Political News

వైసీపీ నేతల తిట్లపై పవన్ ఏమన్నారంటే…

అన్నవరం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే, జగన్ తో పాటు వైసీపీ నేతలపై పవన్ చేసిన విమర్శలకు వైసీపీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వారాహి యాత్రలో భాగంగా ఈ రోజు పిఠాపురంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు, ప్రజల నుంచి పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను పవన్ స్వీకరించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తనను దూషించడంపై పవన్ స్పందించారు. వైసీపీ నేతల దూషణలను తాను ఆహ్వానిస్తున్నానని పవన్ అన్నారు. అయితే, తాను సీరియస్ రాజకీయాలు చేసేందుకు వచ్చానని, వైసీపీ నేతలు చేసే అల్పమైన విమర్శలను పట్టించుకోబోనని పవన్ అన్నారు. తాను చేతల మనిషిని అని, మాటలతో కాకుండా చేతలతోనే అభివృద్ధి చేసి చూపిస్తానని పవన్ అన్నారు.

రాబోయే కాలంలో వైసీపీ నేతల ప్రతి మాటకు మార్పుతోనే సమాధానం చెబుతానని పవన్ అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే జనవాణి కార్యక్రమాన్ని చేపట్టామని పవన్ వెల్లడించారు. ఈ రోజు జనవాణి కార్యక్రమం సందర్భంగా ప్రజలు చెప్పిన సమస్యలపై దృష్టి సారిస్తామని అన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలని, లేకపోతే అరాచక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతూనే ఉంటాయని పవన్ అన్నారు.

జనవాణి కార్యక్రమంతో భవిష్యత్తులో ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మార్పు కోసమే వారాహి యాత్ర చేపట్టానని పవన్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా జనసేనను స్థాపించానని, కులాలు, ప్రాంతాలవారీగా విడిపోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం సమిష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన వారాహి విజయ యాత్రకు ప్రజల ఆశీస్సులు, మద్దతు కావాలని కోెరారు. రాబోయే ఎన్నికల్లో జనసేనను గెలిపించేందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు పవన్ విజ్ఞప్తి చేశారు.

Satya

Recent Posts

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

41 minutes ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

58 minutes ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

3 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

3 hours ago

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

6 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

9 hours ago