ఏపీలో కేబినెట్ విస్తరించనున్నారా? ముహూర్తంకూడా రెడీ అయిందా? అంటే.. ఔననే సంకేతాలు వస్తు న్నాయి. తాడేపల్లి వర్గాల నుంచి దీనికి సంబంధించిన ఆసక్తికర సమాచారం వస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఇద్దరి నుంచి ముగ్గరు మంత్రులకు సీఎం జగన్ ఉద్వాసన పలకనున్నారని కూడా తాడేపల్లి వర్గాల నుంచి వినిపిస్తోంది. వీరిలో ఒకరు మహిళా మంత్రి కూడా ఉన్నారని అంటున్నారు.
అదేవిధంగా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న.. మరో మంత్రి కూడా ఉన్నారని వైసీపీసీనియర్ల మధ్య చర్చ సాగుతోంది. తాజాగా జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాకపోయినా.. మంత్రి వర్గం మార్పు, చేర్పులపై ఆయనకు వివరించేందుకు సీఎం జగన్ భేటీ అయ్యారని తాడేపల్లి వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
మరో 10 రోజుల్లో మంత్రి వర్గం మార్పు ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలనను దృష్టిలో ఉంచుకుని .. ప్రస్తుతం అసంతృప్తులుగా ఉన్న ఒకరిద్దిరిని మంత్రులుగా తీసుకునేందుకు జగన్ పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. వీరిలో బాలినినే శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం గమనార్హం. అదే సమయంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మంత్రి, తరచుగా రెడ్డి వర్గంపై విమర్శలు చేస్తున్న ఆయనను కూడా తప్పిస్తారని తెలుస్తోంది.
ఇక, కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునేవారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరిలో ఈ సారి మళ్లీ విజయం దక్కించుకునేందుకు ఆళ్లను మంత్రిని చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. పైగా ఆయనకు గతంలోనే జగన్ హామీ ఇచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆళ్లను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. అయితే.. ఇద్దరు రెడ్డి నేతలకు ఒకేసారి మంత్రి పదవులు ఇస్తారా? అనేది కూడా చర్చగా మారింది. ఎలా చూసుకున్నా.. ఖచ్చితంగా మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయనేది వాస్తవం అంటున్నారు సీనియర్లు. అందుకే గవర్నర్ను కలిశారని చెబుతున్నారు.
This post was last modified on June 23, 2023 8:05 am
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…
జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలు ఎంచుకునే అంశం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారం. కార్లను మార్చినట్లు భార్యలను…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొక్క రోజే సమయం ఉండగా.. ఈ టైంలో ప్రముఖ రాజకీయ నాయకులతో సమానంగా సినీ హీరో…