Political News

వచ్చే నెలలో కీలక పరిణామాలు ?

ఏపీ లక్ష్యంగా వచ్చే నెలలో రాజకీయంగా కీలక పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టీడీపీ నుండి రెండు రకాలుగాను, జనసేన నుండి వారాహి యాత్ర రూపంలోనే అధికార వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. లోకేష్ పాదయాత్రకు తోడు మినీ మ్యానిఫెస్టోతో జనాల్లోకి వెళ్ళేందుకు టీడీపీ బస్సుయాత్రకు రెడీ అవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే వారాహి యాత్ర మొదలుపెట్టేశారు.

ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతలు కూడా జగన్ టార్గెట్ గా ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు మరోవైపు పవన్ తమ పర్యటనల్లో జనాలకు హామీలు ఇచ్చేస్తున్నారు. బీజేపీ మాత్రమే ఇంకా ఆ పనిచేయలేదు. మారుతున్న రాజకీయ సమీకరణల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేయడం దాదాపు ఖాయమనే అనిపిస్తోంది. ఉమ్మడిగా పోటీచేయాలని అనుకుంటున్నపుడు ప్రణాళిక లేదా మ్యానిఫెస్టో కూడా ఉమ్మడిగానే ఉండాలి కదా.

అందుకనే పొత్తులపై వచ్చే నెలలో ఏదో ఒకటి తేల్చేయాలని అనుకుంటున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా పదినెలల సమయముంది. కానీ తెలంగాణ లో ఉన్నది ఆరు నెలలు మాత్రమే. పొత్తులుపెట్టుకునే విషయంలో బీజేపీ ఇప్పుడు కూడా క్లారిటి ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోవటం ఖాయం. అందుకనే టీడీపీతో పొత్తు విషయంలో వచ్చే నెలలో బీజేపీ ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోందని సమాచారం. వచ్చేనెలలో నరేంద్రమోడీ లేదా అమిత్ షా మరోసారి చంద్రబాబుతో భేటీ జరపబోతున్నారట. అప్పుడు పొత్తులపై క్లారిటీ వచ్చేస్తుంది.

ఢిల్లీలో భేటీ తర్వాత మూడు పార్టీలు సంయుక్తంగా సమావేశం అవటానికి రంగం సిద్ధమవుతోంది. అప్పుడు మూడుపార్టీల తరపున ఉమ్మడి ప్రణాళికను రెడీచేయబోతున్నట్లు ప్రకటిస్తారట. మూడుపార్టీల్లోని సీనియర్లు కూర్చుని ఉమ్మడి మ్యానిఫెస్టోకు రూపకల్పన చేస్తారని తెలుస్తోంది. జరుగుతున్నది చూస్తుంటే జగన్ను ఎలాగైనా ఓడించి మళ్ళీ అధికారంలోకి రావాలన్న పట్టుదల ప్రతిపక్షాల్లో బలంగానే కనబడుతోంది. మరి పొత్తులంటే సీట్ల సర్దుబాటు, పోటీచేయబోయే నియోజకవర్గాలు తదితరాలను ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాయో చూడాల్సిందే. ఏదేమైనా రాబోయే ఎన్నికలు మాత్రం జగన్ చెప్పినట్లుగా కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేట్లే ఉంది.

Satya

Recent Posts

కళాకారుడి చెమటకు దక్కిన గౌరవం

చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…

22 minutes ago

బ్యాన్ వల్లే ఎక్కువ మంది చూసారా?

సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…

59 minutes ago

కంగనా సినిమా… 250 కోట్లు కట్టమంటున్నారు

బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్‌కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…

1 hour ago

దర్శకత్వాన్ని పంచుకుంటున్న లారెన్స్

రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…

4 hours ago

రామాయణ డిమాండ్ సగానికి తగ్గిందా?

బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…

4 hours ago

పెళ్లి కాలేదు… పిల్లల కోసం హీరోయిన్ ఏం చేసింది?

బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్‌లో కొనసాగుతున్న…

7 hours ago