Political News

క‌రోనా దెబ్బ‌కు సీఎం కుర్చి పోయేలాగ ఉందే

కొంద‌రికి గుడ్ న్యూస్‌లో బ్యాడ్ టైం భ‌లే దారుణంగా ఉంటుంది. ఊహించ‌ని రీతిలో సీఎం ప‌ద‌విని కైవ‌సం చేసుకున్న శివ‌సేన నేత ఉద్ద‌వ్ ఠాక్రేకు క‌రోనా ఎఫె‌క్ట్ మామూలుగా త‌లిగేలా లేదు. ఏకంగా ఆయ‌న సీఎం సీటును కోల్పోయే ప‌రిస్థితి త‌ప్పేలా లేదు.

ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో గతేడాది నవంబర్‌ 28న సీఎంగా ప్రమాణం చేసిన ఉద్ధవ్‌.. మే 28లోగా ఆయన ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం తప్పనిసరి. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కంటే ప‌రోక్ష ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీ అవ్వాల‌ని ఉద్ద‌వ్ ఠాక్రే భావించారు. ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలని భావించగా కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఇప్పుడు ఉద్ద‌వ్ సీటుపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఉద్ద‌వ్ ఠాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని మహారాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి గ‌వ‌ర్న‌ర్‌కు పంపించింది. అయితే, మ‌హా కేబినెట్ చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఉద్ధవ్‌ సీఎం పీఠంపై నీలినీడలు అలుముకుంటున్నాయి.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఠాక్రే ఎలాగైనా చ‌క్రం తిప్పి ఎమ్మెల్సీగాఎన్నికవ‌డం లేదా త‌న ప‌ద‌వికి చేయ‌డం తప్ప‌‌‌దంటున్నారు. కరోనా ప్రభావంతో మహారాష్ట్రలో పొంచి ఉన్న రాజ్యాంగ సంక్షోభానికి పరిష్కారం కనుగొనకపోతే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తన పదవికి రాజీనామా చే‌యాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండ‌గా, మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని కరోనా వైరస్‌ తాకింది. వర్ష బంగ్లా వద్ద విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. పోలీసు ఇన్‌స్పెక్టర్‌తో సన్నిహితంగా మెలిగిన మరో ఆరుగురిని క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు పోలీసులు. పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వర్ష బంగ్లాతో పాటు పరిసర ప్రాంతాలను పారిశుద్ధ్య కార్మికులు శానిటైజ్‌ చేశారు.

కరోనా పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 20 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే.. ఒక్క మహారాష్ట్రలోనే 5,218 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు కరోనాతో 251 మంది మృతి చెందగా, దేశ వ్యాప్తంగా 645 మంది చనిపోయారు. ముంబయిలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

3 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

46 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago