ఎన్నికల సమయం వచ్చిందంటే.. చాలు నాయకులు శివాలెత్తిపోతారు. ప్రజలకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేస్తారు. అధికారమే పరమావధిగా నాయకులు పార్టీలు కూడా.. పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తారు. అయితే… ఇలాంటి హామీలే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పట్టుమని నెల రోజులు కూడా గడవకముందే.. ఆపశోపాలు పడుతోంది. కర్ణాటకలో గత నెల మేలో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించింది.
ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ప్రకటించింది. దీనిని జిల్లాకే పరిమితం చేసినట్టు చెప్పింది. అయినా.. కూడా ఇప్పుడు బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక ఆర్టీసీకి 84 కోట్లరూపాయల వరకు నష్టం వస్తోందని అధికారులు తాజాగా సీఎం సిద్దరామయ్యకు నివేదిక సమర్పించారు. అంతేకాదు.. అసలు సీట్లన్నీ.. మహిళలకే కేటాయించేశామని.. వారు తప్ప.. ఇంకెవరూ బస్సులు ఎక్కడం లేదని కూడా వారు చెప్పారు.
దీంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోంతోందన్నది కర్ణాటక ఆర్టీసీ అధికారుల ఆవేదన, ఆందోళన కూడా. అంతేకాదు.. అన్నభాగ్య పథకం కింద.. కుంటాబానికి మనిషికి 10 కిలోలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు.. బియ్యం కొరతతో దీనిని 5 కేజీలకు తగ్గించింది. అయితే.. దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ఇలా.. అనేక పథకాలు.. ఉన్నాయి. ముఖ్యంగా ఉచిత విద్యుత్ అంశం.. సర్కారుకు చెమటలు పట్టిస్తోంది.
మొత్తంగా చూస్తే.. ఉచితాలు ప్రజలకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలకు ఎన్ని ఇబ్బందులు తీసుకువస్తాయో చెప్పడానికి కర్ణాటకలో తాజాగా అమలవుతున్న ఆర్టీసీ విషయం ప్రధాన ఉదాహరణగా నిలిచింది. దీని నుంచి బయటకు రాలేక.. సిద్దరామయ్య సర్కారు తర్జన భర్జన పడుతోంది. కాబట్టి.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అయినా.. పార్టీ ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాలని .. మేధావులు పరిశీలకులు సూచిస్తున్నారు. ఏపీ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఎన్నికల హామీలేనని చెబుతున్నారు.
This post was last modified on June 21, 2023 4:11 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…