ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కల మరోసారి వాయిదా పడింది. కోర్టుల్లో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో మరీ ఈ 16వ తేదీ కి విశాఖపట్నంలో రాజధాని పనులు ప్రారంభించడం గాని, తరలించడం గాని దాదాపు అసాధ్యం అని నిశ్చయించుకున్న ఏపీ సర్కారు దీనిపై ఒకడుగు వెనక్కు వేసింది. విశాఖలో పరిపాలన రాజధాని శంకుస్థాపన అధికారికంగా వాయిదా పడింది.
సుప్రీం, హైకోర్టుల్లో కేసులుండటం… వాటిలోవాదోపవాదాలు, వాయిదాల నేపథ్యంలో అనుకున్నంత వేగంగా ఈ కేసు తేలే అవకాశం లేదని గమనించిన ప్రభుత్వం కొంచెం దూరంగా ముహుర్తం పెట్టుకుంది. రాబోయే విజయదశమికి ముహూర్తం ఖరారు.
కోర్టుల్లో కేసులుంటే ప్రధాని నరేంద్రమోడీని కూడా ఆహ్వానించలేమని, అందుకే క్లియరెన్స్ వచ్చాకే ముందుకు పోదామని ప్రభుత్వం భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
కరోనా నేపథ్యంలో కూడా రాజధాని తరలింపును కోర్టు తాత్కాలికంగా ప్రశ్నించొచ్చని కూడా ముఖ్యమంత్రికి సలహా అందినట్లు తెలుస్తోంది.
This post was last modified on August 11, 2020 11:50 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…