Political News

ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు తాజా కామెంట్స్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత ఇలాకా కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలోని పలు సమస్యలను తెలుసుకొని ప్రజలతో మమేకమయ్యేందుకు చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. నీతినిజాయితీకి కుప్పం ప్రజలు మారుపేరని, కానీ, వైసీపీ పాలనలో ఇక్కడ రౌడీలు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు.

వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. సంపద సృష్టించడం, ఆ సంపదను పేదలకు పంచడం టీడీపీకి మాత్రమే తెలుసని చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా టీడీపీని గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ పెట్టినప్పటి నుంచి కుప్పంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉందని చంద్రబాబు అన్నారు. పేదలను ధనికులను చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని అన్నారు.

మహిళలు మహాశక్తిగా మారేందుకు మహాశక్తి పథకం తెచ్చామని, ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లతో పాటుగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని అన్నారు. 95 శాతం హంద్రీనీవా పనులుె తన హయాంలో పూర్తయ్యాయని, మిగిలిన ఐదు శాతం పనులను జగన్ చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. తానుంటే మూడేళ్లలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసేవాడిని చెప్పారు.

ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి టీడీపీని గెలిపించాలని, ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం పని చేయాలని, కార్యకర్తలను ప్రజలను ఆదుకునే బాధ్యత టీడీపీదేనని ఆయన అన్నారు. గత 30 ఏళ్లలో కుప్పంలో జరిగిన అభివృద్ధిని రాబోయే ఐదేళ్లలో చేసి చూపిస్తానని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

This post was last modified on June 16, 2023 2:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్టీఆర్ ట్రస్ట్ కు పవన్ రూ.50 లక్షల విరాళం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... దాన గుణంలో ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటారు. రైతులు అయినా... వరద…

5 minutes ago

నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు: సింగర్ మంగ్లీ

ప్రమెుఖ సినీ గాయని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం ఓ బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. తన పాటకు…

2 hours ago

బ్యాక్ టూ డ్యూటీ… పవన్ ధర్మ పరిరక్షణ యాత్ర పూర్తి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్ర శనివారం పూర్తి అయ్యింది. మూడు…

2 hours ago

అంతా చట్టబద్ధంగానే జరుగుతుంది : నారా లోకేష్

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ…

2 hours ago

మెగా కలయిక – విశ్వంభరలో విరూపాక్ష

మావయ్యలంటే విపరీతమైన ప్రాణం, అభిమానం చూపించే సాయి ధరమ్ తేజ్ వాళ్ళ పక్కన నటించే ఛాన్స్ కోసం కెరీర్ మొదలైనప్పటి…

3 hours ago

పట్టు తప్పింది… కోట్ల నష్టం మిగిలింది

స్టార్ హీరో ఉంటే చాలు కంటెంట్ అటుఇటు ఉన్నా జనం ఎగబడి చూస్తారనే భ్రమలు ఇప్పుడు లేవు. ఏ మాత్రం…

3 hours ago