గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జగనన్న ఇళ్లు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇళ్లను నిర్మిస్తున్నారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణాలు, నగరాల్లో సెంటు చొప్పున స్థలం కేటాయించారు. ఇదే సమ యంలో రాజధాని ప్రాంతంలో కూడా జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్థలాలను ఈ నెలలోనే కేటాయించింది. ఇప్పుడు ఇక్కడ ఇళ్లను కేవలం 90 రోజుల్లో నిర్మించేందుకు నిధులు కూడా కేటాయించింది.
అయితే,వాస్తవానికి ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఇప్పటికీ పునాదులుకూడా పడలేదు. పడిన చోట కూడా.. పునా దులు లేచిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఇక, మరోవైపు, సీఎం సొంత జిల్లా కడపలో నూ పునాదుల స్థాయి దాటలేదు. కానీ, రాజధాని ప్రాంతంలో పట్టుమని 15 రోజులు కూడా కాకముందే.. ఇళ్లను 90 రోజుల్లోనే నిర్మించేందుకు సీఎం జగన్ ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
ఆర్-5 జోన్ ఏర్పాటు, సెంటు పట్టాల పంపిణీతో తీవ్రంగా దెబ్బతిన్న రాజధాని రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల బాంబు వేసేందుకు సిద్ధమవుతోంది. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కురగల్లు, దొండపాడు, మందడం, కృష్ణాయపాలెం, ఐనవోలు గ్రామాల్లో ఇటీవల పంపిణీ చేసిన సెంటు స్థలాల్లో జూలై 8 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
తొలుత లబ్ధిదారులకు సర్వే కోడ్ ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్-3కి సంబంధించి కాంట్రాక్టర్లతో ఎంవోయూలు, బ్యాంకు అకౌంట్లు ప్రారంభించాలని సూచించింది. ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు వీలుగా నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్ ప్రక్రియ, లబ్ధిదారులకు రుణాలు అందజేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే… జిల్లాల పరిధిలో ఎలా ఉన్నా.. రాజధానిని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంలో భాగంగానే ప్రభుత్వం ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ఇళ్లను నిర్మిస్తోందనే ప్రచారం జరుగుతుండడం.. టీడీపీ నేతలు కూడా ఇదే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…