Political News

ర‌ఘురామ‌ గ‌జ్జికుక్క అంటూ ఎంవీవీ సీరియ‌స్‌

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై విశాఖ‌ప‌ట్నం ఎంపీ ఎంవీవీ స‌త్య నారాయ‌ణ తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. ర‌ఘురామ‌ను గ‌జ్జికుక్క అంటూ తీవ్ర‌స్థాయిలో దూషించారు. త‌ను, త‌న కుటుంబం క‌ష్టాల్లో ఉంటే.. దానిని కూడా రాజ‌కీయంగా వాడుకునేందుకు ర‌ఘురామ వంటి గ‌జ్జికుక్క‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంవీవీ.. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. త‌న‌ కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, హింసిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు.

కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ మీద 13 కేసులు, రాజేష్ మీద 45 కేసులు ఉన్నాయని ఎంవీవీ తెలిపారు. హేమంత్‌తో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని.. కేవలం డబ్బులు కోసం ఇదంతా చేశారని చెప్పారు. అనుమానం ఉంటే తన కాల్ డేటా ఐదు సంవత్సరాలు చెక్ చేసుకోవాలన్నారు. అందరూ కోరుతున్నారు కాబట్టి ఘటనపై సీబీఐ, ఎన్ఐఏ విచార‌ణ‌ వేయాలని తానే స్వయంగా కోరుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు లేవని చెప్పలేదన్నారు. తాను రాజకీయాల్లో ఉండడంతో ప్రతిదీ వక్రీకరిస్తున్నారని ఎంవీవీ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో వ్యాపారం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నా ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నా రు. ఈ ఘటనలో ఏ పార్టీకి, ఎవరికి, ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం డబ్బులు కోసమే ఇదంతా చేశారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. కానీ, ఏ విష‌యం జ‌రిగినా.. దానికి వైసీపీకి, సీఎం జ‌గ‌న్‌కు ముడిపెట్టి మాట్లాడుతున్నా ర‌ని.. చంద్ర‌బాబు హ‌యాంలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగితే ఇలా మాట్లాడేవారా? అని ప్ర‌శ్నించారు. వైసీపీని బ‌ద్నాం చేయాల‌ని అనుకునేవారే .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ లేకుండా పోతార‌ని ఎంవీవీ వ్యాఖ్యానించారు. తాను వైసీపీలోనే ఉన్నాన‌ని, ఉంటాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేస్తున్నాన‌ని స‌త్య‌నారాయ‌ణ చెప్పారు.

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగింద‌ని గుండెలు బాదుకుంటున్న‌టీడీపీ త‌న హ‌యాంలో ఏం జ‌రిగిందో ఒక్క‌సారి తిరిగి చూసుకోవాల‌ని ఎంవీవీ వ్యాఖ్యానించారు. ఆర్టిక‌ల్ 355 అనేది.. అన్ని రాష్ట్రాల‌కూ వ‌ర్తించ‌ద‌ని.. అలా వ‌ర్తించే ట‌ట్ట‌యితే.. మొద‌ట మ‌ణిపూర్ వంటి రాష్ట్రాల్లోనే విధించాల్సి ఉంటుంద‌ని.. కేంద్రానికి కూడా కొన్ని ప‌రిమితులు ఉంటాయ‌ని, రాష్ట్రాల విష‌యంలో జోక్యం చేసుకునే హ‌క్కులు స్ప‌ష్టంగా రాజ్యాంగం పేర్కొంద‌ని ఎంవీవీ వ్యాఖ్యానించారు. ఈ విష‌యం తెలిసి కూడా టీడీపీ నేత‌లు.. రాజ‌కీయం చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

This post was last modified on June 22, 2023 12:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. స‌త్తా చాటుకున్నారు. సాధార‌ణ అభివృద్ధి ప‌నుల‌తో పాటు.. ఎవ‌రూ ఊహించ‌ని…

2 hours ago

శర్వానంద్ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారా

నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…

2 hours ago

ఓపెనింగ్ టాక్…. డామినేషన్ ఎవరిది?

నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…

2 hours ago

మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…

4 hours ago

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

7 hours ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

10 hours ago