అన్నవరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికలలో గెలిచి తప్పకుండా అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ కు పవన్ సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. పవన్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు ఒక చెప్పు చూపించిన పవన్ కు మీడియా సమావేశంలో పేర్ని నాని రెండు చెప్పులు చూపించారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని వ్యాఖ్యలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.
పేర్ని నాని వ్యాఖ్యలు బాధ కలిగించాయని, పవన్ పై వైసీపీ నేతలు దుర్భాషలాడడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు ఎక్కువ అవకాశాలున్నాయని, టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసేందుకు ఛాన్స్ ఉందని రఘురామ జోస్యం చెప్పారు. ఈ మూడు పార్టీల కలయిక వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని రఘురామ అన్నారు.
మరోవైపు, కుప్పంలో సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అధికారులు అనుమతినివ్వడంలేదని రఘురామ ఆరోపించారు. అయితే, ఈ విషయం జగన్ కు తెలిసి జరుగుతుందా లేదా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. జగనన్నకు చెబుదాం పథకం విఫలమైందని, అందుకే జగనన్న సురక్ష అనే కొత్త టైటిల్ విడుదల చేశారని రఘురామ సెటైర్లు వేశారు. అసలు ఈ పథకం ఉద్దేశం ఏమిటో ఎందుకు పెట్టారో ఎవరికైనా తెలుసా అని వైసీపీ నేతలకు చురకలంటించారు. మరి, రఘురామ వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on June 16, 2023 8:49 am
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…