అన్నవరం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే, జగన్ తో పాటు వైసీపీ నేతలపై పవన్ చేసిన విమర్శలకు వైసీపీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వారాహి యాత్రలో భాగంగా ఈ రోజు పిఠాపురంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు, ప్రజల నుంచి పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను పవన్ స్వీకరించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తనను దూషించడంపై పవన్ స్పందించారు. వైసీపీ నేతల దూషణలను తాను ఆహ్వానిస్తున్నానని పవన్ అన్నారు. అయితే, తాను సీరియస్ రాజకీయాలు చేసేందుకు వచ్చానని, వైసీపీ నేతలు చేసే అల్పమైన విమర్శలను పట్టించుకోబోనని పవన్ అన్నారు. తాను చేతల మనిషిని అని, మాటలతో కాకుండా చేతలతోనే అభివృద్ధి చేసి చూపిస్తానని పవన్ అన్నారు.
రాబోయే కాలంలో వైసీపీ నేతల ప్రతి మాటకు మార్పుతోనే సమాధానం చెబుతానని పవన్ అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే జనవాణి కార్యక్రమాన్ని చేపట్టామని పవన్ వెల్లడించారు. ఈ రోజు జనవాణి కార్యక్రమం సందర్భంగా ప్రజలు చెప్పిన సమస్యలపై దృష్టి సారిస్తామని అన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలని, లేకపోతే అరాచక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతూనే ఉంటాయని పవన్ అన్నారు.
జనవాణి కార్యక్రమంతో భవిష్యత్తులో ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మార్పు కోసమే వారాహి యాత్ర చేపట్టానని పవన్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా జనసేనను స్థాపించానని, కులాలు, ప్రాంతాలవారీగా విడిపోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం సమిష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన వారాహి విజయ యాత్రకు ప్రజల ఆశీస్సులు, మద్దతు కావాలని కోెరారు. రాబోయే ఎన్నికల్లో జనసేనను గెలిపించేందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు పవన్ విజ్ఞప్తి చేశారు.
This post was last modified on June 16, 2023 8:49 am
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…