ఏపీలో జనాలు కేసీయార్ నాయకత్వం కోరుకుంటున్నారా ? అవుననే అంటున్నారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. హైదరాబాద్ లో మాట్లాడుతు వైసీపీ, టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆగమాగమైపోయిందని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర ధరలతో మధ్య జనాలు కుదేలైపోతున్నట్లు తోట తెగ బాధ పడిపోయారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా అందరు బీఆర్ఎస్ వైపే చూస్తున్నట్లు చెప్పారు. తాను ఎక్కడ పర్యటించినా అందరు బీఆర్ఎస్ రావాలనే కోరుకుంటున్నట్లు తెలుస్తోందని చెప్పారు.
సరే పార్టీ అధ్యక్షుడిగా తోట అలా చెప్పుకోవటంలో తప్పేమీలేదు. కానీ నిత్యావసరాల ధరల పెరుగుదలలో ఎక్కువగా కేంద్రప్రభుత్వమే కారణమని జనాలందరికీ తెలుసు. పెట్రోలు, డీజల్ ధరలను తగ్గిస్తే ఆటోమేటిక్కుగా నిత్యావసరాల ధరలు అవే తగ్గుతాయి. పెట్రోలు, డీజల్ ధరలను నియంత్రించేది కేంద్రమే కానీ రాష్ట్రప్రభుత్వాలు కాదన్న విషయం అందరికీ తెలుసు. ఏపీలో నిత్యావసరాల ధరలున్నట్లే తెలంగాణాలో కూడా దాదాపు అవే ధరలున్న విషయం తోటకు తెలీదా ?
నిత్యావసరాల ధరలతో ఏపీలో జనాలు ఆగమాగమవుతున్నారంటే తెలంగాణాలో జనాల పరిస్ధితి కూడా దాదాపు ఇలాగే ఉంటుందనటంలో సందేహంలేదు. మరప్పుడు కేసీయార్ పాలనలో కూడా జనాలు ఇబ్బందులు పడుతున్నట్లే కదా లెక్క. ఇక కేసీయార్ నాయకత్వం విషయం మాట్లాడాలంటే చాలా వుంది. తాజా పరిస్ధితుల్లో కేసీయారే తన దృష్టిని ఏపీ మీదనుండి మహారాష్ట్ర మీదకు మరల్చారు. రాష్ట్ర విభజనకు కేసీయారే కారణమన్న విషయం ప్రతి ఆధ్రుడికీ తెలుసు. అడ్డుగోలు విభజనలో కేసీయార్ పాత్రేమిటో కూడా జనాలకు అవగాహనుంది.
ఇక తెలంగాణాలోనే కేసీయార్ పాలనపై జనాల్లో బాగా వ్యతిరేకత కనబడుతోంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే విషయంలో చాలామంది అధికార పార్టీ నేతల్లోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ను వదిలేసే నేతల సంఖ్య మరింతగా పెరిగిపోయేట్లుంది. ఏ వర్గాన్ని కదిలించినా కేసీయార్ పాలనపై విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. వాస్తవాలు ఇలాగుంటే తోట మాత్రం ఏపీలో కూడా కేసీయార్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పటం భలేగుంది.
This post was last modified on June 18, 2023 11:24 am
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…