Political News

రామోజీ కేసులన్నీ ఏపీకివ్వండి… సుప్రీంకోర్టును అడిగిన సీఐడీ..

మార్గదర్శి మోసాలపై నమోదు చేసిన అన్ని కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మార్గదర్శి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుంటే లక్షల్లో ఉన్నారు. వీళ్ళంతా ఏపీ, తెలంగాణా, కర్నాటకతో పాటు కొందరు తమిళనాడు, కేరళలో కూడా ఉన్నారు. అయితే ఏపీ, తెలంగాణా, కర్నాటకలోనే లక్షల్లో ఉన్నారు. మార్గదర్శిలో మోసాలు జరిగాయని సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్ రామోజీరావును ఏ1 గా కోడలు, ఎండీ శైలజను ఏ2గా సీఐడీ కేసులు నమోదుచేసి విచారిస్తోంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే ఖాతాదారులు, బ్రాంచీలు ఎక్కువగా ఏపీలో ఉన్నాయి. కాబట్టి సీఐడీ నమోదు చేసిన కేసులు కూడా ఏపీకి సంబంధించనవే ఎక్కువ. అయితే సంస్ధ కార్పొరేట్ ఆఫీస్, ఛైర్మన్, ఎండీ, బోర్డాఫ్ డైరక్టర్లంతా హైదరాబాద్ లో ఉంటారు. అందుకనే ఏపీలో నమోదైన కేసులపై ఛైర్మన్, ఎండీ తదితరులను విచారించాలంటే కష్టంగా ఉంది.

ఏపీలో మోసాలు జరిగిందని చెప్పి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆఫీసులు తనిఖీలు చేయటం ఏమిటని, తమపై ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదని రకరకాల కారణాలను చూపి రామోజీ కేసులు వేశారు. అయితే వీటిని తెలంగాణా హైకోర్టు పట్టించుకోలేదు. అందుకనే మార్గదర్శి బ్రాంచీలలో జరిగిన మోసాలకు ఛైర్మన్ గా తనకు ఎలాంటి సంబంధం లేదని బ్రాంచ్ మేనేజర్లనే బాధ్యులను చేయాలని అడ్డుగోలుగా వాదించారు. దీన్ని కూడా హైకోర్టు పట్టించుకోలేదు.

కార్పొరేట్ ఆఫీస్ లో సోదాలు చేసుకోవచ్చని, విచారణ చేసుకోవచ్చని చెప్పింది. దాని ప్రకారమే సీఐడీ ఇప్పటికే రామోజీ తో పాటు శైలజను రెండుసార్లు విచారించింది. అయితే విచారణను స్పీడు పెంచేందుకే మార్గదర్శి కేసులన్నింటినీ ఏపీ హైకోర్టులోకి మార్చాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. అన్నీ కేసులు ఏపీ హైకోర్టులోనే విచారించేట్లయితే తమ దర్యాప్తు స్పీడందుకుంటుందని ప్రభుత్వం పిటీషన్లో చెప్పింది. ఇప్పటికే తమ విచారణలో భాగంగా రు. 793 కోట్ల ఆస్తులను ప్రభుత్వం ఎటాచ్ చేసింది. ఏపీ ప్రభుత్వం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తే దర్యాప్తు మరింత స్పీడందుకుంటుంది.

This post was last modified on June 6, 2023 11:07 am

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

3 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

3 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

3 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

4 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

4 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

4 hours ago