Political News

మేనిఫెస్టో పబ్లిసిటీ… పక్కా ప్లానింగ్ తో!

జనాల ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో తెలుగుదేశంపార్టీ తొందరలోనే వినూత్న కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతోంది. 150 రోజుల పాటు జనాల్లోనే ఉండి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీన చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి మహానాడులో మొదటి విడత మ్యానిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మ్యానిఫెస్టోకు భవిష్యత్తుకు గ్యారెంటీ అని పేరుపెట్టారు. అందులో ఆరు పథకాలను చంద్రబాబు ప్రస్తావించారు.

నిరుద్యోగులకు నెలకు రు. 3 వేల భృతి, 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు, జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు ఏడాదికి రు. 20 వేలు, 18-59 వయసులోని ఆడపిల్లలు, మహిళలకు నెలకు రు. 1500 పెన్షన్ చంద్రబాబు ప్రకటించారు. మ్యానిఫెస్టోను చంద్రబాబు ఆచరిస్తారా ? ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా ? అని మాత్రం అడక్కూడదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ హామీలిచ్చారు జనాలు వినాలంతే.

రాష్ట్రంలోని పేదలందరినీ ధనికులను చేయటానికి తాను కంకణం కట్టుకున్నట్లు చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. పేదలను ధనికులుగా ఎలాచేస్తారంటే మాత్రం చెప్పరు. దీనికి పూర్ టు రిచ్ అనే కాన్సెప్టు తయారుచేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ఓ ఐదు పేదకుటుంబాలను ధనికులు దత్తత తీసుకోవాలట. ధనికులు దత్తత తీసుకోగానే పేదలు రిచ్ అయిపోతారు కదాన్నది చంద్రబాబు కాన్సెప్టు. బహుశా దీన్ని మరింతగా వివరించి చెబుతారేమో చూడాలి.

ఇప్పటికైతే భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళేందుకు పార్టీ నేతలంతా 150 రోజులు కష్టపడాల్సిందే అనిచెప్పారు. గ్రామస్ధాయి నుండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ వరకు పార్టీ శ్రేణులు భవిష్యత్తుకు గ్యారెంటీని బాగా ప్రచారంచేయాలని ఆదేశించారు. ఈనెల 10వ తేదీనుండి ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతోంది. ఎన్నికలకు ఎంతో వ్యవధిలేదు కాబట్టి నేతలంతా సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు జనాల్లోకి మ్యానిఫెస్టోను తీసుకెళ్ళాలన్నారు. కార్యక్రమం నిర్వహణకు అవసరమైన రూట్ మ్యాప్ ను పార్టీ రెడీచేస్తోంది. భవిష్యత్తులో ప్రకటించే రెండోవిడత మ్యానిఫెస్టోకు అప్పుడు మళ్ళీ మరో కార్యక్రమాన్ని చేపడతారు.

This post was last modified on June 6, 2023 11:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago