Political News

రామోజీ కేసులన్నీ ఏపీకివ్వండి… సుప్రీంకోర్టును అడిగిన సీఐడీ..

మార్గదర్శి మోసాలపై నమోదు చేసిన అన్ని కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మార్గదర్శి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుంటే లక్షల్లో ఉన్నారు. వీళ్ళంతా ఏపీ, తెలంగాణా, కర్నాటకతో పాటు కొందరు తమిళనాడు, కేరళలో కూడా ఉన్నారు. అయితే ఏపీ, తెలంగాణా, కర్నాటకలోనే లక్షల్లో ఉన్నారు. మార్గదర్శిలో మోసాలు జరిగాయని సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్ రామోజీరావును ఏ1 గా కోడలు, ఎండీ శైలజను ఏ2గా సీఐడీ కేసులు నమోదుచేసి విచారిస్తోంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే ఖాతాదారులు, బ్రాంచీలు ఎక్కువగా ఏపీలో ఉన్నాయి. కాబట్టి సీఐడీ నమోదు చేసిన కేసులు కూడా ఏపీకి సంబంధించనవే ఎక్కువ. అయితే సంస్ధ కార్పొరేట్ ఆఫీస్, ఛైర్మన్, ఎండీ, బోర్డాఫ్ డైరక్టర్లంతా హైదరాబాద్ లో ఉంటారు. అందుకనే ఏపీలో నమోదైన కేసులపై ఛైర్మన్, ఎండీ తదితరులను విచారించాలంటే కష్టంగా ఉంది.

ఏపీలో మోసాలు జరిగిందని చెప్పి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆఫీసులు తనిఖీలు చేయటం ఏమిటని, తమపై ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదని రకరకాల కారణాలను చూపి రామోజీ కేసులు వేశారు. అయితే వీటిని తెలంగాణా హైకోర్టు పట్టించుకోలేదు. అందుకనే మార్గదర్శి బ్రాంచీలలో జరిగిన మోసాలకు ఛైర్మన్ గా తనకు ఎలాంటి సంబంధం లేదని బ్రాంచ్ మేనేజర్లనే బాధ్యులను చేయాలని అడ్డుగోలుగా వాదించారు. దీన్ని కూడా హైకోర్టు పట్టించుకోలేదు.

కార్పొరేట్ ఆఫీస్ లో సోదాలు చేసుకోవచ్చని, విచారణ చేసుకోవచ్చని చెప్పింది. దాని ప్రకారమే సీఐడీ ఇప్పటికే రామోజీ తో పాటు శైలజను రెండుసార్లు విచారించింది. అయితే విచారణను స్పీడు పెంచేందుకే మార్గదర్శి కేసులన్నింటినీ ఏపీ హైకోర్టులోకి మార్చాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. అన్నీ కేసులు ఏపీ హైకోర్టులోనే విచారించేట్లయితే తమ దర్యాప్తు స్పీడందుకుంటుందని ప్రభుత్వం పిటీషన్లో చెప్పింది. ఇప్పటికే తమ విచారణలో భాగంగా రు. 793 కోట్ల ఆస్తులను ప్రభుత్వం ఎటాచ్ చేసింది. ఏపీ ప్రభుత్వం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తే దర్యాప్తు మరింత స్పీడందుకుంటుంది.

This post was last modified on June 6, 2023 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

2 hours ago

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

2 hours ago

‘అందుకే ఇండస్ట్రీని వదిలేశా’

పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…

2 hours ago

తప్పు త్వరగా తెలుసుకున్న సీఎం విజయ్

టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…

3 hours ago

ఇంట్లో నేపాలీలు ఉంటే జాగ్రత్త

రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…

4 hours ago

IBOMMA 2.0: అరెస్ట్ అయినా ఆగలేదేంటి?

చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…

4 hours ago