Political News

ర‌ఘురామ‌ గ‌జ్జికుక్క అంటూ ఎంవీవీ సీరియ‌స్‌

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై విశాఖ‌ప‌ట్నం ఎంపీ ఎంవీవీ స‌త్య నారాయ‌ణ తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. ర‌ఘురామ‌ను గ‌జ్జికుక్క అంటూ తీవ్ర‌స్థాయిలో దూషించారు. త‌ను, త‌న కుటుంబం క‌ష్టాల్లో ఉంటే.. దానిని కూడా రాజ‌కీయంగా వాడుకునేందుకు ర‌ఘురామ వంటి గ‌జ్జికుక్క‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంవీవీ.. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. త‌న‌ కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, హింసిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు.

కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ మీద 13 కేసులు, రాజేష్ మీద 45 కేసులు ఉన్నాయని ఎంవీవీ తెలిపారు. హేమంత్‌తో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని.. కేవలం డబ్బులు కోసం ఇదంతా చేశారని చెప్పారు. అనుమానం ఉంటే తన కాల్ డేటా ఐదు సంవత్సరాలు చెక్ చేసుకోవాలన్నారు. అందరూ కోరుతున్నారు కాబట్టి ఘటనపై సీబీఐ, ఎన్ఐఏ విచార‌ణ‌ వేయాలని తానే స్వయంగా కోరుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు లేవని చెప్పలేదన్నారు. తాను రాజకీయాల్లో ఉండడంతో ప్రతిదీ వక్రీకరిస్తున్నారని ఎంవీవీ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో వ్యాపారం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నా ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నా రు. ఈ ఘటనలో ఏ పార్టీకి, ఎవరికి, ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం డబ్బులు కోసమే ఇదంతా చేశారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. కానీ, ఏ విష‌యం జ‌రిగినా.. దానికి వైసీపీకి, సీఎం జ‌గ‌న్‌కు ముడిపెట్టి మాట్లాడుతున్నా ర‌ని.. చంద్ర‌బాబు హ‌యాంలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగితే ఇలా మాట్లాడేవారా? అని ప్ర‌శ్నించారు. వైసీపీని బ‌ద్నాం చేయాల‌ని అనుకునేవారే .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ లేకుండా పోతార‌ని ఎంవీవీ వ్యాఖ్యానించారు. తాను వైసీపీలోనే ఉన్నాన‌ని, ఉంటాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేస్తున్నాన‌ని స‌త్య‌నారాయ‌ణ చెప్పారు.

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగింద‌ని గుండెలు బాదుకుంటున్న‌టీడీపీ త‌న హ‌యాంలో ఏం జ‌రిగిందో ఒక్క‌సారి తిరిగి చూసుకోవాల‌ని ఎంవీవీ వ్యాఖ్యానించారు. ఆర్టిక‌ల్ 355 అనేది.. అన్ని రాష్ట్రాల‌కూ వ‌ర్తించ‌ద‌ని.. అలా వ‌ర్తించే ట‌ట్ట‌యితే.. మొద‌ట మ‌ణిపూర్ వంటి రాష్ట్రాల్లోనే విధించాల్సి ఉంటుంద‌ని.. కేంద్రానికి కూడా కొన్ని ప‌రిమితులు ఉంటాయ‌ని, రాష్ట్రాల విష‌యంలో జోక్యం చేసుకునే హ‌క్కులు స్ప‌ష్టంగా రాజ్యాంగం పేర్కొంద‌ని ఎంవీవీ వ్యాఖ్యానించారు. ఈ విష‌యం తెలిసి కూడా టీడీపీ నేత‌లు.. రాజ‌కీయం చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

This post was last modified on June 22, 2023 12:00 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

4 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

4 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

4 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

5 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

5 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

7 hours ago