తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలపై బీజేపీ నాయకులు.. జిల్లాల్లో ఒక ప్రచారం చేస్తున్నా రు. వీటిని కేంద్రప్రభుత్వమే మంజూరు చేసిందని వారు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే రాష్ట్రానికి కూడా మెడికల్ కాలేజీలను ఇచ్చిందని బీజేపీ నేత లు ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో అసలు వాస్తవం ఏంటనేది కేసీఆర్ ప్రభుత్వం తాజా గా `ఫ్యాక్ట్ చెక్` పేరుతో పెద్ద ఎత్తున ప్రచారంలోకి దిగింది.
రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ఈ ఏడాది నేషనల్ మెడికల్ కమిషన్ దేశవ్యాప్తంగా 50 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసిందని, వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలు ఉన్నాయని పేర్కొంది.
ఈ క్రమంలోనే తెలంగాణలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీలతో పాటు మరో 4 ప్రైవేట్ కాలేజీలకు NMC అనుమతులు ఇచ్చిందని తెలిపింది. వీటినే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోం దని .. కేసీఆర్ సర్కారు వివరించింది. ఆ సంస్థలు అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పాటిస్తున్నారని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 9 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని తెలిపింది.
కేవలం అనుమతులు మంజూరు చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు అర్థం వచ్చేలా కొందరు ప్రజా ప్రతినిధులు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇదిలావుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు.. కొందరు కేంద్రమే ఈ కాలేజీలను నిర్మిస్తోందని చెబుతుండగా.. కేంద్రం నుంచి తరచుగా వస్తున్న మంత్రులు మాత్రం .. తాము మెడికల్ కాలేజీలు ఇస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని చెబుతున్నారు. మొత్తంగా ఈ పరిణామం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్నికల ముందు బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టలేక సతమతం అవుతున్న విషయం ప్రస్తావనకు వస్తుండడం గమనార్హం.
This post was last modified on June 10, 2023 12:15 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…