Political News

రాజ‌ధానిలో ఇళ్లు క‌ట్టేస్తున్నారు.. జ‌గ‌న్ వ్యూహం ఇదే!

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత జ‌గ‌న్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జ‌గ‌న‌న్న ఇళ్లు ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న ఇళ్ల‌ను నిర్మిస్తున్నారు. పేద‌ల‌కు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్న‌ర‌, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో సెంటు చొప్పున స్థ‌లం కేటాయించారు. ఇదే స‌మ యంలో రాజ‌ధాని ప్రాంతంలో కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున స్థ‌లాల‌ను ఈ నెల‌లోనే కేటాయించింది. ఇప్పుడు ఇక్క‌డ ఇళ్ల‌ను కేవ‌లం 90 రోజుల్లో నిర్మించేందుకు నిధులు కూడా కేటాయించింది.

అయితే,వాస్త‌వానికి ఎప్పుడో ఇచ్చిన ఇళ్ల‌కు ఇప్ప‌టికీ పునాదులుకూడా ప‌డ‌లేదు. ప‌డిన చోట కూడా.. పునా దులు లేచిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ ప‌రిస్థితి ఇలానే ఉంది. ఇక‌, మ‌రోవైపు, సీఎం సొంత జిల్లా క‌డ‌ప‌లో నూ పునాదుల స్థాయి దాట‌లేదు. కానీ, రాజ‌ధాని ప్రాంతంలో ప‌ట్టుమ‌ని 15 రోజులు కూడా కాకముందే.. ఇళ్ల‌ను 90 రోజుల్లోనే నిర్మించేందుకు సీఎం జ‌గ‌న్ ఏకంగా రెండు వేల కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది.

ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, సెంటు పట్టాల పంపిణీతో తీవ్రంగా దెబ్బతిన్న రాజధాని రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల బాంబు వేసేందుకు సిద్ధమవుతోంది. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కురగల్లు, దొండపాడు, మందడం, కృష్ణాయపాలెం, ఐనవోలు గ్రామాల్లో ఇటీవల పంపిణీ చేసిన సెంటు స్థలాల్లో జూలై 8 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్ర‌భుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

తొలుత లబ్ధిదారులకు సర్వే కోడ్‌ ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్‌-3కి సంబంధించి కాంట్రాక్టర్లతో ఎంవోయూలు, బ్యాంకు అకౌంట్లు ప్రారంభించాలని సూచించింది. ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు వీలుగా నీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్‌ ప్రక్రియ, లబ్ధిదారులకు రుణాలు అందజేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే… జిల్లాల ప‌రిధిలో ఎలా ఉన్నా.. రాజ‌ధానిని నిర్వీర్యం చేయాల‌నే ల‌క్ష్యంలో భాగంగానే ప్ర‌భుత్వం ఇక్క‌డ యుద్ధ ప్రాతిప‌దిక‌న ఇళ్ల‌ను నిర్మిస్తోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం.. టీడీపీ నేత‌లు కూడా ఇదే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Share

Recent Posts

వశిష్ఠ ఎవరిని ఉద్దేశించి అంటున్నారో

గత పాతికేళ్లలో ఎప్పుడూ అనుభవించని విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి చవి చూస్తున్న మాట వాస్తవం. సంక్రాంతికి కాకా విడుదల చేయాలనే…

35 minutes ago

ఏఐ దూకుడుకు బ్రేకులు? కేంద్రం కీలక నిర్ణయం!

ఏఐ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా, దానితో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్…

1 hour ago

రుక్మిణి ఆలోచించి అడుగులు వేయాలి

డిసెంబర్ లో ఫౌజీ రావడం లేదని ఏ క్షణాన లీకయ్యిందో కానీ అప్పటి నుంచి ఆ స్లాట్ కోసం రకరకాలుగా…

2 hours ago

హరిబాబు హత్య.. ‘న్యాయం’పై జనాల్లో ఈ అభిప్రాయం ఎందుకు?

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఒక విషయాన్ని ఆలోచించేలా చేస్తున్నాయి. తన…

3 hours ago

వైష్ణవి సోదరుడే హత్య చేశాడు

ఆరు నెలల క్రితం హత్యకు గురైన ప్రముఖ యూ ట్యూబర్ వైషు అమ్మ ఫేమ్ వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు…

5 hours ago

EMI కట్టలేదని కిడ్నాప్.. బ్లడ్ అమ్మేశారు

దేశంలో రోజురోజుకో రకమైన దారుణం జరుగుతుంది. ఊహించని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. కరుడుగట్టిన నేరస్తులు సైతం విస్తుపోయే విధంగా నేరాల…

5 hours ago