Political News

ప్రైవేటు సంస్థల చేతిలో తెలంగాణ భూ యజమానుల వివరాలు?

ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను పాల్గొన్న ప్రతి సమావేశంలోనూ ధరణి గురించి గొప్పలు చెబుతున్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ధరణిని బరాబర్ రద్దు చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ తీరుపై కేసీఆర్ గుస్సా అవుతున్నారు. ధరణితో తీసుకొచ్చిన మార్పులు.. చేసిన ప్రక్షాళన గురించి కేసీఆర్ గొప్పలు చెబుతుంటే… దీనివల్ల ప్రజలకు ఎంత ఇబ్బందో వివరిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది చాలారోజుల నుంచి నడుస్తున్నదే. అయితే… తాజాగా రేవంత్ రెడ్డి ధరణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ధరణి పోర్టల్ ను ‘‘ఇన్ ఫ్రాస్టక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్’’ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయాన్ని రేవంత్ వెల్లడించారు. తెలంగాణ ప్రజల భూముల వివరాల్ని ప్రైవేటు సంస్థ చేతిలో ఎలా పెడతారు? అని ప్రశ్నిస్తున్నారు. ఐఎల్ఎఫ్ సంస్థలో ఫిలిప్పీన్ కు చెందిన కంపెనీల పెట్టుబడులు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రజల భూముల వివరాల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఇదే ప్రమాదకరం ధరణి నిర్వాహణపై ఐఎల్ఎఫ్ సంస్థతో రూ.150 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థకు చెందిన 99 శాతం వాటాను టెరాలసిస్ టెక్నాలజీస్ అనే సంస్థ కొనుగోలు చేసింది. రాష్ట్రంలోని 70 లక్షల మంది భూ యజమానుల వివరాల్ని ఐఎల్ఎఫ్ సంస్థకు విక్రయించారు’’ అంటూ పేర్కొన్నారు.

రేవంత్ వ్యాఖ్యల్ని భూ యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని భూముల యజమానుల వివరాలతో కూడిన సున్నిత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు కాకుండా ప్రభుత్వమే ఎందుకు నిర్వహించటం లేదన్న సందేహం కలుగక మానదు. ధరణిపై కొత్త పాయింట్ ను తెర మీదకు తీసుకొచ్చిన రేవంత్.. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసాల్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదన్న రేవంత్.. తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి రేవంత్ కొత్త సవాలు విసిరారు. రాష్ట్రంలో ఏ గ్రామం అయినా సరే.. డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించిన గ్రామం అయినా సరే… ఆ గ్రామానికి వెళ్లి బీఆర్ఎస్ ఓట్లు అడిగే ధైర్యం చేస్తుందా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని.. మరి.. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో ఓట్లు అడగటానికి ఇంద్రకరణ్ రెడ్డి సిద్ధమా? అని సవాలు విసిరారు.

కేసీఆర్ చేతిలో మోసపోయిన వారి జాబితాలో శ్రీహరిరావు మొదట్లో ఉంటారన్నారు. నిర్మల్ జిల్లా నుంచి కాంగ్రెస్ లో చేరిన శ్రీహరి రావుకు సాదర స్వాగతం పలుకుతున్నట్లుగా పేర్కొన్న రేవంత్.. ఆయనతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి.. ఈ ఘాటు సవాలు విసిరారు. మరి.. దీనికి మంత్రి ఇంద్రకరణ్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

This post was last modified on June 15, 2023 9:20 am

Share

Recent Posts

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

4 minutes ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

1 hour ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

2 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

2 hours ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

2 hours ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

3 hours ago