జీయర్ సంస్థల నిర్వాహకులు.. ప్రఖ్యాత ఆధ్యాత్మిక వాది చిన్న జీయర్ స్వామి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిసిం ది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అప్పాయింట్మెంట్ తీసుకున్నారని.. మంగళ , బుధవారాల్లో జీయర్ స్వామి.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్షాలతోనూ భేటీ కానున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. దీనికి సంబందించిన విమాన టికెట్లను కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది.
వాస్తవానికి ఇప్పటి వరకు కూడా.. జీయర్ స్వామి చెంతకు ప్రధాని వచ్చారే తప్ప.. ఒకే ఒక్కసారి సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యమాని ఆహ్వానిస్తూ.. మాత్రమే చిన జీయర్ ప్రధాని, రాష్ట్రపతి వంటివారిని కలుసుకున్నారు. తర్వాత. ఇప్పటి వరకు ఆయన ఢిల్లీ ఛాయలకు పోలేదు. కానీ, ఇప్పుడు ఆకస్మికంగా.. ఆయన ఢిల్లీ యాత్ర చేపట్టారు. అది కూడా ప్రధాని వంటి అగ్రనేతతో భేటీ కానుండడం అత్యంత ప్రాధా న్యం సంతరించుకుంది.
దీనికి ప్రధాన కారణం.. తన మేనల్లుడు.. జీయర్ ఆశ్రమ వ్యవహారాలు చూస్తన్న విష్ణు స్వామిపై ఇటీవల బాంబు లాంటి వార్త బయటకు వచ్చింది. ఆయన ఉదయం స్వామీజీగా.. సాయంత్రం కౌబాయ్లా వ్యవహరి స్తున్నారని.. అమ్మాయిలను వెంటేసుకుని తిరుగుతున్నారని వార్తలు వచ్చాయి. ఇవేవీ సాధారణ విషయాలు కావు. అత్యంత ప్రతిష్టాత్మకమైన జీయర్ సంస్థలకు అంతర్జాతీయంగా ఉన్న పేరుపై మచ్చ తెచ్చేవే.
ఈ క్రమంలో జీయర్ స్వామి.. ఇవన్నీ.. తనపై ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్ర గా భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చిన సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయం వెనుక ఉన్నదని.. ఉద్దేశ పూర్వకంగానే.. తమ సంస్థలను బద్నాం చేసే ప్రయ త్నం చేస్తోందని జీయర్ స్వామి భావిస్తున్నట్టు ఆశ్రమ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా ఈ విషయంపై ప్రధానికే ఫిర్యాదు చేయాలని స్వామి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 11, 2023 4:56 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…