బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు కేంద్ర మంత్రి అమిత్ షా క్లాస్ ఇచ్చారా? అంటే.. ఔననే అంటున్నారు బీజేపీ నాయకులు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగు స్థానాన్ని కోల్పోవడం.. కన్నా లక్ష్మీనారాయణ సహా.. కేడర్ పార్టీకి దూరంగా ఉండడం.. పార్టీ మారిపోవడం సహా.. అనేక లోతుపాతుల గురించి.. అమిత్ షా కూలంకషంగా చర్చించారని తెలిసింది. నిజానికి అమిత్షా విశాఖ పర్యటనకు ముందు…తమిళనాడులో సుడిగాలి పర్యటన చేశారు.
ఈ క్రమంలో తమిళనాడుకు చేరుకున్న కొందరు బీజేపీ ఏపీ నేతలు.. ఆయనతో కలసి విమానంలో విశాఖకు వచ్చారు. ఈ సమయంలో ఏపీలో ఉన్న పరిస్థితి, పార్టీ నేతల దూకుడు. వచ్చే ఎన్నికలు పార్టీ సభ్యత్వం.. గత ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇలా.. అన్ని అంశాలను షా తెలుసుకున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.ఈ క్రమంలో గత ఆరు మాసాల్లో జరిగిన పరిణామాలను షా సీరియస్గా తీసుకున్నారని అంటున్నారు.
వాస్తవానికి బీజేపీ పుంజుకోవాలని భావిస్తోందని.. ఈ సమయంలో కొత్తగా మరికొన్ని స్థానాల్లో విజయం దక్కించుకునే దిశగా రాష్ట్ర నాయకులు అడుగులు వేయడం మానేసి.. ఉన్న ఒక్క ఎమ్మెల్సీ సీటును ఎందుకు కోల్పోయారని కూడా ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. ఇదే సమయంలో కన్నా సహా.. ఇంకెంత మంది పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని ఆరా తీసినట్టు తెలిసింది. కన్నా పార్టీ మారిపోయి వెళ్లి పోవడం వెనుక రీజన్లు తెలుసుకుని.. సోము వీర్రాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
బహుశా .. అందుకేనేమో… సభలో సోము వీర్రాజు మొహంలో ఎక్కడా సంతోషం కనిపించలేదు. ఆయన చాలా ముభావంగా ఉన్నారు. ఇక, వచ్చే ఎన్నికల పొత్తుల విషయాన్ని తాము చూసుకుంటామని… ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటం చేయడంలో అవసరమైతే.. అన్ని పార్టీలను కూడా కలుపుకొని పోవాలని సూచించారట. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. సోము నాయకత్వం పై అమిత్షాకు క్లారిటీ వచ్చిందని అంటున్నారు.
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…