తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని వైసీపీ చెప్పినట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ చెప్పింది. విశాఖపట్నంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో వైసీపీకి జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనను తప్పుపడుతు పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. సజ్జల చేసిన ప్రకటన ఆధారంగా వైసీపీ గుర్తుంపు రద్దుచేయాలని ఎంపీ నానా రచ్చ చేశారు. ప్రకటన ఆధారంగానే కమీషన్ కూడా వైసీపీకి నోటీసులు జారీచేసింది.
ఆ నోటీసులకు పార్టీ తరపున ఎన్నికల కమీషన్ కు సమాధానం వచ్చినట్లుగా ఎంపీకి కమీషన్ చెప్పింది. నిజానికి శాశ్వత అధ్యక్షుడు అన్నా రెండేళ్ళకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని చెప్పినా ఫలితమొకటే. ఎందుకంటే ఏ ప్రాంతీయపార్టీని తీసుకున్నా అధినేతలే శాశ్వత అధ్యక్షులుగా ఉంటారు. టీడీపీకి చంద్రబాబునాయుడు, డీఎంకేకి స్టాలిన్, ఎస్సీకి అఖిలేష్ యాదవ్, ఎన్సీపీకి శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ కు మమతా బెనర్జీలే ఉదాహరణ.
ప్రాంతీయ పార్టీల్లో అధినేతలు బతికున్నంతకాలం మరోకళ్ళు వాళ్ళస్ధానంలో అధ్యక్షులు కాలేరన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఏదో మొక్కుబడిగా రెండేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించినట్లు అందులో తామే అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారంతే. ఈమాత్రం ఇంగితం కూడా వైసీపీలో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. ఇతర ప్రాంతీయపార్టీలు ఏమిచేస్తున్నాయో కూడా ఆలోచించే స్ధితిలో వైసీపీ లేదు. శాశ్వత అధ్యక్షుడు అనే పద్దతి లేదని కేంద్ర ఎన్నికల కమీషన్ చెప్పినపుడు దాన్ని పాటించాలి.
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…