Political News

మోదీకి కేటీఆర్ మ‌ద్ద‌తు…ష‌ర‌తు‌లు వ‌ర్తిస్తాయి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య మాల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీ ఈ క్ర‌మంలో అందివ‌చ్చే ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటోంది. మ‌రో వైపు టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీని టార్గెట్ చేయ‌డంలో ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు.

తాజాగా బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అయోధ్య‌లో రామ‌మందిరం విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌లు ప్ర‌వ‌చించే రామ‌రాజ్యానికి జై కొడుతూనే….త‌మ‌దైన ష‌ర‌తులు పెట్టారు.

సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల‌తో అనుసంధానం అవ‌డంలో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించే కేటీఆర్ తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా, ఆస్క్ కేటీఆర్ పేరుతో క‌నెక్ట్ అయ్యారు. నెటిజ‌న్లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఇచ్చారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి తెలంగాణ యొక్క భాగస్వామ్యం ఏమిటన్న ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా కుల,మత, తరగతులకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు, గౌరవం వంటి లభించే రామ రాజ్యం రావాలి అని త‌న ఆకాంక్ష‌‌ను మంత్రి కేటీఆర్ వ్య‌క్తం చేశారు. త‌ద్వారా బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చే సిద్ధాంతానికి పూర్తి మ‌ద్ద‌తు ఇ్వ‌వ‌కుండా… అన్ని వ‌ర్గాల కోణంలో దానికి సంఘీభావం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌క‌మైన ఆయుష్మాన్ భారత్ గురించి సైతం కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శ్రీ అత్యుత్తమమైన స్కీమ్ అని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ నమూనా పైన ఆధారపడి ఉందని తెలిపారు.

This post was last modified on August 10, 2020 6:59 am

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

2 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

2 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

4 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

5 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

6 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

6 hours ago