జీయర్ సంస్థల నిర్వాహకులు.. ప్రఖ్యాత ఆధ్యాత్మిక వాది చిన్న జీయర్ స్వామి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిసిం ది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అప్పాయింట్మెంట్ తీసుకున్నారని.. మంగళ , బుధవారాల్లో జీయర్ స్వామి.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్షాలతోనూ భేటీ కానున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. దీనికి సంబందించిన విమాన టికెట్లను కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది.
వాస్తవానికి ఇప్పటి వరకు కూడా.. జీయర్ స్వామి చెంతకు ప్రధాని వచ్చారే తప్ప.. ఒకే ఒక్కసారి సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యమాని ఆహ్వానిస్తూ.. మాత్రమే చిన జీయర్ ప్రధాని, రాష్ట్రపతి వంటివారిని కలుసుకున్నారు. తర్వాత. ఇప్పటి వరకు ఆయన ఢిల్లీ ఛాయలకు పోలేదు. కానీ, ఇప్పుడు ఆకస్మికంగా.. ఆయన ఢిల్లీ యాత్ర చేపట్టారు. అది కూడా ప్రధాని వంటి అగ్రనేతతో భేటీ కానుండడం అత్యంత ప్రాధా న్యం సంతరించుకుంది.
దీనికి ప్రధాన కారణం.. తన మేనల్లుడు.. జీయర్ ఆశ్రమ వ్యవహారాలు చూస్తన్న విష్ణు స్వామిపై ఇటీవల బాంబు లాంటి వార్త బయటకు వచ్చింది. ఆయన ఉదయం స్వామీజీగా.. సాయంత్రం కౌబాయ్లా వ్యవహరి స్తున్నారని.. అమ్మాయిలను వెంటేసుకుని తిరుగుతున్నారని వార్తలు వచ్చాయి. ఇవేవీ సాధారణ విషయాలు కావు. అత్యంత ప్రతిష్టాత్మకమైన జీయర్ సంస్థలకు అంతర్జాతీయంగా ఉన్న పేరుపై మచ్చ తెచ్చేవే.
ఈ క్రమంలో జీయర్ స్వామి.. ఇవన్నీ.. తనపై ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్ర గా భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చిన సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయం వెనుక ఉన్నదని.. ఉద్దేశ పూర్వకంగానే.. తమ సంస్థలను బద్నాం చేసే ప్రయ త్నం చేస్తోందని జీయర్ స్వామి భావిస్తున్నట్టు ఆశ్రమ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా ఈ విషయంపై ప్రధానికే ఫిర్యాదు చేయాలని స్వామి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 11, 2023 4:56 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…