Categories: Political News

ఢిల్లీలో సంజ‌య్‌.. తెలంగాణ‌లో ఏం జ‌రుగుతోందంటే!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. అయితే.. రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులకు క‌నీసం మాట మాత్రంగా కూడా ఆయ‌న ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఏమీ చెప్ప‌కుండా వెళ్ల‌డంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెండు రోజులుగా బండి సంజయ్ ఢిల్లీలో ఏం చేస్తున్నారనే ప్రశ్న తెలంగాణ బీజేపీ నేత‌ల మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతోంది. సోమవారం ఢిల్లీ వెళ్లిన సంజయ్ రెండు రోజులుగా పార్టీ అగ్ర నేతలతో వరుస సమావేశాలు అవుతున్నారు. అయితే.. సంజ‌య్ స్వ‌యంగా వెళ్లార‌ని.. కొంద‌రు చెబుతుంటే, కాదు, పార్టీ అధిష్టాన‌మే ఆయ‌నను పిలిచింద‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలావుంటే.. రాష్ట్రంలో ప్ర‌స్తుతం అధ్య‌క్ష మార్పు అనివార్య‌మ‌నే సంకేతాలు త‌ర‌చుగా వ‌స్తున్నాయి. మ‌రో ఐదారుమాసాల్లోనే ఇక్క‌డ ఎన్నిక‌లు ఉండ‌డంతోపాటు.. బ‌ల‌మైన కేసీఆర్‌ను ఢీ కొట్టాలంటే అంతే బ‌లంగా వ్య‌వ‌హ‌రించాల‌ని పార్టీ అధిష్టానం కూడా నిర్ణ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ఆక‌స్మిక ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిగా మారింది. మ‌రోవైపు.. పార్టీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు తెలంగాణ‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అగ్ర నేతలకు బండి వివరించినట్లు తెలుస్తోంది.

పార్టీలో నెలకొన్న స్తబ్దత, చేరికలపై చర్చించినట్లుగా సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితి నుంచి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు అగ్ర నేతల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ నెల 25న రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్లో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు.  అదేస‌మ‌యంలో అమిత్ షాతో బహిరంగ సభను ఈ నెల చివరి వారంలో నిర్వహించే విషయంలో చర్చించేందుకు వెళ్లారని బీజేపీ నాయకులు తెలిపారు.

దీంతో పాటు ప్రధాని మోడీ విదేశీ పర్యటన అనంతరం.. రాష్ట్రంలో పర్యటించే అంశంపై అగ్ర నేతలతో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహా జన్ సంపర్క్ అభియాన్లో భాగంగా రాష్ట్రంలో నిర్వహించిన కార్యక్రమాలు, సభలు సమావేశాలపై అధిష్ఠానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో మోడీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి అయినందున ఈ నెల 22న ప్రతి నాయకుడు తమ నియోజక వర్గాల్లోని ప్రజలను కలవనున్నారు. దీనిపైనా బండి సంజ‌య్ పార్టీ అధిష్టానానికి వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది.

Satya

Recent Posts

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

13 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

44 minutes ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

1 hour ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

4 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

4 hours ago