ఓ పది రోజుల కిందటి వరకు.. ఎటు విన్నా.. ఎటు చూసినా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ రాజకీయా లు నడిచాయి. ఎవరి నోట విన్నా.. అవినాష్ అరెస్టు అంశం తారస్థాయిలో చర్చకు వచ్చింది. ఇంకేముంది ఆయన అరెస్టు అయిపోతున్నారంటూ.. మీడియా కోడై కూసింది. బ్రేకింగులు.. చర్చలు.. అబ్బో ఆ వార్తలే వేరు. అన్నట్టుగా సాగిన ఈ వ్యవహారం గడిచిన పది రోజులుగా అసలు ఊసే లేకుండా పోయింది.
ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఆయన గురించిన చర్చ వినిపించడం లేదు. కనీసం అవినాష్రెడ్డి గురించిన మాటే ఎక్కడా కనిపించడం లేదు. మొత్తానికి ఈ పరిణామాలను గమనిస్తున్న వారు.. అవినాష్ను అలా సైడ్ చేశారా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన అరెస్టు గురించిన వార్తలు వినిపించ డమే లేదు. ఇక, మరోవైపు.. పులివెందులలో అవినాష్రెడ్డి మాతృమూర్తి శ్రీలక్ష్మి.. యథావిథిగా తన పని తాను చేసుకుంటున్నారు.
అదే సమయంలో ముందస్తు బెయిల్ దక్కించుకున్న అవినాష్రెడ్డి నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఆయన కడప జిల్లాలోకి కడప నియోజకవర్గంలో పర్యటించారు. ఇక్కడి సమస్యలు తెలుసుకున్నారు. అయితే.. చిత్రంగా నిన్న మొన్నటి వరకు అవినాష్ గురించి ఆందోళన చేసిన వారు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎక్కడా వారు కూడా పన్నెత్తు మాట అనడం లేదు. కనీసం.. అవినాష్రెడ్డి అరెస్టు విషయాన్ని కూడా ఎవరూ స్మరించడం లేదు.
ఈ పరిణామాలను గమనిస్తే.. అధికారంలో ఉన్నవారు ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు. మరికొన్ని రోజులు పోతే. అసలు అవినాష్రెడ్డిఅంశం కూడా తెరమరుగైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఎలానూ.. ఎన్నికల మూడ్లో పడి ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించే పరిస్థితి లేకుండా పోతుందని.. చెబుతున్నారు. ఏదేమైనా.. చాలా తెలివిగా.. ఎంతో ఓర్పుగా అవినాష్రెడ్డి అంశాన్ని సైడ్ చేశారని కొద్ది మంది మాత్రం చర్చించుకుంటుండడం గమనార్హం.
This post was last modified on June 23, 2023 2:39 pm
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…
జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలు ఎంచుకునే అంశం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారం. కార్లను మార్చినట్లు భార్యలను…