Political News

క‌రోనా దెబ్బ‌కు సీఎం కుర్చి పోయేలాగ ఉందే

కొంద‌రికి గుడ్ న్యూస్‌లో బ్యాడ్ టైం భ‌లే దారుణంగా ఉంటుంది. ఊహించ‌ని రీతిలో సీఎం ప‌ద‌విని కైవ‌సం చేసుకున్న శివ‌సేన నేత ఉద్ద‌వ్ ఠాక్రేకు క‌రోనా ఎఫె‌క్ట్ మామూలుగా త‌లిగేలా లేదు. ఏకంగా ఆయ‌న సీఎం సీటును కోల్పోయే ప‌రిస్థితి త‌ప్పేలా లేదు.

ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో గతేడాది నవంబర్‌ 28న సీఎంగా ప్రమాణం చేసిన ఉద్ధవ్‌.. మే 28లోగా ఆయన ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం తప్పనిసరి. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కంటే ప‌రోక్ష ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీ అవ్వాల‌ని ఉద్ద‌వ్ ఠాక్రే భావించారు. ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలని భావించగా కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఇప్పుడు ఉద్ద‌వ్ సీటుపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఉద్ద‌వ్ ఠాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని మహారాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి గ‌వ‌ర్న‌ర్‌కు పంపించింది. అయితే, మ‌హా కేబినెట్ చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఉద్ధవ్‌ సీఎం పీఠంపై నీలినీడలు అలుముకుంటున్నాయి.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఠాక్రే ఎలాగైనా చ‌క్రం తిప్పి ఎమ్మెల్సీగాఎన్నికవ‌డం లేదా త‌న ప‌ద‌వికి చేయ‌డం తప్ప‌‌‌దంటున్నారు. కరోనా ప్రభావంతో మహారాష్ట్రలో పొంచి ఉన్న రాజ్యాంగ సంక్షోభానికి పరిష్కారం కనుగొనకపోతే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తన పదవికి రాజీనామా చే‌యాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండ‌గా, మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని కరోనా వైరస్‌ తాకింది. వర్ష బంగ్లా వద్ద విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. పోలీసు ఇన్‌స్పెక్టర్‌తో సన్నిహితంగా మెలిగిన మరో ఆరుగురిని క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు పోలీసులు. పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వర్ష బంగ్లాతో పాటు పరిసర ప్రాంతాలను పారిశుద్ధ్య కార్మికులు శానిటైజ్‌ చేశారు.

కరోనా పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 20 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే.. ఒక్క మహారాష్ట్రలోనే 5,218 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు కరోనాతో 251 మంది మృతి చెందగా, దేశ వ్యాప్తంగా 645 మంది చనిపోయారు. ముంబయిలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.

This post was last modified on April 24, 2020 2:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: Big Story

Recent Posts

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

1 hour ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

3 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

9 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

10 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

10 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

11 hours ago