Political News

పగలు సెగలు రాత్రి మైత్రి.. బీజేపీ, బీఆర్ఎస్ అఫైర్స్

కొన్నాళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కొనసాగిన రాజకీయ ఉద్రిక్తతలు నెమ్మదించినట్లుగా ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు కేంద్రాని లేఖపై లేఖ రాసిన కేటీఆర్ ఇప్పుడు తానే నేరుగా వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం చర్చనీయమవుతోంది. అది కూడా.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ పట్నాలో భేటీ అయిన రోజునే కేటీఆర్ దిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ కలవడంలేదనే ఇండికేషన్ ఇవ్వడానికేనని.. రాష్ట్రంలో మాకు సహకరించండి.. కేంద్రంలో మీకు సహకరిస్తాం అనే పాత పాలసీ అమలు కోసం కేటీఆర్ బీజేపీ నేతలను కలిశారన్న ప్రచారం జరుగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, సాయం కోసం ఇంతకాలం లేఖలతో సరిపెట్టిన కేటీఆర్ ఇప్పుడు డైరెక్టుగా ఢిల్లీ వెళ్లి మంత్రులతో చర్చలు జరపడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేయకున్నా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలుగా గుర్తింపు పొందినవాటిని తెప్పించుకున్నామని, జాతీయ హోదా ఇవ్వకున్నా కాళేశ్వరం కట్టుకున్నామని, కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా ప్రయివేట్ రంగంలో మేధా కోచ్ ఫ్యాక్టరీని తెప్పించుకున్నామని రెండు రోజుల క్రితం కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు.

అటు కేసీఆర్ కూడా… కేంద్ర ప్రభుత్వంతో అయ్యేది లేదు.. పొయ్యేది లేదు అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడంతో పాటు ప్రధాని అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్నీ బహిష్కరించారు. అందుకు గల కారణాలను వివరిస్తూ ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు.

కేంద్ర హోం మంత్రి అధ్యక్షుడిగా ఉండే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎంగానీ, మంత్రిగానీ హాజరుకాలేదు. తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చినా కేసీఆర్ అటు కన్నెత్తి చూడలేదు. అమిత్ షా వచ్చినా ఆయనపై విమర్శలు కురిపించారే కానీ ఆయన్ను కలవలేదు. అలాంటిది ఇప్పుడు కేటీఆర్ సడెన్‌గా దిల్లీలో బీజేపీ పెద్దలను కలవడం రాజకీయ సమీకరణల మార్పునకు సంకేతమని వినిపిస్తోంది.

మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతామంటున్న విపక్సాలు కూడా బీఆర్ఎస్‌ను కలుపుకొని వెళ్లడం లేదు. విపక్షాల మీటింగ్‌కు బీఆర్ఎస్‌ను ఆహ్వానింలేదంటూ జేడీయూ సీనియర్ నేత ఢిల్లీలో జాతీయ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటిస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు సైతం చెప్పుకున్నారు. ఇన్విటేషన్ విషయంలో బీఆర్ఎస్ స్పష్టత ఇవ్వకపోయినా పాట్నా మీటింగ్‌కు గైర్హాజరైంది. అదే టైంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం ద్వారా తాము కాంగ్రెస్‌తో వెళ్లడంలేదనే స్పష్టత ఇచ్చినట్లయింది.

ఇప్పటికే బీజేపీకి ‘బీ-టీమ్’ అంటూ బీఆర్ఎస్‌పై ముద్ర ఉన్న సమయంలో కేటీఆర్ ఢిల్లీ టూర్‌కు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాష్ట్ర అవసరాల కోసమే కేంద్ర మంత్రులను కలిసినట్లయితే గతంలో అనుసరించిన లేఖల సంప్రదాయాన్నే కంటిన్యూ చేయొచ్చు గదా అనే వాదన వినిపిస్తోంది.
అంతేకాదు… లిక్కర్ కేసులో కవిత విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు జోరు తగ్గించడం.. కేసీఆర్ బీజేపీపై విమర్శలు తగ్గించడం, కేటీఆర్ దిల్లీ వెళ్లడం అన్నీ కూడా ఆ రెండు పార్టీల గేమ్ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

This post was last modified on June 24, 2023 10:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago