జీయర్ ఆశ్రమం.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో కొత్తకాదు. పల్లెల అభివృద్ధి నుంచి నిరక్ష్యరాస్యతను తగ్గించే వరకు కూడా అనేక రూపాల్లో జీయర్ ఆశ్రమం చేసిన చేస్తున్న సేవలు దేశాంతర ఖ్యాతిని సముపార్జించు కున్నాయి. సుమారు 8 దశాబ్దాలుగా ఈ సేవలు దేశానికి, రాష్ట్రానికి కూడా అందుతున్నాయంటే అతిశయో క్తి కాదు. అయితే.. ఇన్ని సేవలు చేసినా.. ఎన్ని రకాలుగా సమాజానికి ఉపయోగపడినా.. ఎప్పుడు ఒక్క మాట కూడా పడకుండా.. జీయర్ ఆశ్రమం ముందుకుసాగింది.
ఇలాంటి సమయంలో ఇప్పుడు ఒక్కసారిగా కడివెడు కుండ పాలలో చిన్న ఉప్పుగల్లు మాదిరిగా రేగినపెను తుఫాను జీయర్ చరిత్రపై మరకలు పడేలా చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఆశ్రమంలో చినజీయర్ స్వామి తరువాత అంత పవర్ఫుల్ అయిన ఆయన మేనల్లుడు విష్ణు స్వామి వ్యవహారం అనూహ్యంగా ఆశ్రమ కార్యక్రమాలు, కార్యకలాపాల విషయంలో తీవ్ర వివాదంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం విష్ణు స్వామి జీయర్ విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. ఆశ్రమానికి వచ్చిన కొత్తల్లో.. విష్ణు స్వామి అక్కడ ఫోటోలు తీసి మీడియాకు అందిస్తుండే వారు. తరువాత కాలంలో జీయర్ ఆశ్రమానికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే బాధ్యత తీసుకున్నారు. చినజీయర్ స్వామి ఉత్తరాధికారి విష్ణు స్వామే అనే ప్రచారం సాగుతోంది. అయితే.. విష్ణు స్వామి.. పగలు స్వామి వేషంలోనూ తర్వాత.. సాయంత్రం వేళ.. ఆయన పబ్బులకు, క్లబ్బులకు తిరుగుతుంటానే ప్రచారం బయటకు వచ్చింది.
ఇది చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే.. జీయర్ ఆశ్రమాలకు.. ఇక్కడి నియమాలకు ఉన్న పేరు అఖండ ప్రపంచాన్ని సైతం ఆకర్షించింది. అమెరికాలోనూ అనేక ఆశ్రమాలు ఉన్నాయి. అలాంటి సంస్థ లో ఇప్పుడు విష్ణు స్వామి వ్యవహారం వివాదంగా మారడం గమనార్హం. మరి దీనిపై చినజీయర్ ఎలా వ్యవహారిస్తారో.. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on June 10, 2023 12:11 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…