ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కల మరోసారి వాయిదా పడింది. కోర్టుల్లో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో మరీ ఈ 16వ తేదీ కి విశాఖపట్నంలో రాజధాని పనులు ప్రారంభించడం గాని, తరలించడం గాని దాదాపు అసాధ్యం అని నిశ్చయించుకున్న ఏపీ సర్కారు దీనిపై ఒకడుగు వెనక్కు వేసింది. విశాఖలో పరిపాలన రాజధాని శంకుస్థాపన అధికారికంగా వాయిదా పడింది.
సుప్రీం, హైకోర్టుల్లో కేసులుండటం… వాటిలోవాదోపవాదాలు, వాయిదాల నేపథ్యంలో అనుకున్నంత వేగంగా ఈ కేసు తేలే అవకాశం లేదని గమనించిన ప్రభుత్వం కొంచెం దూరంగా ముహుర్తం పెట్టుకుంది. రాబోయే విజయదశమికి ముహూర్తం ఖరారు.
కోర్టుల్లో కేసులుంటే ప్రధాని నరేంద్రమోడీని కూడా ఆహ్వానించలేమని, అందుకే క్లియరెన్స్ వచ్చాకే ముందుకు పోదామని ప్రభుత్వం భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
కరోనా నేపథ్యంలో కూడా రాజధాని తరలింపును కోర్టు తాత్కాలికంగా ప్రశ్నించొచ్చని కూడా ముఖ్యమంత్రికి సలహా అందినట్లు తెలుస్తోంది.
This post was last modified on August 11, 2020 11:50 am
ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్రతి సినిమాకూ రిలీజ్ డేట్ మారడం అన్నది మామూలైపోయింది. ఐతే…
ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల…
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాబజార్ కు పని చేసిన వ్యక్తి ఇప్పుడో సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు…
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. దీంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇక పాయింట్ల పట్టిక…
ఎట్టకేలకు ఊహించినట్టే, ముందే లీకైనట్టే పెద్ది విడుదల తేదీ జూన్ 4 అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ…
సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలో అప్పుడప్పుడూ చిత్రవిచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన విచిత్రాలను సరిదిద్దడం అప్పటికప్పుడు సాధ్యం…