నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి ఈ నెలలోనే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన ఆయన దాదాపు గంట పాటు చర్చించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే అభియోగంపై ఆనంను వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
చంద్రబాబుతో భేటీ అనంతరం నెల్లూరుకు చేరుకున్న ఆనం ఆ వెంటనే టీడీపీ స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, జిల్లాలోని టీడీపీ సీనియర్ నేతలు, హాజరయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఈ క్రమంలోనే ఆనం టీడీపీలో అధికారికంగా చేరికపైనా చర్చించారు. నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరులో మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ పాదయాత్ర సయమంలోనే ఆనం టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయడంతోపాటు.. పాదయాత్ర నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేశారు. పార్టీని బలోపేతం చేసి, జిల్లాలో పాదయాత్ర పూర్తికాగానే టీడీపీ సభ్యత్వం తీసుకునేందుకు రెడీ అయ్యారు. నేతలంతా ఆనంతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లడం కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఆనంతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో భాగంగా వెంకటగిరి, నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని తన అనుచరులను ఆనం టీడీపీలో చేర్చేందుకు రెడీ కావడం గమనార్హం. ఇదిలావుంటే, నెల్లూరులో వడివడిగా మారుతున్న వైసీపీ పరిణామాలు.. సీఎం జగన్కు సెగ పెట్టడం ఖాయమనే విశ్లేషణలు వస్తున్నాయి.
This post was last modified on June 11, 2023 12:09 pm
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…