Political News

ఏపీలో ఇంత గందరగోళమా ?

రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా గందరగోళం పెరిగిపోయింది. రాబోయేఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తుపెట్టుకుంటుంది ? ఎన్నిపార్టీలు ఒంటరిగా పోటీచేస్తాయో జనాలకు అర్ధంకావటంలేదు. జనాలకు అర్ధంకాకపోతే పోయింది కనీసం పార్టీల్లో అయినా క్లారిటి ఉందా అనే అనుమానం పెరిగిపోతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబునాయుడు భేటీ తర్వాత అయోమయం మొదలైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైన తర్వాత గందరగోళం మరింత పెరిగిపోయింది.

ఇంతకాలం టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోవటానికి రెడీ అయిపోయాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి అయోమయంలేదు. వస్తే బీజేపీ కూడా కలుస్తుంది లేకపోతే లేదన్న క్లారిటి ఉండేది. అయితే సడెన్ గా అమిత్ తో చంద్రబాబు భేటీ జరగటంతో పొత్తుల విషయంలో ఏమి జరుగుతోందో అర్ధంకావటంలేదు. టీడీపీ, బీజేపీ పొత్తుకు రెడీ అవుతున్నాయనే ప్రచారం పెరిగిపోయింది. అయితే రెండుపార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నట్లు ఇటు చంద్రబాబు అటు బీజేపీ నేతలు ఎవరూ ప్రకటించలేదు. దాంతో ఇద్దరు ఎందుకు కలిసారో అర్ధంకాలేదు.

ఇదే సమయంలో పవన్ కల్యాన్ వారాహి యాత్ర మొదలుపెట్టారు. యాత్రలో భాగంగా తాను ఒంటరిగా పోటీచేస్తానో లేకపోతే సమూహంగా పోటీచేస్తానో ఇంకా తేల్చుకోలేదన్నారు. ఇంతకాలం టీడీపీతో పొత్తుంటుందని చెప్పిన పవన్ సడెన్ గా ఎందుకు మాటమార్చారో అర్ధంకావటంలేదు. ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు తనకు బీజేపీ నుండి సహకారం అందదన్నారు. వైసీపీ-బీజేపీ మధ్య ఎప్పుడూ సహకారం లేదు. ఉన్నదల్లా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత మాత్రమే. అయినా బీజేపీ నుండి సహకారం అందదన్న మాటను జగన్ చెప్పాల్సిన అవసరంలేదు.

ఇక పొత్తుల విషయాన్ని బీజేపీ నేతల దగ్గర ప్రస్తావిస్తే తమకు జనసేనతో మాత్రమే పొత్తుంటుందని చెబుతున్నారు. సో ఇప్పటికి వైసీపీ మాత్రమే ఒంటరిగా పోటీచేస్తుందని క్లారిటి ఉంది. మరి టీడీపీ, జనసేన, బీజేపీలు ఏమిచేయబోతున్నాయో అర్ధంకావటంలేదు. అసలీ పార్టీలు ఇంత గందరగోళం ఎందుకు చేస్తున్నాయో కూడా తెలీటంలేదు.

This post was last modified on June 17, 2023 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago