Political News

మంత్రి వ‌ర్సెస్ ఐఏఎస్‌.. ఏపీలో ఏం జ‌రుగుతోంది?

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన‌ట్టు వినాల‌ని.. సీఎం జ‌గ‌న్ స్థాయిలో ఆదేశాలు ఉన్నాయి. కానీ, కొంద‌రు మాత్రం ఈ మాట‌ల‌ను లెక్క‌చేయ‌డం లేదు. ఎవ‌రి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, క‌లెక్ట‌ర్ల‌కు మ‌ధ్య వివాదాలు రోజుకోర‌కంగా మారు తున్నాయి. ఇక‌, ఇప్పుడు ఏకంగా.. డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయ‌ణ‌స్వామి వ్య‌వ‌హారం మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది.

ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా తాను చెప్పిన దానికి అధికారులు ఏమాత్రం విలువ ఇవ్వ‌డం లేద‌ని.. నారాయ‌ణ స్వామి బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖలో పోస్టింగ్‌ల వివాదంతో ఆయ‌న తీవ్ర అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. మంత్రి నారాయణ స్వామి, ఎక్సైజ్‌ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ మధ్య వివాదం ఏకంగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి చేరింది. డిప్యూటీ సీఎం ఇచ్చిన ఆదేశాన్ని స్పెషల్‌ సీఎస్‌ అమలు చేయకపోవడంతో.. తన ఆదేశాన్ని స్పెషల్‌ సీఎస్‌ పట్టించుకోవడం లేదంటూ నారాయ‌ణ స్వామి సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్‌ను 30:70 నిష్పత్తిలో ఎక్సైజ్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోగా విభజించింది. దీంతో ఎక్కువమంది అధికారులు, కానిస్టేబుళ్లు సెబ్‌కు వెళ్లిపోయారు. కాగా, పని ఒత్తిడి కారణంగా సెబ్‌లో ఉన్నవారు ఎక్సైజ్‌కు రావాలని చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఎక్సైజ్‌కు నాలుగు డిప్యూటీ కమిషనర్‌ పోస్టులు కేటాయించగా ప్రస్తుతం గుంటూరు, కర్నూలు డీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

గుంటూరు డీసీ పోస్టును సెబ్‌లో ఉన్న ఓ డిప్యూటీ కమిషనర్‌కు ఇవ్వాలని నారాయణస్వామి దాదాపు 2నెలల కిందట ఆదేశించారు. అయితే పదోన్నతి పొందబోయే మరో అధికారికి ఆ పోస్టింగ్‌ ఇవ్వాలనే ఆలోచనతో స్పెషల్‌ సీఎస్ ర‌జ‌త్ భార్గ‌వ దాన్ని అమలు చేయలేదు. ప్రస్తుతం ఆ అధికారి అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన డీసీ అవుతారు. అప్పుడు ఆయన్ను గుంటూరు డీసీ చేయాలని రజత్‌ భార్గవ ప్రయత్నిస్తున్నారు.

తాను చెప్పిన అధికారిని సెబ్‌ నుంచి ఎక్సైజ్‌కు తీసుకొచ్చి గుంటూరు డీసీ చేయాలని నారాయణస్వామి పలుమార్లు గుర్తుచేశారు. కానీ త్వరలో పదోన్నతుల ప్రక్రియ ఉందనే కార‌ణం చూపి ఈ ఆదేశాన్ని ఐఏఎస్‌ పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఉపముఖ్యమంత్రి పది రోజుల కిందట నేరుగా సీఎంవోలో ఫిర్యాదు చేశారు. ఒక పోస్టింగ్‌ విషయంలోనూ తన ఆదేశం అమలుచేకపోతే ఎలాగని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి మంత్రి వ‌ర్సెస్ ఐఏఎస్ మ‌ధ్య వివాదం సీఎం జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారింద‌ని అంటున్నారు.

Satya

Recent Posts

సెట్ కి రాకుండా సినిమా తీసిన సింగీతం

దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…

2 hours ago

బ్రాండింగ్ లో బాబు, పవన్ తర్వాతే ఎవరైనా!

నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…

4 hours ago

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

8 hours ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

10 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

12 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

13 hours ago