Political News

‘అమరావతిని 9 నెలల తర్వాత పరుగెత్తిస్తాం’

ఏపీలో గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా తీవ్ర వివాదంగా.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. రాజ‌ధాని అమ‌రావ‌తి. చంద్ర‌బాబు హ‌యాంలో దీనికి 2015లో శంకుస్థాప‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత‌.. రాజ‌ధాని లేకుండా ఏర్ప‌డిన ఏపీకి అత్య‌ద్భుత‌మైన న‌గ‌రం రాజ‌ధానిగా ఉండాల‌ని త‌ల‌పోసిన అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు.. దానికి అనుగుణంగానే 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేక‌రించారు. దీనిని అభివృద్ధి చేసేందుకు సింగ‌పూర్‌, దుబాయ్ దేశాల‌కు చెందిన క‌న్సల్టెన్సీల‌ను కూడా రప్పించారు. ఇక‌, ఇక్క‌డే స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టును నిర్మించారు.

మ‌రిన్ని ప‌నులు ప‌రుగులు పెట్టే ద‌శ‌లో ఉండ‌గా.. 2019లో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి బాట‌ప‌ట్టి.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, అప్ప‌టి నుంచి సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం.. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తాన‌ని అక్క‌డే కాపురం ఉంటాన‌ని కూడా ప్ర‌క‌టించారు. దీంతో రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన‌ రైతులు ఉద్య‌మానికి దిగారు. అనేక పాద‌యాత్ర‌లు చేశారు. ఇప్ప‌టికీ.. దీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రో 9 నెల‌ల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఒక రాజ‌ధాని న‌గ‌రం లేకుండా పోయింద‌నే వాద‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమరావతి విషయంలో ఆందోళన అక్కర్లేదని, టీడీపీ అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ కార్యకర్తల సదస్సులో పాల్గొన్న ఆయన.. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి విషయం చాలా విలువైందని, ప్రతి ఒక్కరికీ వీటిని చేరువ చేయాలని ఐటీడీపీ కార్యకర్తలకు సూచించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు రాజ‌ధాని అంశాన్ని కూడా ప్ర‌స్తావించారు. ఏపీలోనూ హైదరాబాద్‌కు దీటుగా మరో నగరం కట్టాలని సంకల్పించామ‌న్నారు.

అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, అందుకే అక్క‌డ అమ‌రావ‌తి వంటి స‌న్‌రైజ్ స్టేట్‌లో గొప్ప రాజ‌ధాని ని ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించామ‌న్నారు. పార్టీ పై విశ్వాసంతోనే 29 వేల మంది రైతులు భూములిచ్చారన్న చంద్ర‌బాబు టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమరావతిలో పనులు పరుగులు పెట్టిస్తామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఐటీడీపీ స‌ద‌స్సులో ఉన్నవారు త‌మ క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో మోతెక్కించ‌డం గ‌మ‌నార్హం. కాగా, వాస్త‌వానికి ఇటీవ‌ల జ‌రిగిన మ‌హానాడులోనే చంద్ర‌బాబు అమ‌రావ‌తిపై మాట్లాడ‌తార‌ని చాలా మంది ఎదురు చూశారు. కానీ, ఎందుకో అక్క‌డ మిస్స‌య్యారు.

Satya

Recent Posts

వారణాసి లెక్కలు వేరే ఉన్నాయి

వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…

7 minutes ago

సెట్ కి రాకుండా సినిమా తీసిన సింగీతం

దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…

4 hours ago

బ్రాండింగ్ లో బాబు, పవన్ తర్వాతే ఎవరైనా!

నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…

6 hours ago

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

10 hours ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

12 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

14 hours ago