టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగానే అనంతసాగరం జంక్షన్ లో బహిరంగ సభను నిర్వహించారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ సభలో పాల్గొన్నారు. ఆత్మకూరు నుంచి బరిలో దిగాలన్న ఆలోచనలో ఆనం ఉన్నారని తెలుస్తోంది.
ఈ సందర్భంగానే లోకేష్ పాదయాత్రలో ఆనం పాల్గొన్నాను. లోకేష్ యువగళానికి సంఘీభావం తెలిపి బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో జగన్ పై లోకేష్ నిప్పులు తిరగారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసింది జగన్ కు చెందిన మనుషులేనని లోకేష్ ఆరోపించారు. భూ కబ్జాల వాటాలలో తేడా వచ్చిందని, అందుకే ఈ కిడ్నాప్ డ్రామా నడిపించారని ఆరోపించారు. విశాఖను జగన్ క్రైమ్ కాపిటల్ చేశాడని అమిత్ షా అన్న వ్యాఖ్యలను లోకేష్ గుర్తు చేశారు.
జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం అని, మంత్రి వేణుగోపాల్ పేషీలో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ నుంచి వారికి జీతాలు రావాలని అని, అలా రాలేదు కాబట్టి ప్రభుత్వంతోపాటు కాపు, బీసీ కార్పొరేషన్ ఫెయిల్ అయ్యాయని అన్నారు. భవిష్యత్తుకు గ్యారటీ పేరుతో టిడిపి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతుందని అన్నారు. చనిపోయిన గౌతమ్ రెడ్డి గారికి, ఆత్మకూరు నియోజకవర్గానికి జగన్ తీరని అన్యాయం చేశాడని, సెంచురీ ప్లై వుడ్ కంపెనీని ఆత్మకూరుకి తీసుకొస్తే జగన్ దానిని దొంగలా ఎత్తుకుపోయాడని, గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి లేకుండా జగన్ చేశాడని అన్నారు.
This post was last modified on June 17, 2023 7:46 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…