Political News

ర‌ఘురామ‌ గ‌జ్జికుక్క అంటూ ఎంవీవీ సీరియ‌స్‌

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై విశాఖ‌ప‌ట్నం ఎంపీ ఎంవీవీ స‌త్య నారాయ‌ణ తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. ర‌ఘురామ‌ను గ‌జ్జికుక్క అంటూ తీవ్ర‌స్థాయిలో దూషించారు. త‌ను, త‌న కుటుంబం క‌ష్టాల్లో ఉంటే.. దానిని కూడా రాజ‌కీయంగా వాడుకునేందుకు ర‌ఘురామ వంటి గ‌జ్జికుక్క‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంవీవీ.. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. త‌న‌ కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, హింసిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు.

కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ మీద 13 కేసులు, రాజేష్ మీద 45 కేసులు ఉన్నాయని ఎంవీవీ తెలిపారు. హేమంత్‌తో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని.. కేవలం డబ్బులు కోసం ఇదంతా చేశారని చెప్పారు. అనుమానం ఉంటే తన కాల్ డేటా ఐదు సంవత్సరాలు చెక్ చేసుకోవాలన్నారు. అందరూ కోరుతున్నారు కాబట్టి ఘటనపై సీబీఐ, ఎన్ఐఏ విచార‌ణ‌ వేయాలని తానే స్వయంగా కోరుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు లేవని చెప్పలేదన్నారు. తాను రాజకీయాల్లో ఉండడంతో ప్రతిదీ వక్రీకరిస్తున్నారని ఎంవీవీ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో వ్యాపారం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నా ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నా రు. ఈ ఘటనలో ఏ పార్టీకి, ఎవరికి, ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం డబ్బులు కోసమే ఇదంతా చేశారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. కానీ, ఏ విష‌యం జ‌రిగినా.. దానికి వైసీపీకి, సీఎం జ‌గ‌న్‌కు ముడిపెట్టి మాట్లాడుతున్నా ర‌ని.. చంద్ర‌బాబు హ‌యాంలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగితే ఇలా మాట్లాడేవారా? అని ప్ర‌శ్నించారు. వైసీపీని బ‌ద్నాం చేయాల‌ని అనుకునేవారే .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ లేకుండా పోతార‌ని ఎంవీవీ వ్యాఖ్యానించారు. తాను వైసీపీలోనే ఉన్నాన‌ని, ఉంటాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేస్తున్నాన‌ని స‌త్య‌నారాయ‌ణ చెప్పారు.

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగింద‌ని గుండెలు బాదుకుంటున్న‌టీడీపీ త‌న హ‌యాంలో ఏం జ‌రిగిందో ఒక్క‌సారి తిరిగి చూసుకోవాల‌ని ఎంవీవీ వ్యాఖ్యానించారు. ఆర్టిక‌ల్ 355 అనేది.. అన్ని రాష్ట్రాల‌కూ వ‌ర్తించ‌ద‌ని.. అలా వ‌ర్తించే ట‌ట్ట‌యితే.. మొద‌ట మ‌ణిపూర్ వంటి రాష్ట్రాల్లోనే విధించాల్సి ఉంటుంద‌ని.. కేంద్రానికి కూడా కొన్ని ప‌రిమితులు ఉంటాయ‌ని, రాష్ట్రాల విష‌యంలో జోక్యం చేసుకునే హ‌క్కులు స్ప‌ష్టంగా రాజ్యాంగం పేర్కొంద‌ని ఎంవీవీ వ్యాఖ్యానించారు. ఈ విష‌యం తెలిసి కూడా టీడీపీ నేత‌లు.. రాజ‌కీయం చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

This post was last modified on June 22, 2023 12:00 pm

Share

Recent Posts

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

5 minutes ago

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

4 hours ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

5 hours ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

6 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

6 hours ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

6 hours ago