Political News

రామోజీ కేసులన్నీ ఏపీకివ్వండి… సుప్రీంకోర్టును అడిగిన సీఐడీ..

మార్గదర్శి మోసాలపై నమోదు చేసిన అన్ని కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మార్గదర్శి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుంటే లక్షల్లో ఉన్నారు. వీళ్ళంతా ఏపీ, తెలంగాణా, కర్నాటకతో పాటు కొందరు తమిళనాడు, కేరళలో కూడా ఉన్నారు. అయితే ఏపీ, తెలంగాణా, కర్నాటకలోనే లక్షల్లో ఉన్నారు. మార్గదర్శిలో మోసాలు జరిగాయని సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్ రామోజీరావును ఏ1 గా కోడలు, ఎండీ శైలజను ఏ2గా సీఐడీ కేసులు నమోదుచేసి విచారిస్తోంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే ఖాతాదారులు, బ్రాంచీలు ఎక్కువగా ఏపీలో ఉన్నాయి. కాబట్టి సీఐడీ నమోదు చేసిన కేసులు కూడా ఏపీకి సంబంధించనవే ఎక్కువ. అయితే సంస్ధ కార్పొరేట్ ఆఫీస్, ఛైర్మన్, ఎండీ, బోర్డాఫ్ డైరక్టర్లంతా హైదరాబాద్ లో ఉంటారు. అందుకనే ఏపీలో నమోదైన కేసులపై ఛైర్మన్, ఎండీ తదితరులను విచారించాలంటే కష్టంగా ఉంది.

ఏపీలో మోసాలు జరిగిందని చెప్పి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆఫీసులు తనిఖీలు చేయటం ఏమిటని, తమపై ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదని రకరకాల కారణాలను చూపి రామోజీ కేసులు వేశారు. అయితే వీటిని తెలంగాణా హైకోర్టు పట్టించుకోలేదు. అందుకనే మార్గదర్శి బ్రాంచీలలో జరిగిన మోసాలకు ఛైర్మన్ గా తనకు ఎలాంటి సంబంధం లేదని బ్రాంచ్ మేనేజర్లనే బాధ్యులను చేయాలని అడ్డుగోలుగా వాదించారు. దీన్ని కూడా హైకోర్టు పట్టించుకోలేదు.

కార్పొరేట్ ఆఫీస్ లో సోదాలు చేసుకోవచ్చని, విచారణ చేసుకోవచ్చని చెప్పింది. దాని ప్రకారమే సీఐడీ ఇప్పటికే రామోజీ తో పాటు శైలజను రెండుసార్లు విచారించింది. అయితే విచారణను స్పీడు పెంచేందుకే మార్గదర్శి కేసులన్నింటినీ ఏపీ హైకోర్టులోకి మార్చాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. అన్నీ కేసులు ఏపీ హైకోర్టులోనే విచారించేట్లయితే తమ దర్యాప్తు స్పీడందుకుంటుందని ప్రభుత్వం పిటీషన్లో చెప్పింది. ఇప్పటికే తమ విచారణలో భాగంగా రు. 793 కోట్ల ఆస్తులను ప్రభుత్వం ఎటాచ్ చేసింది. ఏపీ ప్రభుత్వం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తే దర్యాప్తు మరింత స్పీడందుకుంటుంది.

This post was last modified on June 6, 2023 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago