Political News

మోదీకి కేటీఆర్ మ‌ద్ద‌తు…ష‌ర‌తు‌లు వ‌ర్తిస్తాయి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య మాల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీ ఈ క్ర‌మంలో అందివ‌చ్చే ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటోంది. మ‌రో వైపు టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీని టార్గెట్ చేయ‌డంలో ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు.

తాజాగా బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అయోధ్య‌లో రామ‌మందిరం విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌లు ప్ర‌వ‌చించే రామ‌రాజ్యానికి జై కొడుతూనే….త‌మ‌దైన ష‌ర‌తులు పెట్టారు.

సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల‌తో అనుసంధానం అవ‌డంలో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించే కేటీఆర్ తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా, ఆస్క్ కేటీఆర్ పేరుతో క‌నెక్ట్ అయ్యారు. నెటిజ‌న్లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఇచ్చారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి తెలంగాణ యొక్క భాగస్వామ్యం ఏమిటన్న ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా కుల,మత, తరగతులకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు, గౌరవం వంటి లభించే రామ రాజ్యం రావాలి అని త‌న ఆకాంక్ష‌‌ను మంత్రి కేటీఆర్ వ్య‌క్తం చేశారు. త‌ద్వారా బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చే సిద్ధాంతానికి పూర్తి మ‌ద్ద‌తు ఇ్వ‌వ‌కుండా… అన్ని వ‌ర్గాల కోణంలో దానికి సంఘీభావం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌క‌మైన ఆయుష్మాన్ భారత్ గురించి సైతం కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శ్రీ అత్యుత్తమమైన స్కీమ్ అని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ నమూనా పైన ఆధారపడి ఉందని తెలిపారు.

This post was last modified on August 10, 2020 6:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మార్కో అంద‌రినీ చెడగొట్టేసాడా?

గ‌త ఏడాది మ‌ల‌యాళంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జ‌న‌తా గ్యారేజ్, భాగ‌మ‌తి…

12 minutes ago

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

5 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

11 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

14 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

16 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

17 hours ago