Political News

బీజేపీ భారీ ప్రణాళిక

రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్నది కమలనాదుల పట్టుదల. ఇందుకు ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెలలోనే నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు పర్యటించబోతున్నారు. ముగ్గురి రాక సందర్భంగా తెలంగాణాలోని మూడు ప్రాంతాల్లో బీజేపీ భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదే విషయమై పార్టీ చీఫ్ బండి సంజయ్ సీనియర్లందరితోను మాట్లాడుతున్నారు.

బహిరంగసభలను సక్సెస్ చేయటం ద్వారా రాబోయే ఎన్నికల్లో గెలవబోయేది బీజేపీనే అనే సంకేతాలను జనాలకు ఇవ్వాలన్నది బీజేపీ నేతల టార్గెట్. గడచిన తొమ్మిదేళ్ళుగా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమపథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. ఇది సరిపోవన్నట్లుగా అవకాశం ఉన్న ప్రతిచోట భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేస్తోంది. బండి ఇప్పటికే మూడుసార్లు పాదయాత్రల పేరుతో జనాల్లో విస్తృతంగా తిరిగారు.

ఒకవైపు ఇవన్నీ చేసుకుంటునే మరోవైపు ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకునే విషయంమీద కూడా నేతలు దృష్టిపెట్టారు. ఇతరపార్టీల్లోని నేతలను చేర్చుకునేందుకు ఈటల రాజేందర్ లాంటి నేతలు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా సక్సెస్ కావటంలేదు. కాంగ్రెస్ లో నుండి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మహేశ్వరరెడ్డి లాంటి ఇద్దరు ముగ్గురు నేతలు తప్ప ఇంకెవరు చేరలేదు. అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి, లింగయ్య గౌడ్ లాంటి నేతలు బీఆర్ఎస్ నేతలు చేరారు. ఇదంతా కూడా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల నేపధ్యంలో జరిగింది.

అప్పటినుండి ఇప్పటివరకు మళ్ళీ చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ బీజేపీ వైపు కూడా చూడలేదు. ఇంతలో కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించటం కూడా బీజేపీ ప్రయత్నాలకు గండికొట్టింది. సో ఇపుడు నేతలను చేర్చుకునే విషమం మీద కూడా అమిత్ , జేపీ నడ్డాలు సీరియస్ గా దృష్టిపెట్టారట. ఇతర పార్టీల్లో ఇమడలేకపోతున్న నేతలను గుర్తించి అలాంటివారిని డైరెక్టుగా అమిత్ షా తోనే చర్చలు జరిపేట్లుగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ మోడీ, అమిత్, నడ్డాల బహిరంగసభలకు ముందే జరిగిపోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ఇం ఎంతోకాలం లేదుకాబట్టే.

This post was last modified on June 5, 2023 9:47 am

Share
Show comments
Published by
Satya
Tags: BJPTelangana

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago