Political News

‘అమరావతిని 9 నెలల తర్వాత పరుగెత్తిస్తాం’

ఏపీలో గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా తీవ్ర వివాదంగా.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. రాజ‌ధాని అమ‌రావ‌తి. చంద్ర‌బాబు హ‌యాంలో దీనికి 2015లో శంకుస్థాప‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత‌.. రాజ‌ధాని లేకుండా ఏర్ప‌డిన ఏపీకి అత్య‌ద్భుత‌మైన న‌గ‌రం రాజ‌ధానిగా ఉండాల‌ని త‌ల‌పోసిన అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు.. దానికి అనుగుణంగానే 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేక‌రించారు. దీనిని అభివృద్ధి చేసేందుకు సింగ‌పూర్‌, దుబాయ్ దేశాల‌కు చెందిన క‌న్సల్టెన్సీల‌ను కూడా రప్పించారు. ఇక‌, ఇక్క‌డే స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టును నిర్మించారు.

మ‌రిన్ని ప‌నులు ప‌రుగులు పెట్టే ద‌శ‌లో ఉండ‌గా.. 2019లో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి బాట‌ప‌ట్టి.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, అప్ప‌టి నుంచి సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం.. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తాన‌ని అక్క‌డే కాపురం ఉంటాన‌ని కూడా ప్ర‌క‌టించారు. దీంతో రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన‌ రైతులు ఉద్య‌మానికి దిగారు. అనేక పాద‌యాత్ర‌లు చేశారు. ఇప్ప‌టికీ.. దీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రో 9 నెల‌ల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఒక రాజ‌ధాని న‌గ‌రం లేకుండా పోయింద‌నే వాద‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమరావతి విషయంలో ఆందోళన అక్కర్లేదని, టీడీపీ అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ కార్యకర్తల సదస్సులో పాల్గొన్న ఆయన.. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి విషయం చాలా విలువైందని, ప్రతి ఒక్కరికీ వీటిని చేరువ చేయాలని ఐటీడీపీ కార్యకర్తలకు సూచించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు రాజ‌ధాని అంశాన్ని కూడా ప్ర‌స్తావించారు. ఏపీలోనూ హైదరాబాద్‌కు దీటుగా మరో నగరం కట్టాలని సంకల్పించామ‌న్నారు.

అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, అందుకే అక్క‌డ అమ‌రావ‌తి వంటి స‌న్‌రైజ్ స్టేట్‌లో గొప్ప రాజ‌ధాని ని ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించామ‌న్నారు. పార్టీ పై విశ్వాసంతోనే 29 వేల మంది రైతులు భూములిచ్చారన్న చంద్ర‌బాబు టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమరావతిలో పనులు పరుగులు పెట్టిస్తామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఐటీడీపీ స‌ద‌స్సులో ఉన్నవారు త‌మ క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో మోతెక్కించ‌డం గ‌మ‌నార్హం. కాగా, వాస్త‌వానికి ఇటీవ‌ల జ‌రిగిన మ‌హానాడులోనే చంద్ర‌బాబు అమ‌రావ‌తిపై మాట్లాడ‌తార‌ని చాలా మంది ఎదురు చూశారు. కానీ, ఎందుకో అక్క‌డ మిస్స‌య్యారు.

This post was last modified on June 9, 2023 10:20 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

1 hour ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

1 hour ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

1 hour ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

3 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

3 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

5 hours ago