Political News

వైసీపీ కార్యకర్తలు చితికిపోయారన్న ధర్మాన

సీఎం జగన్ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కేవలం రబ్బర్ స్టాంపులని, నేరుగా జగన్ తో మాట్లాడే అవకాశం వారికి చాలా అరుదుగా లభిస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకు జగన్ తో భేటీ అయిన ఎమ్మెల్యేల సంఖ్య వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు.

ఓ రకంగా చెప్పాలంటే సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పుతున్నారని, ఆయనను దాటి జగన్ దగ్గరికి వెళ్లి తమ అభిప్రాయాలను, తమ నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవడం ఎమ్మెల్యేలకు తలకు మించిన పని అని విమర్శలు వచ్చాయి. కానీ, ఇటువంటి సందర్భంలో కూడా కొందరు వైసీపీ నేతలు ధైర్యం చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటి నేతలు అడపాదడపా ప్రభుత్వంపై నేరుగానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వంపై చేసిన విమర్శలు పార్టీని ఇరకాటంలో కూడా పడేశాయి. అయినా సరే తాజాగా మరోసారి తమ ప్రభుత్వం పై ధర్మాన ప్రసాదరావు సంచలన విమర్శలు చేశారు.

గత నాలుగేళ్ల కాలంలో వైసీపీ కార్యకర్తలు ఆర్థికంగా బాగా చితికిపోయారని ధర్మాన అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల కోసం స్థానిక నేతలు, కార్యకర్తలు ఎంతో ఖర్చు చేశారని, వారికి పైసా కూడా లబ్ధి జరగలేదని ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడి నుంచో వస్తున్న డబ్బుతో మీటింగ్ లు నిర్వహించడం లేదని, అందువల్ల కార్యకర్తల చేతి చమురు వదులుతోందని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ప్రజలకు మంచి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పని చేస్తుందని, అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులకే నేరుగా అన్ని పథకాలు చేరుతున్నాయని ధర్మాన అన్నారు. తాజాగా మరోసారి ప్రభుత్వంపై ధర్మాన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశయ్యాయి.

This post was last modified on June 15, 2023 8:46 am

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

3 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

6 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

8 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

9 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

9 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

10 hours ago