చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు మీడియాపై ఏడుపు ప్రారంభించినట్టుగా ఉంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ నేతలతో.. పైగా దివంగత వైఎస్ కు ఆత్మ అనే పేరున్న కేవీపీ రామచంద్రరావు వంటివారితో టచ్లో ఉంటూ.. రాహుల్గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి.. పదే పదే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ను కలిసి.. ఆయనతో మంతనాలు జరిపిన షర్మిల వ్యవహారం.. కొన్ని రోజులుగా హాట్టాపిక్గా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా మౌనంగా ఉన్నారు. ఒకరిద్దరు రియాక్ట్ అయినా.. మిశ్రమ స్పందన కనిపించింది. కానీ.. తాజాగా ఈ వార్తలను చాలా ఘాటుగా ఖండిస్తూ.. పెద్ద ట్వీట్ చేశారు షర్మిల. కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనమంటూ వస్తున్న వార్తలపై షర్మిల స్పందించారు. ‘‘వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా..తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయి“ అని మీడియాపై మండిపడ్డారు.
అంతేకాదు.. “పనిలేని, పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే.. నా రాజకీయ భవిత మీద పెట్టే దృష్టిని, సమయాన్ని కేసీఆర్ పాలనపై పెట్టండి.. అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో.. సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి.. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి.. నా భవిష్యత్తు తెలంగాణతోనే.. నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే.. జై తెలంగాణ’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. సరే.. అంతా బాగానే ఉంది. కానీ. కాంగ్రెస్ నేతలను కలవడం వెనుక ఉన్న రీజన్ కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పేసి ఉంటే బాగుండేది కదా.. అంటున్నారు పరిశీలకులు.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…