Political News

ఎన్నికల ముందు జగన్ మాస్టర్ ప్లాన్

ఏపీలో కేబినెట్ విస్త‌రించ‌నున్నారా? ముహూర్తంకూడా రెడీ అయిందా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తు న్నాయి. తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి దీనికి సంబంధించిన ఆస‌క్తికర స‌మాచారం వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఇద్ద‌రి నుంచి ముగ్గ‌రు మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ ఉద్వాస‌న ప‌ల‌క‌నున్నార‌ని కూడా తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. వీరిలో ఒక‌రు మ‌హిళా మంత్రి కూడా ఉన్నార‌ని అంటున్నారు.

అదేవిధంగా తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌.. మ‌రో మంత్రి కూడా ఉన్నార‌ని వైసీపీసీనియ‌ర్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. తాజాగా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు రాక‌పోయినా.. మంత్రి వ‌ర్గం మార్పు, చేర్పులపై ఆయ‌న‌కు వివ‌రించేందుకు సీఎం జ‌గ‌న్ భేటీ అయ్యార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి.

మ‌రో 10 రోజుల్లో మంత్రి వ‌ర్గం మార్పు ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌న‌ను దృష్టిలో ఉంచుకుని .. ప్ర‌స్తుతం అసంతృప్తులుగా ఉన్న ఒక‌రిద్దిరిని మంత్రులుగా తీసుకునేందుకు జ‌గ‌న్ ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్టు తెలుస్తోంది. వీరిలో బాలినినే శ్రీనివాస‌రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో ఒక ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ మంత్రి, త‌ర‌చుగా రెడ్డి వ‌ర్గంపై విమ‌ర్శ‌లు చేస్తున్న ఆయ‌న‌ను కూడా త‌ప్పిస్తార‌ని తెలుస్తోంది.

ఇక‌, కొత్తగా మంత్రివ‌ర్గంలోకి తీసుకునేవారిలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు.. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి. మంగ‌ళ‌గిరిలో ఈ సారి మళ్లీ విజ‌యం ద‌క్కించుకునేందుకు ఆళ్ల‌ను మంత్రిని చేయాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. పైగా ఆయ‌న‌కు గ‌తంలోనే జ‌గ‌న్ హామీ ఇచ్చి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆళ్ల‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటార‌ని అంటున్నారు. అయితే.. ఇద్ద‌రు రెడ్డి నేత‌ల‌కు ఒకేసారి మంత్రి ప‌ద‌వులు ఇస్తారా? అనేది కూడా చ‌ర్చ‌గా మారింది. ఎలా చూసుకున్నా.. ఖ‌చ్చితంగా మంత్రి వ‌ర్గంలో మార్పులు ఉంటాయ‌నేది వాస్త‌వం అంటున్నారు సీనియ‌ర్లు. అందుకే గ‌వర్న‌ర్‌ను క‌లిశార‌ని చెబుతున్నారు.

This post was last modified on June 23, 2023 8:05 am

Share

Recent Posts

సర్దార్ చేసిన గాయం చాలా పెద్దది

మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…

31 minutes ago

మెగా అప్‌డేట్…. మిసెస్ కాకా వచ్చేశారా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…

2 hours ago

గణేష్ నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి

ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…

2 hours ago

భారత్‌పై 100 శాతం టారిఫ్.. ఇప్పుడు ట్రంప్ చేతిలోనే!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు అమెరికా నుంచి మరో టారిఫ్ ముప్పు దగ్గరైంది. రష్యాపై మరింత ఆర్థిక…

2 hours ago

సుబ్బులక్ష్మిని తలచుకుని నిర్మలమ్మ కంటతడి

ప్రముఖ కర్ణాటక సంగీత విదుషి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి స్మారక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భావోద్వేగానికి గురయ్యారు.…

3 hours ago

500 కోట్ల.. శ్రీదేవి ఆస్తి వివాదం.. చివ‌ర‌కు ఏమైదంటే!

ఆలిండియా నెంబ‌ర్ 1 హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న న‌టి శ్రీదేవికి చెందిన భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ…

5 hours ago