Political News

‘హలో ఏపీ.. బైబై వైసీపీ’..

ఎన్నికల్లో ఇపుడు స్లోగన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల సైకో పోవాలి సైకిల్ రావాలి అనే స్లోగన్ బాగా హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా వారాహియాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు కొత్త నినాదాలిచ్చారు. అవేమిటంటే మొదటిది ‘హలో ఏపీ..బైబై వైసీపీ’. ఇక రెండో స్లోగన్ ఏమిటంటే ‘జనం బాగుండాలంటే జగన్ ప్రభుత్వం పోవాలి’. కోనసీమలోని అమలాపురం యాత్ర సందర్భంగా మాట్లాడుతు పవన్ ఈ రెండు స్లోగన్లను ప్రకటించారు. నిజానికి ఎన్నికల సమయంలో స్లోగన్లే రాజకీయపార్టీలను బాగా పాపురల్ చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. తానిచ్చిన రెండు స్లోగన్లకు పవన్ మద్దతుగా తన వివరణలను కూడా ఇచ్చుకున్నారు.

విషయం ఏదైనా స్లోగన్లు గనుక క్యాచీగా ఉన్నాయని జనాలకు అనిపిస్తే వాటిని పదేపదే చెప్పుకుంటారు. ఈ పద్దతిలోనే సదరు పార్టీ పాజిటివ్ గానో లేకపోతే నెగిటివ్ గానో జనాల నోళ్ళల్లో నానుతుంటుంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా వైఎస్ షర్మిల ఇచ్చిన బైబై బాబు అనే స్లోగన్ కూడా చాలా పాపులరైంది. జనాలు చెప్పుకోవటానికి, వైసీపీ నేతలు చెప్పటానికి బైబై బాబు అనే స్లోగన్ చాలా తేలికగా ఉండేది. అలాగే 2014 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఇచ్చిన స్లోగన్ కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇంతకీ ఆ స్లోగన్ ఏమిటంటే జాబు రావాలంటే బాబు రావాలి అని. టీడీపీ నేతలతో పాటు మద్దతుదారులు సోషల్ మీడియాతో పాటు రోడ్లపైన గోడల మీద కూడా ఇదే నినాదాన్ని రాశారు. దాంతో ఈ స్లోగన్ జనాల్లోకి ఫుల్లుగా ఎక్కేసింది.

2024 ఎన్నికలకు కూడా ఇది వరకు కాంగ్రెస్ ఇచ్చిన నినాదం గరీబీ హఠావో, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు ఇప్పటికీ జనాల్లో మారుమోగుతునే ఉన్నాయి.

నినాదాలతోనే పార్టీలు అధికారంలోకి వచ్చేస్తాయని కాదు. కానీ తమ పార్టీ విధానాలను తేలిగ్గా జనాలకు అర్ధమయ్యేట్లుగా, జనాలు ఒకటికి పదిసార్లు మాట్లాడుకునేట్లుగా ఇలాంటి నినాదాలు బాగా పనిచేస్తాయి. ఇక అధికారంలోకి రావటమంటారా అది అధినేతల చేతుల్లోనే ఉంటుంది. ఇపుడు పవనిచ్చిన రెండు స్లోగన్లు జనాల్లోకి బాగా వెళ్ళాలంటే జనసేన నేతలు, సోషల్ మీడియా వింగ్ ఏ విధంగా పాపులర్ చేస్తాయనేదాని మీద ఆధారాపడుంది.

Share
Show comments
Published by
satya

Recent Posts

పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…

4 hours ago

జైలుకు వెళ్ల‌కుండా మీరే న‌న్ను కాపాడాలి:  కేజ్రీవాల్‌

కీల‌క‌మైన నాలుగోద‌శ ఎన్నికల పోలింగ్ స‌మ‌యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవా ల్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.…

5 hours ago

ఏపీలో బెట్టింగ్ మార్కెట్ ఏం చెబుతోంది?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగువారి చూపంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఎలా…

5 hours ago

ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఓటరు !

నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను…

6 hours ago

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు.…

7 hours ago

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల బారులు…. సంకేతం ఏంటి?

రాష్ట్రంలో కీల‌క నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని…

7 hours ago