Political News

ఏపీలో బీజేపీ టార్గెట్ ఆ 5 లోక్‌స‌భ సీట్లేనా…!

తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా.. రాష్ట్రంలోని పార్ల‌మెంటు స్థానాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారా? ఇక్క‌డి పార్ల‌మెంటు స్థానాల నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేయాల‌నే అంశంపై ఆయ‌న చ‌ర్చించారా? ఈ క్ర‌మంలో కొంద‌రి ప్రొఫైళ్ల‌ను కూడా ఆయ‌న సేక‌రించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు అత్యంత విశ్వ‌స‌నీయ బీజేపీ రాష్ట్ర నేత‌ల్లో ఒక‌రిద్ద‌రు.

రాష్ట్రంలో మొత్తం 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో వ‌చ్చే ఎన్నికల్లో ఐదు స్థానాల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకునేందుకు బీజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. “ఎన్నాళ్లు ఇత‌ర పార్టీల‌ పై ఆధార‌ప‌డ‌తాం. మ‌నం ఎద‌గాలి. క‌నీసం ఐదు స్థానాల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకోవాలి” అని గ‌ట్టిగానే అమిత్ షా టార్గెట్ పెట్టార‌ని… తెలిసింది. మొత్తం 5 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని ఆయ‌న నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

వీటిలో విశాఖ‌, రాజంపేట‌, అన‌కాప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం, గుంటూరు స్థానాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ్య‌వ‌హారం కూడా. చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న పార్టీలో ఉంటే.. గుంటూరు ఎంపీ స్థానం ఇవ్వాల‌ని పార్టీ నిర్ణ‌యించుకుంద‌ని… అయితే, అనూహ్యంగా ఆయ‌న పార్టీ మారార‌ని అయినా. గ‌ట్టిగా పోరాటం చేసి గుంటూరులో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని షా సూచించిన‌ట్టు తెలిసింది.

అదే స‌మ‌యంలో విజ‌య‌న‌గ‌రంలో ఈ సారి బీజేపీ జెండా ఎగ‌రాల‌ని కూడా షా నిర్దేశించిన‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే.. త‌న‌కు విశాఖ‌తో ఎంతో అనుబంధం ఉంద‌ని.. త‌న కుటుంబంలోని వారు ఇక్క‌డ ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుకున్నార‌ని.. 2014లో ఇక్క‌డ కంభంపాటి విజ‌యంద‌క్కించుకున్నార‌ని… మ‌రి ఇప్పుడు ఇక్క‌డ ఎందుకు పార్టీ దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతోంద‌ని ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించార‌ట‌.

This post was last modified on June 14, 2023 7:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఉత్తరాది’పై ‘దక్షిణాది’దే విజయం!

డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం…

12 minutes ago

హార్ముజ్ ఓపెన్‌: ఊపిరి పీల్చుకున్న ప్ర‌పంచం!

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు.. త‌మ‌పై చేస్తున్న యుద్ధం నేప‌థ్యంలో కీల‌క‌మైన హోర్ముజ్ జల‌సంధిని ఇరాన్ మూసివేసిన విష‌యం తెలిసిందే. ఈ…

51 minutes ago

వీగిపోయిన బిల్లులు… ఓట్లు ఇంత తక్కువా?

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం…

1 hour ago

మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు ఉంటాయా?

మ‌త‌ప‌రంగా రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించేది లేద‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్ల‌మెంటులో తెగేసి చెప్పారు. మ‌హిళా బిల్లు…

1 hour ago

సంబరాలకు ఇంకెంత సమయం కావాలి

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఫిలిం…

1 hour ago

టొవినో థామస్ ఇప్పుడెలా స్పందిస్తాడో

మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…

3 hours ago