చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు మీడియాపై ఏడుపు ప్రారంభించినట్టుగా ఉంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ నేతలతో.. పైగా దివంగత వైఎస్ కు ఆత్మ అనే పేరున్న కేవీపీ రామచంద్రరావు వంటివారితో టచ్లో ఉంటూ.. రాహుల్గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి.. పదే పదే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ను కలిసి.. ఆయనతో మంతనాలు జరిపిన షర్మిల వ్యవహారం.. కొన్ని రోజులుగా హాట్టాపిక్గా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా మౌనంగా ఉన్నారు. ఒకరిద్దరు రియాక్ట్ అయినా.. మిశ్రమ స్పందన కనిపించింది. కానీ.. తాజాగా ఈ వార్తలను చాలా ఘాటుగా ఖండిస్తూ.. పెద్ద ట్వీట్ చేశారు షర్మిల. కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనమంటూ వస్తున్న వార్తలపై షర్మిల స్పందించారు. ‘‘వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా..తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయి“ అని మీడియాపై మండిపడ్డారు.
అంతేకాదు.. “పనిలేని, పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే.. నా రాజకీయ భవిత మీద పెట్టే దృష్టిని, సమయాన్ని కేసీఆర్ పాలనపై పెట్టండి.. అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో.. సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి.. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి.. నా భవిష్యత్తు తెలంగాణతోనే.. నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే.. జై తెలంగాణ’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. సరే.. అంతా బాగానే ఉంది. కానీ. కాంగ్రెస్ నేతలను కలవడం వెనుక ఉన్న రీజన్ కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పేసి ఉంటే బాగుండేది కదా.. అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 23, 2023 8:53 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…