ఏపీలో చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్టు వినాలని.. సీఎం జగన్ స్థాయిలో ఆదేశాలు ఉన్నాయి. కానీ, కొందరు మాత్రం ఈ మాటలను లెక్కచేయడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు మధ్య వివాదాలు రోజుకోరకంగా మారు తున్నాయి. ఇక, ఇప్పుడు ఏకంగా.. డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది.
ఎక్సైజ్ శాఖ మంత్రిగా తాను చెప్పిన దానికి అధికారులు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని.. నారాయణ స్వామి బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్ల వివాదంతో ఆయన తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మంత్రి నారాయణ స్వామి, ఎక్సైజ్ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ మధ్య వివాదం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. డిప్యూటీ సీఎం ఇచ్చిన ఆదేశాన్ని స్పెషల్ సీఎస్ అమలు చేయకపోవడంతో.. తన ఆదేశాన్ని స్పెషల్ సీఎస్ పట్టించుకోవడం లేదంటూ నారాయణ స్వామి సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్ను 30:70 నిష్పత్తిలో ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోగా విభజించింది. దీంతో ఎక్కువమంది అధికారులు, కానిస్టేబుళ్లు సెబ్కు వెళ్లిపోయారు. కాగా, పని ఒత్తిడి కారణంగా సెబ్లో ఉన్నవారు ఎక్సైజ్కు రావాలని చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఎక్సైజ్కు నాలుగు డిప్యూటీ కమిషనర్ పోస్టులు కేటాయించగా ప్రస్తుతం గుంటూరు, కర్నూలు డీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గుంటూరు డీసీ పోస్టును సెబ్లో ఉన్న ఓ డిప్యూటీ కమిషనర్కు ఇవ్వాలని నారాయణస్వామి దాదాపు 2నెలల కిందట ఆదేశించారు. అయితే పదోన్నతి పొందబోయే మరో అధికారికి ఆ పోస్టింగ్ ఇవ్వాలనే ఆలోచనతో స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ దాన్ని అమలు చేయలేదు. ప్రస్తుతం ఆ అధికారి అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన డీసీ అవుతారు. అప్పుడు ఆయన్ను గుంటూరు డీసీ చేయాలని రజత్ భార్గవ ప్రయత్నిస్తున్నారు.
తాను చెప్పిన అధికారిని సెబ్ నుంచి ఎక్సైజ్కు తీసుకొచ్చి గుంటూరు డీసీ చేయాలని నారాయణస్వామి పలుమార్లు గుర్తుచేశారు. కానీ త్వరలో పదోన్నతుల ప్రక్రియ ఉందనే కారణం చూపి ఈ ఆదేశాన్ని ఐఏఎస్ పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఉపముఖ్యమంత్రి పది రోజుల కిందట నేరుగా సీఎంవోలో ఫిర్యాదు చేశారు. ఒక పోస్టింగ్ విషయంలోనూ తన ఆదేశం అమలుచేకపోతే ఎలాగని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి మంత్రి వర్సెస్ ఐఏఎస్ మధ్య వివాదం సీఎం జగన్కు తలనొప్పిగా మారిందని అంటున్నారు.
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…