Political News

ఒడిశా రైలు ప్రమాదం: 101 మృతదేహాలను దాచేందుకు భారీ ప్లానింగ్

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంబంధించిన సవాళ్లు ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 175 మంది మరణిస్తే.. దుర్ఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా.. ఇప్పటికి ఆచూకీ తెలియని మృతుల సంఖ్య 101గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ 101 మృతదేహాలను ప్రస్తుతం స్థానిక ఎయిమ్స్ ప్రాంగణంలో ఉంచారు. అయితే.. ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచే సౌకర్యం లేకపోవటంతో 101 మృతదేహాలను భద్రపర్చటం పెద్ద సమస్యగా మారింది.

దీనికి పరిష్కారంగా పారాదీప్ పోర్టు వర్గాలతో సంప్రదింపులు జరిపి.. మూడు భారీ కంటైనర్లను తెప్పిస్తున్నారు. ఒక్కో కంటైనర్ లో 40-50 వరకు 101 మృతదేహాలను భద్రపరిచే వీలుందని చెబుతున్నారు. ఈ భారీ కంటైనర్లలో ఉన్న ప్రత్యేక వసతుల కారణంగా డెడ్ బాడీలు చెడిపోకుండా దాదాపు 2 నెలల పాటు ఉంటాయని భావిస్తున్నారు. మరణించిన వారిని గుర్తించేందుకు వీలుగా ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. మరణించిన వారిలో అత్యధికులు కార్మికులు ఉండటంతో.. వారికి సంబంధించిన గుర్తింపు కార్డులు వారి వెంట లేకపోవటంతో వారి ఆచూకీని గుర్తించటం కష్టంగా మారింది.

మరో విషాదకరమైన అంశం ఏమంటే.. మరణించిన వారిని తమ బంధువులుగా ఇద్దరు.. ముగ్గురు క్లెయిం చేయటంతో విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. ముఖాలు నలిగిపోయి ఉండటంతో.. గుర్తించే విషయంలో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. డెడ్ బాడీలు మారకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మృతదేహాలను కుటుంబీకులకు ఇచ్చే వేళలో.. డీఎన్ఏ పరీక్ష జరిపి ఇవ్వాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. గుర్తించిన మృతులను ప్రభుత్వ ఖర్చులతో వారి ఇళ్లకు చేరుస్తున్నారు. మరణ ధ్రువీకరణ పత్రాలను పోస్టు ద్వారా పంపుతారని చెబుతున్నారు.

This post was last modified on June 6, 2023 3:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

3 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

5 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

7 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

8 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

9 hours ago