Political News

జగన్ ప్రకటనలో లాజిక్కుందా ?

పల్నాడులో జరిగిన ఓ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తనకు బీజేపీ మద్దతు కూడా ఉండదన్నారు. నిజానికి బీజేపీ-వైసీపీ మిత్రపక్షాలేమీ కాదన్న విషయం అందరికీ తెలుసు. అయితే కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య మంచి సఖ్యత లేదా అవగాహన ఉందన్నది వాస్తవం. మొదట్లో జగన్ విజ్ఞప్తులను కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోయినా కొంతకాలంగా బాగానే మద్దతిస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే కేంద్రప్రభుత్వం ఏపీకి సుమారు రు. 24 వేల కోట్లు విడుదల చేయటం అంటే మామూలు విషయంకాదు.

ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న రెవిన్యులోటు రు. 10 వేల కోట్లు, పోలవరం పెండింగ్ బకాయిలు సుమారు రు. 13 వేల కోట్లను కేంద్రం విడుదల చేసింది. తాజాగా జీఎస్టీ వసూళ్ళల్లో ఏపీ షేర్ కింద రు. 4500 కోట్లను విడుదలచేసింది. ఒకవైపు కేంద్రం నుండి ఇంతస్ధాయిలో మద్దతు అందుకుంటు మళ్ళీ బీజేపీ మద్దతు కూడా తనకుండదని జగన్ చెప్పటంలో లాజిక్ కనబడటంలేదు. పార్టీలపరంగా రెండు వేర్వేరు కావచ్చుకానీ ప్రభుత్వాల పరంగా బాగానే సఖ్యతతోనే ఉంటున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ వేరు కేంద్రప్రభుత్వం వేరుకాదు. జగన్మోహన్ రెడ్డి వేరు వైసీపీ వేరని, చంద్రబాబునాయుడు వేరు తెలుగుదేశంపార్టీ వేరంటే జనాలు అంగీకరిస్తారా ? అలాగే బీజేపీ అన్నా నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం వేర్వేరు కాదని అందరికీ తెలుసు. సడెన్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు తమ బహిరంగసభల్లో జగన్ను టార్గెట్ చేసుకున్నారు.

ఇదే సమయంలో జగన్ మాత్రం బీజేపీని టార్గెట్ చేశారు. అదికూడా తనకు రాబోయే ఎన్నికల్లో బీజేపీ సపోర్టుందని అన్నారంతే. అంటే జగన్ ఉద్దేశ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుపెట్టుకుంటుందని కావచ్చు. అయితే ఆ విషయాన్ని డైరెక్టుగా కాకుండా ఇన్ డైరెక్టుగా ప్రస్తావించారు. చూస్తుంటే ముందుముందు జరగబోయే సభల్లో బీజేపీని జగన్ డైరెక్టుగానే ఎటాక్ చేస్తారనే అనిపిస్తోంది. అటు బీజేపీ వైపునుండి ఇటు వైసీపీ నుండి ఎటాకులు పెరిగిపోతే జనాలు ఆ వేడికి తట్టుకోలేరేమో.

This post was last modified on June 13, 2023 10:14 am

Share
Show comments
Published by
satya

Recent Posts

కూటమిలో వైసీపీకి మింగుపడని రీతిలో కో ఆర్డినేషన్

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ…

2 mins ago

రామాయణంపై అప్పుడే వివాదాలు షురూ

గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన…

7 mins ago

తండేల్ కోసం రెండు క్లయిమాక్సులు ?

లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సాయిపల్లవి కలిసి నటిస్తున్న తండేల్ ఈ ఏడాది డిసెంబర్ 20 విడుదల కాబోతున్న…

1 hour ago

ఆ మూడూ గెలవకుంటే .. మూడు ముక్కలాటే !

మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ…

2 hours ago

ప్రభాస్ పాత్రపై కన్నప్ప క్లారిటీ

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…

3 hours ago

20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి-జగన్

ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐతే 2019 ఎన్నికల ముంగిట ఇచ్చిన…

3 hours ago