ఎన్నికల సమయం వచ్చిందంటే.. చాలు నాయకులు శివాలెత్తిపోతారు. ప్రజలకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేస్తారు. అధికారమే పరమావధిగా నాయకులు పార్టీలు కూడా.. పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తారు. అయితే… ఇలాంటి హామీలే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పట్టుమని నెల రోజులు కూడా గడవకముందే.. ఆపశోపాలు పడుతోంది. కర్ణాటకలో గత నెల మేలో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించింది.
ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ప్రకటించింది. దీనిని జిల్లాకే పరిమితం చేసినట్టు చెప్పింది. అయినా.. కూడా ఇప్పుడు బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక ఆర్టీసీకి 84 కోట్లరూపాయల వరకు నష్టం వస్తోందని అధికారులు తాజాగా సీఎం సిద్దరామయ్యకు నివేదిక సమర్పించారు. అంతేకాదు.. అసలు సీట్లన్నీ.. మహిళలకే కేటాయించేశామని.. వారు తప్ప.. ఇంకెవరూ బస్సులు ఎక్కడం లేదని కూడా వారు చెప్పారు.
దీంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోంతోందన్నది కర్ణాటక ఆర్టీసీ అధికారుల ఆవేదన, ఆందోళన కూడా. అంతేకాదు.. అన్నభాగ్య పథకం కింద.. కుంటాబానికి మనిషికి 10 కిలోలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు.. బియ్యం కొరతతో దీనిని 5 కేజీలకు తగ్గించింది. అయితే.. దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ఇలా.. అనేక పథకాలు.. ఉన్నాయి. ముఖ్యంగా ఉచిత విద్యుత్ అంశం.. సర్కారుకు చెమటలు పట్టిస్తోంది.
మొత్తంగా చూస్తే.. ఉచితాలు ప్రజలకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలకు ఎన్ని ఇబ్బందులు తీసుకువస్తాయో చెప్పడానికి కర్ణాటకలో తాజాగా అమలవుతున్న ఆర్టీసీ విషయం ప్రధాన ఉదాహరణగా నిలిచింది. దీని నుంచి బయటకు రాలేక.. సిద్దరామయ్య సర్కారు తర్జన భర్జన పడుతోంది. కాబట్టి.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అయినా.. పార్టీ ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాలని .. మేధావులు పరిశీలకులు సూచిస్తున్నారు. ఏపీ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఎన్నికల హామీలేనని చెబుతున్నారు.
This post was last modified on June 21, 2023 4:11 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…