Political News

ఆ 10 సీట్లు మాకివ్వండి.. లోకేష్‌

క‌డ‌ప‌లో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాల‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారాలోకేష్ ప్ర‌జ‌ల‌ను కోరారు. 2024 ఎన్నికల్లో అదే 10 సీట్లు టీడీపీకి ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం.. చెయ్యకపోతే కాలర్ పట్టుకొని నన్ను నిలదీయండి అని వ్యాఖ్యానించారు. టీడీపీ రాజంపేట పార్లమెంటు నుంచి 12 సార్లు బలిజ వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే, జగన్ రెడ్డి రాజంపేట ఎంపీ సీటును మిథున్ రెడ్డికి కట్టబెట్టి బలిజలను వంచించారని విమర్శించారు.

తిరుపతి అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ బలిజలకు కేటాయిస్తే, జగన్ రెడ్డి సొంత వర్గానికి కట్టబెట్టా డని అన్నారు. బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యకు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించామ‌ని లోకేష్‌ గుర్తు చేశారు. బ‌లిజ‌ల అభ్యున్న‌తి కోసం టీడీపీ విశేషంగా కృషి చేసిందని అన్నారు. గతంలో అమలు చేసిన రిజర్వేషన్ కి కట్టుబడి ఉన్నామని, జగన్ కక్ష తో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బలిజలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తామ‌ని వారిని గెలిపించుకోవాలని కోరారు.

క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజకవర్గం భూమయ్యగారి పల్లి క్యాంప్ సైట్ వద్ద బలిజ సామాజిక వర్గాలతో నారా లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. బలిజలు జగన్ చేతిలో బాధితులుగా మారారని.. రాయల సీమలో బలిజల్ని జగన్ ప్రభుత్వం పట్టించు కోలేదని అన్నారు. తన పిల్లలు విదేశాల్లో చదివితే చాలు.. పేద విద్యార్థులు విదేశాల్లో చదవకూడదు అనే ఆలోచనలో జగన్ విదేశీ విద్య పథకం రద్దు చేశారని విమర్శించారు.

గతంలో కాపులకు అమలు చేసిన రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నామన్న లోకేష్‌… జగన్ కక్ష పూరిత వైఖ‌రితో కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారనీ పేర్కొన్నారు. జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని భ్రష్టు పట్టించి తల్లిదండ్రులు, విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. సీఎం సొంత జిల్లా అంటే ఎలా అభివృద్ధి చెందాలి? కేవలం జయంతి, వర్ధంతికి తప్ప కడప జగన్కి గుర్తు రావడం లేదని విమర్శించారు.

This post was last modified on June 5, 2023 11:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 hour ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago