Political News

వైసీపీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వెనుక జగన్:లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగానే అనంతసాగరం జంక్షన్ లో బహిరంగ సభను నిర్వహించారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ సభలో పాల్గొన్నారు. ఆత్మకూరు నుంచి బరిలో దిగాలన్న ఆలోచనలో ఆనం ఉన్నారని తెలుస్తోంది.

ఈ సందర్భంగానే లోకేష్ పాదయాత్రలో ఆనం పాల్గొన్నాను. లోకేష్ యువగళానికి సంఘీభావం తెలిపి బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో జగన్ పై లోకేష్ నిప్పులు తిరగారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసింది జగన్ కు చెందిన మనుషులేనని లోకేష్ ఆరోపించారు. భూ కబ్జాల వాటాలలో తేడా వచ్చిందని, అందుకే ఈ కిడ్నాప్ డ్రామా నడిపించారని ఆరోపించారు. విశాఖను జగన్ క్రైమ్ కాపిటల్ చేశాడని అమిత్ షా అన్న వ్యాఖ్యలను లోకేష్ గుర్తు చేశారు.

జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం అని, మంత్రి వేణుగోపాల్ పేషీలో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ నుంచి వారికి జీతాలు రావాలని అని, అలా రాలేదు కాబట్టి ప్రభుత్వంతోపాటు కాపు, బీసీ కార్పొరేషన్ ఫెయిల్ అయ్యాయని అన్నారు. భవిష్యత్తుకు గ్యారటీ పేరుతో టిడిపి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతుందని అన్నారు. చనిపోయిన గౌతమ్ రెడ్డి గారికి, ఆత్మకూరు నియోజకవర్గానికి జగన్ తీరని అన్యాయం చేశాడని, సెంచురీ ప్లై వుడ్ కంపెనీని ఆత్మకూరుకి తీసుకొస్తే జగన్ దానిని దొంగలా ఎత్తుకుపోయాడని, గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి లేకుండా జగన్ చేశాడని అన్నారు.

This post was last modified on June 17, 2023 7:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

1 hour ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

4 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

4 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

5 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

6 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

6 hours ago