Political News

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌: ప‌వ‌న్ వ్యాఖ్య‌లు

జనసేన అధినేత పవన్కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పిఠాపురం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేన అధికారం ఇవ్వాలని, తనను ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ముఖ్యమంత్రి పదవి చేపడితే దేశంలోనే ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఇలాంటి గూండాలు మనల్ని పాలిస్తున్నారంటే సిగ్గుపడాలని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేన అధికా రం ఇవ్వాలని కోరారు.`

తనకు మత పిచ్చి లేదని.. సనాతన ధర్మం పట్ల గౌరవం ఉందని ప‌వ‌న్ అన్నారు. అందరినీ సమానంగా చూసి ధర్మాన్ని చెప్పిన నేల ఇది.. వేదాలు తీసుకువచ్చిన బ్రాహ్మణ సమాజానికి నమస్కారాలు అని పేర్కొన్నారు. పిఠాపురంలో హిందూ దేవాలయాల ధ్వంసం దారుణమని తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆలయాన్ని ధ్వంసం చేసింది పిచ్చివాడని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేస్తూ.. 219 హిందూ ఆలయాల్లోనూ పిచ్చివాళ్లే ధ్వంసం చేశారా? అని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఒక్కరినీ పట్టుకోలేదని మండిపడ్డారు.

నా ఆంధ్ర నేల కోసం నిలబడతా అని చెప్పిన పవన్.. వైసీపీ ప్రభుత్వం గూండాలకు నిలయం… వీళ్లా మనల్ని పాలించేది.. మనకు సిగ్గుండాలి.. నేరస్తులంటే నాకు అసహ్యం అని వ్యాఖ్యానించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు పిఠాపురం పరిధిలోని 52 గ్రామాల నుంచి రెండు కోట్ల రూపాయల మట్టి దోచుకెళ్తున్నారని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. వారి సంగతి కాకినాడలో చెబుతాను అంటూ పవన్‌ హెచ్చరించారు. 300 లారీల మట్టి దోచే వాళ్లని కాళ్లు విరగగొట్టి మీకు ఉపాధి చూపించొ చ్చు.. దోపిడీనీ అడ్డుకుంటే మీకు పది వేల కోట్లతో ఉపాధి చూపించొచ్చు అని పవన్ పేర్కొన్నారు.

నేను బతికి ఉన్నంత వరకు నేర చరిత్ర ఉన్న వాళ్లు గద్దె ఎక్కడానికి వీల్లేదు అని పవన్ స్పష్టం చేశారు. ఆంధ్ర బాగుపడా లంటే మన కులపోడా, కాదా అన్నది చూడవద్దు.. మనకు సరైనోడా కాదా అన్నది చూడండి అని పిలుపునిచ్చారు. మనకు అధికారం లేకపోతేనే ఇంత భయపడుతున్నారే.. ఎమ్మెల్యేను చేసి చూడండి.. సీఎం స్థానం ఇస్తే ఆంధ్రను దేశంలోనే ఉన్నత స్థానంలో తీర్చిదిద్దుతా అని అన్నారు.

పిఠాపురం దేవుళ్ల సాక్షిగా అడుగుతున్నాను.. నాకు అధికారం ఇవ్వండి అని పవన్ అభ్యర్థించారు. నేను డిగ్రీలు చదవకపోయినా రోజూ 5నుంచి 8 గంటలు చదువుతా అని చెప్పిన పవన్.. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి ఏ వ్వూహమైనా పన్నుతా.. కాకినాడ ఎమ్మెల్యే కోసం అమిత్ షా వద్ద రిపోర్టు ఉంది అని తెలిపారు. పన్నులు పెంచి అభివృద్ధి అని గొప్పలా..? బిల్డింగ్ అనుమతులకు 40 నుంచి 70శాతం టాక్స్ పెంచుతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను సినిమా చేస్తే ఇండస్ట్రీలో 70 నుంచి 80 శాతం మందికి ఉపాధి దొరుకుతుందని పవన్ పేర్కొన్నారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

4 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

8 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

10 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

10 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

10 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

12 hours ago