ఎన్నికల సమయం వచ్చిందంటే.. చాలు నాయకులు శివాలెత్తిపోతారు. ప్రజలకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేస్తారు. అధికారమే పరమావధిగా నాయకులు పార్టీలు కూడా.. పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తారు. అయితే… ఇలాంటి హామీలే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పట్టుమని నెల రోజులు కూడా గడవకముందే.. ఆపశోపాలు పడుతోంది. కర్ణాటకలో గత నెల మేలో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించింది.
ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ప్రకటించింది. దీనిని జిల్లాకే పరిమితం చేసినట్టు చెప్పింది. అయినా.. కూడా ఇప్పుడు బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక ఆర్టీసీకి 84 కోట్లరూపాయల వరకు నష్టం వస్తోందని అధికారులు తాజాగా సీఎం సిద్దరామయ్యకు నివేదిక సమర్పించారు. అంతేకాదు.. అసలు సీట్లన్నీ.. మహిళలకే కేటాయించేశామని.. వారు తప్ప.. ఇంకెవరూ బస్సులు ఎక్కడం లేదని కూడా వారు చెప్పారు.
దీంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోంతోందన్నది కర్ణాటక ఆర్టీసీ అధికారుల ఆవేదన, ఆందోళన కూడా. అంతేకాదు.. అన్నభాగ్య పథకం కింద.. కుంటాబానికి మనిషికి 10 కిలోలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు.. బియ్యం కొరతతో దీనిని 5 కేజీలకు తగ్గించింది. అయితే.. దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ఇలా.. అనేక పథకాలు.. ఉన్నాయి. ముఖ్యంగా ఉచిత విద్యుత్ అంశం.. సర్కారుకు చెమటలు పట్టిస్తోంది.
మొత్తంగా చూస్తే.. ఉచితాలు ప్రజలకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలకు ఎన్ని ఇబ్బందులు తీసుకువస్తాయో చెప్పడానికి కర్ణాటకలో తాజాగా అమలవుతున్న ఆర్టీసీ విషయం ప్రధాన ఉదాహరణగా నిలిచింది. దీని నుంచి బయటకు రాలేక.. సిద్దరామయ్య సర్కారు తర్జన భర్జన పడుతోంది. కాబట్టి.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అయినా.. పార్టీ ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాలని .. మేధావులు పరిశీలకులు సూచిస్తున్నారు. ఏపీ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఎన్నికల హామీలేనని చెబుతున్నారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…