Political News

మళ్లీ వైసీపీలోకి చలమలశెట్టి.. ఈ సారైనా పని జరిగేనా?

చలమలశెట్టి సునీల్… విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తగా తెలుగు ప్రజలకు సుపరిచితులే. వ్యాపారంలో రారాజుగా ఎదిగినా… రాజకీయాల్లో మాత్రం ఆయన సక్సెస్ కాలేకపోతున్నారు. ఎంపీ కావాలన్న తన చిరకాల వాంఛ 15 ఏళ్లకుపైగానే వాయిదా పడుతూనే వస్తోంది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడికి మల్లే చలమలశెట్టి మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పార్టీ ఏదన్న విషయాన్ని పక్కనపెట్టేసిన చలమలశెట్టి… ఎంపీ కావాలన్న తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటికే చాలా అడుగులు వేశారు. కానీ ఎక్కడా ఆయన టార్గెట్ ను అందుకున్న దాఖలా కనిపించలేదు. అయితే ఎంపీ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు ఇప్పుడు ఏకంగా తన ప్లాన్ ను మార్చేసుకుని టార్గెట్ రీచ్ అయ్యేందుకు పకడ్బందీగానే ముందుకు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ వైసీపీలోకి చేరిపోతున్నారు.

పారిశ్రామిక రంగంలో ఇప్పటికే సక్సెస్ ఫుల్ బిజినెస్ మన్ గా తనను తాను మలచుకున్న చలమలశెట్టి… ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టాలన్న బలమైన కోరికతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ప్రజారాజ్యం పెట్టగానే… తన కలను సాకారం చేసుకునేందుకు చలమలశెట్టి ప్రజారాజ్యంలో చేరిపోయారు. ప్రజారాజ్యం పార్టీ టికెట్ పై 2009లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగారు. అయితే నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు చేతిలో పరాజయం పాలైన ఆయన.. 2014 వచ్చేసరికి కొత్తగా పార్టీగా ఎంట్రీ ఇచ్చిన వైసీపీలోకి జంప్ కొట్టేశారు. 2014లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన చలమలశెట్టి… టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. ఇక 2019 వచ్చేనాటికి టీడీపీలో చేరిన చలమలశెట్టి… వైసీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో పరాజయం పాలయ్యారు. మొత్తంగా మూడు సార్లు మూడు పార్టీల తరఫున పోటీ చేసిన చలమలశెట్టి ఏ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు.

ఈ నేపథ్యంలో ఇక ప్రత్యక్ష ఎన్నికలు తనకు సరిపోవని ఓ నిర్ధారణకు వచ్చిన చలమలశెట్టి… పరోక్ష ఎన్నిక ద్వారా అయినా పార్లమెంటులో అడుగుపెట్టాల్సిందేనన్న ఓ నిర్ణయానికి వచ్చేసినట్లుగానే కనిపిస్తోంది. ఇందులో బాగంగానే ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరిపోతున్నారు. వైసీపీ తరఫున త్వరలో రాజ్యసభ సభ్వత్వాన్ని పొందేలా ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీలో చేరేందుకు చలమలశెట్టి సిద్ధం కాగా… అందుకు వైసీపీ అధిష్ఠానం కూడా ఓకే చెప్పేసిందట. అయితే ఈ చేరికకు చలమలశెట్టి ఎంచుకున్న రూట్ పై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తన కంపెనీ గ్రీన్ కో తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 కోట్లను విరాళంగా ప్రకటించిన చలమలశెట్టి.. దానిని తన సోదరుడి చేత సీఎం జగన్ కు అందించి… తన మనసులోని మాటను బయటపెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా… తన టార్గెట్ ను చేరుకోవడమే లక్ష్యంగా కదులుతున్న చలమలశెట్టి.. ఈ సారైనా ఎంపీ సీటును దక్కించుకుంటారో, లేదో చూడాల్సిందే.

This post was last modified on August 11, 2020 1:49 am

Share
Show comments
Published by
suman

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

6 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

7 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

10 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

10 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

11 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

11 hours ago