చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు మీడియాపై ఏడుపు ప్రారంభించినట్టుగా ఉంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ నేతలతో.. పైగా దివంగత వైఎస్ కు ఆత్మ అనే పేరున్న కేవీపీ రామచంద్రరావు వంటివారితో టచ్లో ఉంటూ.. రాహుల్గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి.. పదే పదే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ను కలిసి.. ఆయనతో మంతనాలు జరిపిన షర్మిల వ్యవహారం.. కొన్ని రోజులుగా హాట్టాపిక్గా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా మౌనంగా ఉన్నారు. ఒకరిద్దరు రియాక్ట్ అయినా.. మిశ్రమ స్పందన కనిపించింది. కానీ.. తాజాగా ఈ వార్తలను చాలా ఘాటుగా ఖండిస్తూ.. పెద్ద ట్వీట్ చేశారు షర్మిల. కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనమంటూ వస్తున్న వార్తలపై షర్మిల స్పందించారు. ‘‘వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా..తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయి“ అని మీడియాపై మండిపడ్డారు.
అంతేకాదు.. “పనిలేని, పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే.. నా రాజకీయ భవిత మీద పెట్టే దృష్టిని, సమయాన్ని కేసీఆర్ పాలనపై పెట్టండి.. అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో.. సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి.. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి.. నా భవిష్యత్తు తెలంగాణతోనే.. నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే.. జై తెలంగాణ’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. సరే.. అంతా బాగానే ఉంది. కానీ. కాంగ్రెస్ నేతలను కలవడం వెనుక ఉన్న రీజన్ కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పేసి ఉంటే బాగుండేది కదా.. అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 23, 2023 8:53 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…