Political News

మార్గదర్శి కేసు ముగియలేదు… రామోజీకి సుప్రీం నోటీసులు

మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. రామోజీతో పాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకు, మాజీ ఐజీ కృష్ణంరాజులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వెరసి గతంలో రామోజీని నానా ఇబ్బందులు పెట్టిన ఈ కేసు అప్పుడే ముగియలేదన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.

మార్గదర్శి పైనాన్షియర్స్ కేసును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ వేశారు. ఉండవల్లి పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తాజాగా ఈ నోటీసులు జారీ చేసింది. ఇక రిజర్వు బ్యాంక్, మాజీ ఐజీ కృష్ణంరాజులను కూడా ఈ కేసులో ఇంప్లీడ్ చేయాలన్న ఉండవల్లి విజ్ఝప్తికి కూడా సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ చేపట్టనునున్నట్లు ధర్మాసనం తెలిపింది.

కాగా, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చట్టం నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయలను సుమారు రెండున్నర లక్షల మంది నుంచి రామోజీరావు డిపాజిట్ల రూపంలో సేకరించారని మాజీ ఐజీ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కాగా, ఉమ్మడి హిందూ కుటుంబం(హెచ్‌యూఎఫ్) ద్వారా డిపాజిట్లు సేకరించడం చట్టరీత్యా నేరం కాదని ఉమ్మడి హైకోర్టు ముందు రామోజీరావు వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసును కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన ఉండవల్లి… మరోమారు ఈ కేసును తెర మీదకు తీసుకొచ్చారు. మరి ఈ కేసు విచారణ ఎలా సాగనుంది?, ఉండవల్లి ఆరోపిస్తున్నట్లుగా రామోజీ అక్రమాలకు పాల్పడ్డారన్న విషయంపై కోర్టు ఏమంటుంది? అన్న విషయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.

suman

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

8 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago