వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రఘురామను గజ్జికుక్క అంటూ తీవ్రస్థాయిలో దూషించారు. తను, తన కుటుంబం కష్టాల్లో ఉంటే.. దానిని కూడా రాజకీయంగా వాడుకునేందుకు రఘురామ వంటి గజ్జికుక్కలు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంవీవీ.. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. తన కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, హింసిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు.
కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ మీద 13 కేసులు, రాజేష్ మీద 45 కేసులు ఉన్నాయని ఎంవీవీ తెలిపారు. హేమంత్తో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని.. కేవలం డబ్బులు కోసం ఇదంతా చేశారని చెప్పారు. అనుమానం ఉంటే తన కాల్ డేటా ఐదు సంవత్సరాలు చెక్ చేసుకోవాలన్నారు. అందరూ కోరుతున్నారు కాబట్టి ఘటనపై సీబీఐ, ఎన్ఐఏ విచారణ వేయాలని తానే స్వయంగా కోరుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు లేవని చెప్పలేదన్నారు. తాను రాజకీయాల్లో ఉండడంతో ప్రతిదీ వక్రీకరిస్తున్నారని ఎంవీవీ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో వ్యాపారం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నా ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నా రు. ఈ ఘటనలో ఏ పార్టీకి, ఎవరికి, ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం డబ్బులు కోసమే ఇదంతా చేశారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. కానీ, ఏ విషయం జరిగినా.. దానికి వైసీపీకి, సీఎం జగన్కు ముడిపెట్టి మాట్లాడుతున్నా రని.. చంద్రబాబు హయాంలో ఇలాంటి ఘటనే జరిగితే ఇలా మాట్లాడేవారా? అని ప్రశ్నించారు. వైసీపీని బద్నాం చేయాలని అనుకునేవారే .. వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోతారని ఎంవీవీ వ్యాఖ్యానించారు. తాను వైసీపీలోనే ఉన్నానని, ఉంటానని.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తున్నానని సత్యనారాయణ చెప్పారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని గుండెలు బాదుకుంటున్నటీడీపీ తన హయాంలో ఏం జరిగిందో ఒక్కసారి తిరిగి చూసుకోవాలని ఎంవీవీ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 355 అనేది.. అన్ని రాష్ట్రాలకూ వర్తించదని.. అలా వర్తించే టట్టయితే.. మొదట మణిపూర్ వంటి రాష్ట్రాల్లోనే విధించాల్సి ఉంటుందని.. కేంద్రానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని, రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకునే హక్కులు స్పష్టంగా రాజ్యాంగం పేర్కొందని ఎంవీవీ వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసి కూడా టీడీపీ నేతలు.. రాజకీయం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు.
This post was last modified on June 22, 2023 12:00 pm
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…