జనసేన అధినేత పవన్ కల్యాణ్ మైకు పట్టుకొని మాట్లాడినంతనే విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే వైసీపీ నేతల్లో మొదటి రియాక్షన్ వచ్చేసింది. వైసీపీ మాజీ మంత్రి.. సీనియర్ నేత పేర్ని నాని షాకింగ్ రియాక్షన్ ఇచ్చేశారు. కత్తిపూడిలో దాదాపు గంటన్నర పాటు సాగిన ప్రసంగం నేపథ్యంలో.. పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. నారాహిగా పెట్టుకోవాల్సిన వాహనం పేరును వారాహిగా పవన్ పెట్టుకున్నారన్న ఆయన.. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు.
పవన్ పూటకు ఒక మాట మాట్లాడుతున్నారన్న పేర్ని నాని.. రోజుకో డైలాగ్ చెప్పి పవన్ వ్యూహం అంటారంటూఎద్దేవా చేశారు. చంద్రబాబు బాగుండటం కోసం పవన్ ఏదైనా చేస్తాడని మండిపడ్డారు. గతంలో తనను వ్యక్తిగతంగా దూషిస్తూ.. ఫ్యాకేజీ స్టార్ అంటూ విమర్శిస్తున్న వారిపై విరుచుకుపడిన పవన్.. అప్పట్లో తన చెప్పు చూపించి.. చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. పవన్ ‘చెప్పు’ మాటలకుతాజాగా స్పందించిన పేర్ని నాని.. తన రెండు చెప్పులు చూపించి..
‘‘నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా. పెద్ద మొగోడివి అనుకుంటున్నావా? మక్కెలి ఇరిగిపోతాయి అంటున్నావు. చెప్పు పట్టుకుంటేనే మక్కెలి ఇరిగిపోతాయా? ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? నేను చెప్పు చూపించా.. మక్కెలి ఇరిగిపోతాయి అంటున్నా..’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
కత్తిపూడిలో వారాహి విజయయాత్ర ను పురస్కరించుకొని ప్రసంగించిన పవన్ కల్యాణ్.. వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ఫైర్ కావటం తెలిసిందే. పవన్ కల్యాణ్ గత వీడియోలను ప్లే చేసిన పేర్ని నాని.. వాటిల్లో మాట్లాడిన మాటలకు.. నిన్న చేసిన ప్రసంగానికి పోలిక చూపిస్తూ.. పవన్ మాటల్లో ఎంత తేడా ఉందో గుర్తించాలన్నారు.
పరిస్థితులకు అనుగుణంగా తన కులాన్ని మార్చేస్తారని.. తగిన ఓట్లు వచ్చే ఛాన్స్ లేకున్నా.. ముఖ్యమంత్రి అయిపోయవాలని కలలు కంటున్నారని విమర్శించారు. పేర్ని నాని షాకింగ్ రియాక్షన్ కుపవన్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on June 15, 2023 5:56 pm
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…