Political News

బీజేపీ భారీ ప్రణాళిక

రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్నది కమలనాదుల పట్టుదల. ఇందుకు ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెలలోనే నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు పర్యటించబోతున్నారు. ముగ్గురి రాక సందర్భంగా తెలంగాణాలోని మూడు ప్రాంతాల్లో బీజేపీ భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదే విషయమై పార్టీ చీఫ్ బండి సంజయ్ సీనియర్లందరితోను మాట్లాడుతున్నారు.

బహిరంగసభలను సక్సెస్ చేయటం ద్వారా రాబోయే ఎన్నికల్లో గెలవబోయేది బీజేపీనే అనే సంకేతాలను జనాలకు ఇవ్వాలన్నది బీజేపీ నేతల టార్గెట్. గడచిన తొమ్మిదేళ్ళుగా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమపథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. ఇది సరిపోవన్నట్లుగా అవకాశం ఉన్న ప్రతిచోట భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేస్తోంది. బండి ఇప్పటికే మూడుసార్లు పాదయాత్రల పేరుతో జనాల్లో విస్తృతంగా తిరిగారు.

ఒకవైపు ఇవన్నీ చేసుకుంటునే మరోవైపు ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకునే విషయంమీద కూడా నేతలు దృష్టిపెట్టారు. ఇతరపార్టీల్లోని నేతలను చేర్చుకునేందుకు ఈటల రాజేందర్ లాంటి నేతలు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా సక్సెస్ కావటంలేదు. కాంగ్రెస్ లో నుండి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మహేశ్వరరెడ్డి లాంటి ఇద్దరు ముగ్గురు నేతలు తప్ప ఇంకెవరు చేరలేదు. అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి, లింగయ్య గౌడ్ లాంటి నేతలు బీఆర్ఎస్ నేతలు చేరారు. ఇదంతా కూడా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల నేపధ్యంలో జరిగింది.

అప్పటినుండి ఇప్పటివరకు మళ్ళీ చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ బీజేపీ వైపు కూడా చూడలేదు. ఇంతలో కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించటం కూడా బీజేపీ ప్రయత్నాలకు గండికొట్టింది. సో ఇపుడు నేతలను చేర్చుకునే విషమం మీద కూడా అమిత్ , జేపీ నడ్డాలు సీరియస్ గా దృష్టిపెట్టారట. ఇతర పార్టీల్లో ఇమడలేకపోతున్న నేతలను గుర్తించి అలాంటివారిని డైరెక్టుగా అమిత్ షా తోనే చర్చలు జరిపేట్లుగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ మోడీ, అమిత్, నడ్డాల బహిరంగసభలకు ముందే జరిగిపోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ఇం ఎంతోకాలం లేదుకాబట్టే.

This post was last modified on June 5, 2023 9:47 am

Share
Show comments
Published by
Satya
Tags: BJPTelangana

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago