేతలు ఆశ పడుతున్నారు.

వాస్తవాల ప్రాతిపదికగా ఆలోచిస్తున్న ఇలాంటివారంతా జోగయ్య జోక్యంపై మండిపడుతున్నారు. కాగా జోగయ్య సర్వేలు కూడా పూర్తిగా రెండు గోదావరి జిల్లాలకే పరిమితమవుతున్నాయి. అందులోనూ.. ఒక్కో నియోజకవర్గంలో 500 శాంపిళ్లే తీసుకున్నట్లు జోగయ్య చెప్తున్నారు. రాజకీయంగా పోలరైజేషన్ తీవ్రంగా ఉన్న సందర్భంలో లక్షన్నర నుంచి 3 లక్షల ఓట్లుండే నియోజకవర్గాలలో 500 శాంపిళ్లు అంటే చాలా తక్కువ. ఇంత చిన్న శాంపిల్‌తో జనం నాడి పట్టుకోవడం కష్టం.

కాపులు, బీసీలు, ఎస్సీలు అందరూ ఈ 500 శాంపిళ్లలోనే ఉన్నట్లు జోగయ్య చెప్తున్నారు. దీంతో.. జోగయ్య మాటలు నమ్మి పవన్ ఏం చేస్తారో అని పార్టీలో కొందరు ఆందోళన చెందుతున్నారు. ఆయన చెప్పినట్లు పవన్ సొంతంగా పోటీ చేసి ప్రభంజనం సృష్టిస్తే అందరం సంతోషిస్తామని.. ఒకవేళ తేడా కొడితే తీవ్రంగా నష్టపోతామని అంటున్నారు. ఈ ఎన్నికలకు టీడీపీతో కలిసి వెళ్లడం ఉత్తమం అనే మాట జనసేనలో బలంగా వినిపిస్తోంది.

This post was last modified on June 24, 2023 11:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

13 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

47 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

7 hours ago