Political News

వచ్చే నెలలో కీలక పరిణామాలు ?

ఏపీ లక్ష్యంగా వచ్చే నెలలో రాజకీయంగా కీలక పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టీడీపీ నుండి రెండు రకాలుగాను, జనసేన నుండి వారాహి యాత్ర రూపంలోనే అధికార వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. లోకేష్ పాదయాత్రకు తోడు మినీ మ్యానిఫెస్టోతో జనాల్లోకి వెళ్ళేందుకు టీడీపీ బస్సుయాత్రకు రెడీ అవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే వారాహి యాత్ర మొదలుపెట్టేశారు.

ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతలు కూడా జగన్ టార్గెట్ గా ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు మరోవైపు పవన్ తమ పర్యటనల్లో జనాలకు హామీలు ఇచ్చేస్తున్నారు. బీజేపీ మాత్రమే ఇంకా ఆ పనిచేయలేదు. మారుతున్న రాజకీయ సమీకరణల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేయడం దాదాపు ఖాయమనే అనిపిస్తోంది. ఉమ్మడిగా పోటీచేయాలని అనుకుంటున్నపుడు ప్రణాళిక లేదా మ్యానిఫెస్టో కూడా ఉమ్మడిగానే ఉండాలి కదా.

అందుకనే పొత్తులపై వచ్చే నెలలో ఏదో ఒకటి తేల్చేయాలని అనుకుంటున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా పదినెలల సమయముంది. కానీ తెలంగాణ లో ఉన్నది ఆరు నెలలు మాత్రమే. పొత్తులుపెట్టుకునే విషయంలో బీజేపీ ఇప్పుడు కూడా క్లారిటి ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోవటం ఖాయం. అందుకనే టీడీపీతో పొత్తు విషయంలో వచ్చే నెలలో బీజేపీ ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోందని సమాచారం. వచ్చేనెలలో నరేంద్రమోడీ లేదా అమిత్ షా మరోసారి చంద్రబాబుతో భేటీ జరపబోతున్నారట. అప్పుడు పొత్తులపై క్లారిటీ వచ్చేస్తుంది.

ఢిల్లీలో భేటీ తర్వాత మూడు పార్టీలు సంయుక్తంగా సమావేశం అవటానికి రంగం సిద్ధమవుతోంది. అప్పుడు మూడుపార్టీల తరపున ఉమ్మడి ప్రణాళికను రెడీచేయబోతున్నట్లు ప్రకటిస్తారట. మూడుపార్టీల్లోని సీనియర్లు కూర్చుని ఉమ్మడి మ్యానిఫెస్టోకు రూపకల్పన చేస్తారని తెలుస్తోంది. జరుగుతున్నది చూస్తుంటే జగన్ను ఎలాగైనా ఓడించి మళ్ళీ అధికారంలోకి రావాలన్న పట్టుదల ప్రతిపక్షాల్లో బలంగానే కనబడుతోంది. మరి పొత్తులంటే సీట్ల సర్దుబాటు, పోటీచేయబోయే నియోజకవర్గాలు తదితరాలను ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాయో చూడాల్సిందే. ఏదేమైనా రాబోయే ఎన్నికలు మాత్రం జగన్ చెప్పినట్లుగా కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేట్లే ఉంది.

This post was last modified on June 18, 2023 4:50 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

48 mins ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

1 hour ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

2 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

3 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago

సీమ ఓట్ల హైజాక్‌.. ఎవ‌రికి మేలు?

రాయ‌లసీమ‌లో ఓట్ల హైజాక్ జ‌రిగిందా? వైసీపీకి ప‌డాల్సిన ఓట్లు.. కాంగ్రెస్‌కు ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.…

15 hours ago