Political News

ఏపీలో బీజేపీ టార్గెట్ ఆ 5 లోక్‌స‌భ సీట్లేనా…!

తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా.. రాష్ట్రంలోని పార్ల‌మెంటు స్థానాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారా? ఇక్క‌డి పార్ల‌మెంటు స్థానాల నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేయాల‌నే అంశంపై ఆయ‌న చ‌ర్చించారా? ఈ క్ర‌మంలో కొంద‌రి ప్రొఫైళ్ల‌ను కూడా ఆయ‌న సేక‌రించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు అత్యంత విశ్వ‌స‌నీయ బీజేపీ రాష్ట్ర నేత‌ల్లో ఒక‌రిద్ద‌రు.

రాష్ట్రంలో మొత్తం 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో వ‌చ్చే ఎన్నికల్లో ఐదు స్థానాల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకునేందుకు బీజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. “ఎన్నాళ్లు ఇత‌ర పార్టీల‌ పై ఆధార‌ప‌డ‌తాం. మ‌నం ఎద‌గాలి. క‌నీసం ఐదు స్థానాల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకోవాలి” అని గ‌ట్టిగానే అమిత్ షా టార్గెట్ పెట్టార‌ని… తెలిసింది. మొత్తం 5 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని ఆయ‌న నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

వీటిలో విశాఖ‌, రాజంపేట‌, అన‌కాప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం, గుంటూరు స్థానాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ్య‌వ‌హారం కూడా. చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న పార్టీలో ఉంటే.. గుంటూరు ఎంపీ స్థానం ఇవ్వాల‌ని పార్టీ నిర్ణ‌యించుకుంద‌ని… అయితే, అనూహ్యంగా ఆయ‌న పార్టీ మారార‌ని అయినా. గ‌ట్టిగా పోరాటం చేసి గుంటూరులో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని షా సూచించిన‌ట్టు తెలిసింది.

అదే స‌మ‌యంలో విజ‌య‌న‌గ‌రంలో ఈ సారి బీజేపీ జెండా ఎగ‌రాల‌ని కూడా షా నిర్దేశించిన‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే.. త‌న‌కు విశాఖ‌తో ఎంతో అనుబంధం ఉంద‌ని.. త‌న కుటుంబంలోని వారు ఇక్క‌డ ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుకున్నార‌ని.. 2014లో ఇక్క‌డ కంభంపాటి విజ‌యంద‌క్కించుకున్నార‌ని… మ‌రి ఇప్పుడు ఇక్క‌డ ఎందుకు పార్టీ దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతోంద‌ని ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించార‌ట‌.

This post was last modified on June 14, 2023 7:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago