Political News

ప‌దే ప‌ది నెల‌లు… వైసీపీ, టీడీపీ టార్గెట్లు మామూలుగా లేవే…!

వైసీపీ వ్యూహాలు మారుతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వ్యూహం కూడా పూర్తిస్థాయిలో మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో 10 మాసాల్లో ఎన్నికలు జరగనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల వచ్చినా లేదా షెడ్యూల్ ప్రకారం 2024 మార్చిలోనే ఎన్నికలు జరిగినా కూడా ఈ ఉండేటటువంటి మధ్యకాలం అంతా కూడా ఇరు నాయకులు అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లో ఉండేలా వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతానికి చూసుకుంటుంటే చంద్రబాబునాయుడు మినీ మేనిఫెస్టో ప్రకటించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కానీ మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి తాను కూడా జిల్లాల వారీగా అవసరమైతే మండ‌లాల‌ వారీగా కూడా యాత్రలు చేయాలి లేదా ప్రజల్లోకి వెళ్లాలి, బస్సు యాత్రలు చేయాలని అనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారని స‌మాచారం.

ఇక ప్రస్తుతం టిడిపి ప్రకటించినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా ప్రజల్లో ఉండాలని నిర్ణ‌యించినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా వైసిపిలో టిడిపి మినీ మేనిఫెస్టో క‌ల‌వ‌రం రేపింద‌నే చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఉచితల వైపు మళ్ళించినటువంటి పాపం వైసిపిదే. ఇప్పుడు అదే ఉచిత ప‌థ‌కాల‌ను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంటే దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం వైసీపీ కనిపించడం లేదు.

అలాగని అలా చూస్తూ వదిలేస్తే.. ప్రజలు వైసిపి నుంచి దూరమై టిడిపికి మళ్లుతారని ఓ వర్గం వైసీపీ నాయకులు భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాల‌ని చెబుతున్నారు. ఈ పది మాసాలు ప్రజల్లోనే ఉండేలా ముఖ్య నాయకులు అందరూ కూడా వైసిపి అధినేత కానివ్వండి మంత్రులు కానీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోతిప్పుతున్నారు.

ఇది చాలదు మరింతగా ప్రజలను క‌ల‌వ‌డంతో పాటు టీడీపీ మేనిఫెస్టోని ఎండగట్టాలి అనేటటువంటి వ్యూహాత్మక ఆలోచ‌న‌దిశ‌గా వైసిపి అధిష్టానం క‌దులుతున్న‌ట్టు తెలుస్తోంది. వైసిపి, టిడిపి రెండు కూడా వచ్చే ఎన్నికల‌కు పది మాసాల ముందే ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమై ప్రజలను త‌మ‌వైపు తిప్పుకొనే ప్రయత్నాలు మరింత ఎక్కువగా చేయ‌నున్నాయి. అయితే ప్రజలు ఎటు మొగ్గుతారు అనేది చూడాలి.

వైసిపి ఇప్పటికే ఇస్తున్న పథకాలు చూసి వైసిపి వైపే ఉంటారా చంద్రబాబునాయుడు ఇస్తానంటున్న పథకాలను చూసి చంద్రబాబు నాయుడు వైపు మొగ్గుతారా అనేది ఆసక్తిగా మారింది ఎలా చూసుకున్నప్ప టికీ కూడా వైసిపి టిడిపిలు కూడా రెండు ప్రజల మధ్య ఉంటాయ‌నేది వాస్తవం. దీనికి సంబంధించి ఎప్పటికి ఒక గ్రాఫ్ ను టిడిపి నిర్ణయించుకోగా వైసిపి రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

This post was last modified on June 5, 2023 4:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago