Political News

‘అమరావతిని 9 నెలల తర్వాత పరుగెత్తిస్తాం’

ఏపీలో గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా తీవ్ర వివాదంగా.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. రాజ‌ధాని అమ‌రావ‌తి. చంద్ర‌బాబు హ‌యాంలో దీనికి 2015లో శంకుస్థాప‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత‌.. రాజ‌ధాని లేకుండా ఏర్ప‌డిన ఏపీకి అత్య‌ద్భుత‌మైన న‌గ‌రం రాజ‌ధానిగా ఉండాల‌ని త‌ల‌పోసిన అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు.. దానికి అనుగుణంగానే 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేక‌రించారు. దీనిని అభివృద్ధి చేసేందుకు సింగ‌పూర్‌, దుబాయ్ దేశాల‌కు చెందిన క‌న్సల్టెన్సీల‌ను కూడా రప్పించారు. ఇక‌, ఇక్క‌డే స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టును నిర్మించారు.

మ‌రిన్ని ప‌నులు ప‌రుగులు పెట్టే ద‌శ‌లో ఉండ‌గా.. 2019లో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి బాట‌ప‌ట్టి.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, అప్ప‌టి నుంచి సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం.. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తాన‌ని అక్క‌డే కాపురం ఉంటాన‌ని కూడా ప్ర‌క‌టించారు. దీంతో రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన‌ రైతులు ఉద్య‌మానికి దిగారు. అనేక పాద‌యాత్ర‌లు చేశారు. ఇప్ప‌టికీ.. దీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రో 9 నెల‌ల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఒక రాజ‌ధాని న‌గ‌రం లేకుండా పోయింద‌నే వాద‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమరావతి విషయంలో ఆందోళన అక్కర్లేదని, టీడీపీ అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ కార్యకర్తల సదస్సులో పాల్గొన్న ఆయన.. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి విషయం చాలా విలువైందని, ప్రతి ఒక్కరికీ వీటిని చేరువ చేయాలని ఐటీడీపీ కార్యకర్తలకు సూచించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు రాజ‌ధాని అంశాన్ని కూడా ప్ర‌స్తావించారు. ఏపీలోనూ హైదరాబాద్‌కు దీటుగా మరో నగరం కట్టాలని సంకల్పించామ‌న్నారు.

అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, అందుకే అక్క‌డ అమ‌రావ‌తి వంటి స‌న్‌రైజ్ స్టేట్‌లో గొప్ప రాజ‌ధాని ని ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించామ‌న్నారు. పార్టీ పై విశ్వాసంతోనే 29 వేల మంది రైతులు భూములిచ్చారన్న చంద్ర‌బాబు టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమరావతిలో పనులు పరుగులు పెట్టిస్తామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఐటీడీపీ స‌ద‌స్సులో ఉన్నవారు త‌మ క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో మోతెక్కించ‌డం గ‌మ‌నార్హం. కాగా, వాస్త‌వానికి ఇటీవ‌ల జ‌రిగిన మ‌హానాడులోనే చంద్ర‌బాబు అమ‌రావ‌తిపై మాట్లాడ‌తార‌ని చాలా మంది ఎదురు చూశారు. కానీ, ఎందుకో అక్క‌డ మిస్స‌య్యారు.

This post was last modified on June 9, 2023 10:20 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

2 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

2 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

4 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

4 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

4 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

10 hours ago