Movie News

పవన్ ను తిట్టిన పేర్ని నానికి రఘురామ పంచ్

అన్నవరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికలలో గెలిచి తప్పకుండా అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ కు పవన్ సవాల్ విసిరారు.

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. పవన్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు ఒక చెప్పు చూపించిన పవన్ కు మీడియా సమావేశంలో పేర్ని నాని రెండు చెప్పులు చూపించారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని వ్యాఖ్యలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.

పేర్ని నాని వ్యాఖ్యలు బాధ కలిగించాయని, పవన్ పై వైసీపీ నేతలు దుర్భాషలాడడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు ఎక్కువ అవకాశాలున్నాయని, టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసేందుకు ఛాన్స్ ఉందని రఘురామ జోస్యం చెప్పారు. ఈ మూడు పార్టీల కలయిక వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని రఘురామ అన్నారు.

మరోవైపు, కుప్పంలో సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అధికారులు అనుమతినివ్వడంలేదని రఘురామ ఆరోపించారు. అయితే, ఈ విషయం జగన్ కు తెలిసి జరుగుతుందా లేదా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. జగనన్నకు చెబుదాం పథకం విఫలమైందని, అందుకే జగనన్న సురక్ష అనే కొత్త టైటిల్ విడుదల చేశారని రఘురామ సెటైర్లు వేశారు. అసలు ఈ పథకం ఉద్దేశం ఏమిటో ఎందుకు పెట్టారో ఎవరికైనా తెలుసా అని వైసీపీ నేతలకు చురకలంటించారు. మరి, రఘురామ వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Satya

Recent Posts

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

3 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

5 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

6 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

6 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

6 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

6 hours ago