Political News

వైసీపీ ప్ర‌భుత్వం నడ్డి మీద కొట్టిన న‌డ్డా

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంపై బీజేపీ జాతీయ సార‌థి జ‌గ‌త్ ప్ర‌కాష్ న‌డ్డా చెల‌రేగిపోయారు. సీఎం జ‌గ‌న్ పేరును మ‌చ్చుకైనా పేర్కొన‌కుండానే ఆయ‌న వైసీపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్‌ స్కామ్‌, లిక్కర్‌ స్కామ్‌ జరుగుతోందని మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని న‌డ్డా అన్నారు. తిరుప‌తి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర నాయ‌కత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచిందని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని న‌డ్డా దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందన్నారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడం పోవడం వల్లే పనులన్నీ నిలిచిపోయా యని నడ్డా విమర్శించారు. ‘‘ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం. రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా వెనుకబడింది. మాకు అవకాశం ఇస్తే రాయలసీమను ప్రగతి పథంవైపు మళ్లిస్తాం’’ అని నడ్డా హామీలు గుప్పించారు.

మోడీ ఓటు బ్యాంకు రాజ‌కీయం చేయ‌రు!

ప్రధాని మోడీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని జేపీ నడ్డా అన్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ను బాధ్యతాయుత పాలిటిక్స్‌ వైపు మళ్లించారని తెలిపారు. ‘‘పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోంది. మోడీ ప్రధాని అయ్యేనాటికి విద్యుత్‌ లేని గ్రామాలు 19 వేలు ఉండేవి. ఇవాళ దేశంలో విద్యుత్‌ సౌకర్యం లేని గ్రామమే కనిపించదు. గతంలో 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్‌ కేబుల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండేది. ఇప్పుడు 2 లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది’’ అని జేపీ నడ్డా తెలిపారు.

రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ అభివృద్ధి కనిపించడం లేదని న‌డ్డా అన్నారు. ఏపీకి ప్రధాని మోడీ ఏం చేస్తున్నారో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కేంద్రం ఇచ్చే ఇళ్లకు వైసీపీ జెండా రంగులు వేసుకుంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం 40 లక్షల ఇళ్లు ఇస్తే.. 20 లక్షలు కూడా నిర్మించలేదు. ప్రజల కోసం నిర్మించే రైల్వే లైన్ల కోసం పావలా వంతు నిధుల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. గ్రామీణ సడక్‌ యోజన కింద కేంద్రం రోడ్లు వేయిస్తుంటే ప్ర‌భుత్వం ఆ విషయం కూడా చెప్పడం లేదు.’’ అని న‌డ్డా తీవ్ర‌స్థాయిలో విమర్శించారు.

This post was last modified on June 11, 2023 11:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

53 minutes ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

1 hour ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

1 hour ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

2 hours ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

3 hours ago

ప్రేమ పెళ్ళి.. తల్లిదండ్రులకు సమాచారం తప్పనిసరి

వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…

3 hours ago