రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని ఆశిస్తున్న కార్పొరేటర్లకు మంత్రి కేటీయార్ సీరియస్ వార్నిగ్ ఇచ్చారు. కార్పొరేటర్లు ఎవరు కూడా ఎంఎల్ఏ టికెట్లకోసం ప్రయత్నాలు చేయద్దని, ఉన్నవాళ్ళని ఇబ్బందులు పెట్టవద్దని గట్టిగా హెచ్చరించారు. ఈనెల 16వ తేదీనుండి వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపధ్యంలో వచ్చేఎన్నికల్లో టికెట్ల విషయమై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
గ్రేటర్ లో బీఆర్ఎస్ కు 56 మంది కార్పొరేటర్లున్నారు. వీరిలో కనీసం 10 మంది ఎంఎల్ఏ టికెట్లు ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏలపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేసీయార్ చేయిస్తున్న సర్వేల్లో నెగిటివ్ వస్తున్నదని కొందరిపై బాగా ప్రచారం జరుగుతోంది. అలాంటి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంగా కేసీయార్ వేరే నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. ఎలాగూ ప్రత్యామ్నాయాలు చూస్తున్నారు కాబట్టి పోటీకి సిద్ధంగా ఉన్న కొందరు కార్పొరేటర్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
కార్పొరేటర్ల ప్రయత్నాలతో సిట్టింగ్ ఎంఎల్ఏలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇదే విషయమై కేటీయార్ స్పష్టతిచ్చారు. అనవసరంగా సిట్టింగ్ ఎంఎల్ఏల్లో టెన్షన్ పెంచేసి ఇబ్బందులు పెట్టవద్దన్నారు. టికెట్ల వ్యవహారం పార్టీ అధినేత కేసీయార్ చూసుకుంటున్నపుడు మధ్యలో కార్పొరేటర్లు ఎందుకు గోలచేస్తున్నారంటు క్లాసుపీకారు. సిట్టింగుల్లో ఎవరికి టికెట్లివ్వాలి ? ఎవరికి ఇవ్వద్దు ? ప్రత్యామ్నాయంగా ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయాలను కేసీయార్ చూసుకుంటున్నారు కాబట్టి పార్టీలో అనవసరంగా కంపుచేయద్దని కేటీయార్ వార్నింగ్ ఇచ్చారు.
కేటీయార్ తాజా వార్నింగ్ తో చాలామంది కార్పొరేటర్లలో నిరుత్సాహం మొదలైంది. బాగా డబ్బున్న కార్పొరేటర్లు ఎంఎల్ఏగా పోటీచేయటానికి రెడీ అయిపోయారు. తమ డివిజన్లలో ఏ కార్యక్రమం జరిగినా జనాల్లో దృష్టిలో పడేందుకు దాన్ని పెద్దగా ఫోకస్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో కార్పొరేటర్లందరు పార్టీకి పనిచేయాల్సిందే అని, కేసీయార్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపుకు కష్టపడాలని స్పష్టంగా చెప్పేశారు. పార్టీ లైన్ దాటిన వారిపైన యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on June 14, 2023 12:06 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…