Political News

ప్రైవేటు సంస్థల చేతిలో తెలంగాణ భూ యజమానుల వివరాలు?

ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను పాల్గొన్న ప్రతి సమావేశంలోనూ ధరణి గురించి గొప్పలు చెబుతున్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ధరణిని బరాబర్ రద్దు చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ తీరుపై కేసీఆర్ గుస్సా అవుతున్నారు. ధరణితో తీసుకొచ్చిన మార్పులు.. చేసిన ప్రక్షాళన గురించి కేసీఆర్ గొప్పలు చెబుతుంటే… దీనివల్ల ప్రజలకు ఎంత ఇబ్బందో వివరిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది చాలారోజుల నుంచి నడుస్తున్నదే. అయితే… తాజాగా రేవంత్ రెడ్డి ధరణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ధరణి పోర్టల్ ను ‘‘ఇన్ ఫ్రాస్టక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్’’ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయాన్ని రేవంత్ వెల్లడించారు. తెలంగాణ ప్రజల భూముల వివరాల్ని ప్రైవేటు సంస్థ చేతిలో ఎలా పెడతారు? అని ప్రశ్నిస్తున్నారు. ఐఎల్ఎఫ్ సంస్థలో ఫిలిప్పీన్ కు చెందిన కంపెనీల పెట్టుబడులు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రజల భూముల వివరాల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఇదే ప్రమాదకరం ధరణి నిర్వాహణపై ఐఎల్ఎఫ్ సంస్థతో రూ.150 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థకు చెందిన 99 శాతం వాటాను టెరాలసిస్ టెక్నాలజీస్ అనే సంస్థ కొనుగోలు చేసింది. రాష్ట్రంలోని 70 లక్షల మంది భూ యజమానుల వివరాల్ని ఐఎల్ఎఫ్ సంస్థకు విక్రయించారు’’ అంటూ పేర్కొన్నారు.

రేవంత్ వ్యాఖ్యల్ని భూ యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని భూముల యజమానుల వివరాలతో కూడిన సున్నిత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు కాకుండా ప్రభుత్వమే ఎందుకు నిర్వహించటం లేదన్న సందేహం కలుగక మానదు. ధరణిపై కొత్త పాయింట్ ను తెర మీదకు తీసుకొచ్చిన రేవంత్.. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసాల్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదన్న రేవంత్.. తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి రేవంత్ కొత్త సవాలు విసిరారు. రాష్ట్రంలో ఏ గ్రామం అయినా సరే.. డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించిన గ్రామం అయినా సరే… ఆ గ్రామానికి వెళ్లి బీఆర్ఎస్ ఓట్లు అడిగే ధైర్యం చేస్తుందా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని.. మరి.. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో ఓట్లు అడగటానికి ఇంద్రకరణ్ రెడ్డి సిద్ధమా? అని సవాలు విసిరారు.

కేసీఆర్ చేతిలో మోసపోయిన వారి జాబితాలో శ్రీహరిరావు మొదట్లో ఉంటారన్నారు. నిర్మల్ జిల్లా నుంచి కాంగ్రెస్ లో చేరిన శ్రీహరి రావుకు సాదర స్వాగతం పలుకుతున్నట్లుగా పేర్కొన్న రేవంత్.. ఆయనతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి.. ఈ ఘాటు సవాలు విసిరారు. మరి.. దీనికి మంత్రి ఇంద్రకరణ్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

This post was last modified on June 15, 2023 9:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

1 hour ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

4 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

4 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

5 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

6 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

6 hours ago